జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఒక పేషెంట్ కు చికిత్స నిమిత్తం రక్తం అవసరం కాగా వారి కుటుంబ సభ్యులు రాయికల్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు కడకుంట్ల జగదీశ్వర్ సంప్రదించగా సొంత వాహనంలో కరీంనగర్ లోని అపోలో ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేశాడు. ఈ సందర్భంగా కడకుంట్ల జగదీశ్వర్ మాట్లాడుతూ రక్తదానం వలన మరో వ్యక్తికి ప్రాణం నిలుస్తుంది వ్యక్తిగతంగా ఇంతకన్నా గొప్ప పని ఇంకేముంది ఇప్పటివరకు నేను 12 సార్లు రక్తదానం చేశాను. ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని. రక్తదానంతో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు.