గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన సుమారు 130 ట్రాక్టర్ల ఇసుక డంపులను పోలీసులు గుర్తించారు. వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి, వారి సమక్షంలో ఇసుకను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, “ఇసుకను స్వలాభం కోసం అక్రమంగా నిల్వ చేస్తే ఉపేక్షించము. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవు” అంటూ హెచ్చరించారు.