హిందువుగా పుట్టడమే శా (పా)పమా..? బంగ్లాదేశ్ భయానక పరిస్థితులు గమనిస్తుంటే దేశ విభజన నాటి గాయాలు గుర్తుకొస్తున్నాయి. రిజర్వేషన్ల ముసుగులో ఆందోళన చేపట్టిన అల్లరి మూఖలు హిందూ సంహారం కొనసాగిస్తున్నాయి. విద్యార్థులు, యువకులు తమ ఉపాధి, ఉద్యోగాల కోసం చేస్తున్న పోరాటాలు హిందూ వ్యతిరేకతే లక్ష్యంగా సాగుతున్నాయి. ఈ వ్యవహారం గమనిస్తుంటే బంగ్లాదేశ్ లో హిందువుగా పుట్టడమే పాపం అయిపోయింది. మైనారిటీలు ( హిందువులు,సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు)గా జీవించడమే శాపం అయిపోయింది. అభం శుభం తెలియని అమాయక హిందువులపై మారణాయుధాలతో స్వైరవిహారం చేస్తున్నాయి. పసి పిల్లల నుంచీ వృద్ధుల వరకు హత్యలు, అత్యాచారాలు కొనసాగుతున్నాయి. దేవాలయాల లూటీ, విగ్రహాల ధ్వంసం, హిందువుల ఆస్తి కొల్లగొట్టడం, ఇళ్లలోకి చొరబడి స్త్రీలను చె రబట్టడం, లెక్కకు మించిన విధ్వంసం సృష్టించడం జీహాదీ ముఖల పైశాచికత్వానికి సాక్ష్యంగా నిలుస్తోంది బంగ్లా దేశ్ రిజర్వేషన్ల ఉద్యమం. కానీ.. నేటికీ, మానవహక్కుల గొంతు పెగలకపోవడం బాధాకరం. భారతదేశంలో కుక్కలపై, పిల్లులపై దాడి జరిగితే గగ్గోలుపెట్టే గ్యాంగులు.. బంగ్లాదేశ్ లో హిందువులను ఊచకోత కోస్తుంటే కనీసం పత్రిక రూపంలో ఖండించిన దాఖలాలు కూడా లేకపోవడం దుర్మార్గం. ప్రపంచంలో ఏదో మూలాన దాడి జరిగితే తమ ఇంటి పక్కనే జరిగిన ఘటనగా చిత్రీకరించి ఆందోళనలకు దిగే మానవతావాదులు.. పొరుగును ఉన్న బంగ్లాదేశ్ లో ఇంత మరణ హోమం జరుగుతున్నా మౌనం దాల్చడంలో ఉన్న మర్మం ఏంటో అంతు పట్టడం లేదు. అయితే ఇంతటి భయంకరమైన దాడుల నుంచి హిందూ సమాజం మేల్కొనాలి. మానవ హక్కులు హిందువులకు వర్తించవా అనే విషయంపై లోతుగా ఆలోచించాలి. హిందువులు అయిన కారణంగా విద్యాబుద్ధులు చెప్పే గురువులను సైతం ఘోరంగా హింసిస్తున్నారు. కాఫీర్లు అయిన హిందువుల చేత మేము బోధనలు చేయించుకోలేము అంటూ పసి పిల్లలు సైతం తమ గురువులపై దాడులకు దిగడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. కొన్ని ప్రాంతాల్లో హిందూ గురువులను పాఠశాలలోనే చెట్లకు కట్టేసి చిత్ర వధ చేయడం అత్యంత దుర్మార్గం. ఈ విషయంపై స్పందించాల్సిన ఉపాధ్యాయ లోకంకూడా మౌనం వహించడం బాధాకరం. గాజా, ఇజ్రాయిల్, పాలస్తీనా, హమాస్ లాంటి ప్రదేశాలలో దాడులు జరుగుతుంటే మానవ హక్కుల నేతలు తెగ బాధ పడిపోతారు. సెలబ్రిటీలు అన్నం తినడం మానేసి ఆందోళన బాట పడతారు. మానవతా విలువల గురించి లెక్చర్లు ఇస్తారు. కవులు, కళాకారులు కదం తొక్కి పద్మశ్రీ తో పాటు, సాహిత్యకారులు అవార్డు గ్రహీతలందరూ అవార్డు వాపసి కార్యక్రమం చేపడతారు. తమ విధులు పక్కన పెట్టి వీధుల్లోకి ఎక్కి రచ్చ చేస్తారు. కానీ భారత్ నుంచి విడిపోయి ఏర్పడిన బంగ్లాదేశ్ లో సోదర మైనారిటీల హత్యలు, అత్యాచారాలు, దేవాలయాల విధ్వంసం పై ఒక్కరూ స్పందించక పోవడం మానవత్వానికే చిన్నతనంగా చెప్పవచ్చు. మరి దీని ఆంతర్యం ఏమిటి అని ఆలోచిస్తే భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చి, గుండె బద్దలయ్యే ప్రమాదం లేకపోలేదు. హిందువు అంటే మనిషే కాదు అనే పద్ధతిలో క్రూరమైన ఆలోచన దీనికి అద్దం పడుతోంది. పక్కాగా హిందుత్వం అంతం కోసం పనిచేసే వారంతా ఏకమైనట్లు బోధపడుతోంది. సెక్యులరిజం, సోషలిజం, సమానత్వం, మానవ హక్కులు అంటూ అనేక విధాలుగా చాలా మంచి మంచి పేర్లు పెట్టుకుని పనిచేసే నేతల లక్ష్యం హిందూ వ్యతిరేకతే అని తెలుస్తోంది. హిందువులపై ఎందుకు ఇంత కక్ష..? అసలు హిందువులు చేసిన పాపమేమిటి..? అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం లేదు కదా తీవ్ర వేదనే మిగులుతుంది. ఉద్యోగాలు, రిజర్వేషన్ల పేరుతో ఉద్యమిస్తున్న బంగ్లా విద్యార్థులు నిరుద్యోగుల లక్ష్యం ఏమిటి..? ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందాల్సిన వారు హిందువులను వెంటాడి వేటాడేతే రిజర్వేషన్లు లభిస్తాయా? హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తేనో, హిందూ అమ్మాయిలపై అత్యాచారం చేస్తేనో, హిందువులను చంపితేనో బంగ్లాలో యువకులకు కొలువులు వస్తాయా?ఈ భూమిపై చిట్టచివరి హిందువును సైతం అంతం చేసే వరకు మా పోరాటం ఆగదు అంటూ కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రకటించడం వెనుక భయంకర ఉపద్రవం దాగి ఉంది. సాధు జంతువుగా జీవనం సాగిస్తున్న హిందువులపై దాడి చేయడం సరైన దేనా..? చెట్టు, పుట్టకే కాదు.. పాముకు సైతం పాలు పోసి, జీవరాశిని పూజించి ఆరాధించే హిందుత్వంపై ఎందుకు ఇంత వివక్ష..? అప్పటివరకు కుటుంబ సభ్యులుగా కలిగి ఉన్న పొరుగు వారిని సైతం కత్తులతో వేటాడి ప్రాణాలు తీయడం రాక్షసుల లక్షణం కాదా..? శత్రువులను సైతం స్వాగతించి అక్కున చేర్చుకోవడం హిందువుల స్వభావం. నాడు సామాజిక రచయిత్రి తస్లీమా నస్రీన్ ను బంగ్లా నుంచి నుంచి తరిమేస్తే.. భారత్ అక్కున చేర్చుకుంది. నేడు జిహాదీల హత్య నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చిన ప్రధాన మంత్రి షేక్ హసీనాకు సైతం ఆశ్రయం ఇచ్చిన భారత్.. శాంతి, సహనంతో ప్రజాస్వామ్య విలువలతో కూడిన దేశంగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. శరణు కోరి ఆశ్రమం అడిగిన దేశాలు ఆమెకు రక్షణ కల్పించేందుకు నిరాకరించాయి. కానీ భారత్ ఎటువంటి డిమాండ్లు లేకుండా ప్రాణ రక్షణకు ప్రాధాన్యమిచ్చింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడికి ప్రతిగా భారత్ లో ఉన్న ముస్లింలను కనీసం ముట్టుకోలేదు సరికదా, పల్లెత్తు మాట కూడా అనలేదు.ఇంతటి గొప్ప ఔదార్యం హిందువులది. అయితే ఆడపడుచులకు ఆశ్రయం కల్పించిన భారత్ కు ప్రతిఫలంగా హిందువులపై నరమేధం సృష్టించడం జిహాదీ మూఖలు కుసంస్కారం. 2006లో హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూడా తస్లిమా పై ఓ మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే పత్రికా విలేకరుల సమావేశంలోనే దాడి చేసిన ఘటన జిహాదీ వనస్థత్వానికి నిదర్శనమే. విద్యార్థులు ముసుగులో రజాకార్లు పెట్రేగిపోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. గద్దల ధాటికి గజగజ వణికి పోయే కోడి పిల్లల్లా మారింది భద్రత కరువైన హిందువుల పరిస్థితి. ఏ క్షణాన ఏ రూపంలో ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు హిందువులు. బంగ్లాదేశ్ లో హిందువుగా పుట్టడమే నేరమైంది. స్త్రీలను ఘోరంగా అత్యాచారాలు చేసి హత్య చేయడం, వారు విశ్వసించి పూజించే ఆలయాల నేలమట్టం చేయడం, నిష్టగా ఉండే మందిరాలను మలమూత్రాలుతో అపవిత్రం చేయడం ఏ విధమైన క్రూరత్వాన్ని తెలియజేస్తుందో నాగరిక సమాజం ఆలోచించాలి. రక్షించాల్సిన పోలీసులే రజాకారులుగా మారణకాండను ప్రోత్సహిస్తుంటే.. న్యాయస్థానాలను ఆశ్రయిద్దామంటే.. ఆందోళనకారులు జడ్జిలను కూడా వదలడం లేదు. కోర్టులను చుట్టుముట్టి న్యాయమూర్తులనే దిగిపోవాలని హుకుమ్ జారీ చేస్తుంటే, అక్కడి మైనారిటీలకు రక్షణ ఏది..? ఆస్తులు, ఇల్లు, పొలాలు వదిలి పారిపోవాలా..? ప్రాణం కోల్పోవాలా..? మతం మారాలా..? అర్థం కాని స్థితిలో నరకం అనుభవించడం హిందువులవంతయింది. ఏ తప్పు చేయకున్నా హిందువులు పిట్ట పిల్లల్లా ప్రాణాలు కోల్పోవడం నేటి మానవతా సమాజానికి మచ్చగా మారుతోంది. కరోనా కష్టకాలంతోపాటు ప్రతినిత్యం వేలాది మందికి అన్నం పెట్టిన ఢాఖా నగరంలోని ఇస్కాన్ తోపాటు ఇతర దేవాలయాలను ధ్వంసం చేయడం పాముకు పాలు పోసే నీతిని గుర్తుచేస్తుంది. హిందువు అనే ఒకే ఒక్క కారణంతో బంగ్లాదేశ్ క్రికెటర్ ఇంటికి మంట పెట్టడం.. భయంతో పారిపోతున్న సినిమా హీరోలను నిర్మాతలను కొట్టి చంపడం.. సాహిత్యకారులు, కళాకారుల ఇళ్లను వారి కార్యాలయాలను, కళాస్మృతులను ధ్వంసం చేయడం.. తగలబెట్టడం పై క్రీడాలోకం, చిత్ర సాహిత్య లోకం కూడా స్పందించకపోవడం బాధాకరం. సినీ, సంగీత పరిశ్రమ కనీసం స్పందించకపోవడం, స్టేట్మెంట్ రూపంలో ఓదార్పు, ఖండన వంటివి కూడా చేయకపోవడం గమనార్హం.! బంగ్లాకు భారత్ కు అనుగుణంగా ఉన్న ఇందిరాగాంధీ సాంస్కృతిక విజ్ఞాన కేంద్రాన్ని ధ్వంసం చేస్తే కనీసం ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులు సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా స్పందించకపోవడం లో ఉన్న ఆంతర్యం ఏమిటి.? హిందువులు హింసవాదులు అని పార్లమెంట్ సాక్షిగా గగ్గోలు పెట్టిన రాహుల్.. మరి బంగ్లాదేశ్ మరణ హోమాన్ని ఖండించకపోవడం ఏమనాలి.? వారి మౌనం ఆందోళనకారులకు మద్దతిచ్చినట్లే భావించాలా..? ఓటు బ్యాంకు కు ప్రాధాన్యమిచ్చినట్లు భావించాలా..? సమాజం ఆలోచించాలి. సినీ పరిశ్రమకు చెందిన ప్రకాష్ రాజ్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, మానవ హక్కుల సంఘాలు బంగ్లా హిందువుల దుస్థితి చూడవద్దు.. మాట్లాడ వద్దు.. విన వద్దు.. అనే విధంగా "మూడు కోతుల" సూత్రం ప్రదర్శించడం విశేషం. కళాకారుల తీపి గుర్తులను మంటల్లో బూడిద చేస్తుంటే మౌనం వహించడం ఆదర్శం! సనాతన ధర్మాన్ని పెకిలించి వేస్తామన్న తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్ కు మద్దతుగా నిలిచిన హిందూ వ్యతిరేకులు.. కనీసం బంగ్లాలో సినీ నటుల హత్యలపై స్పందించకపోవడం విచారకరం. సేవ్ పాలస్తీనా అని బాలీవుడ్, టాలీవుడ్, అన్ని ఉడ్ ల హీరోలు ఆందోళన నిర్వహించారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీలు తీశారు. హిందువులు తప్ప ఇతర మతస్తుల కాలికి ముల్లు గుచ్చుకున్నా తమ పంటితో తీసేందుకు నేతలు పోటీ పడుతున్నారు. కానీ హిందువుల పీక మీద కత్తులు వేట కొనసాగుతున్నా స్పందించేందుకు ఎవరికీ మనసు రావడం లేదు. నేడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న తిరుగుబాటు పోరాటాలు రేపు భారత్ లో కూడా జరుగుతాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి సల్మాన్ కుర్సీద్ లాంటి పెద్దలు మాట్లాడటం దేనికి సంకేతం..? ఉగ్రవాదులను రెచ్చగొట్టి హిందువులపై దాడి చేయడానికి ప్రేరేపించినట్టు కాదా..? అలా మాట్లాడటం ఉగ్రవాద చర్యే అని హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఏది ఏమైనా "సేవ్ బంగ్లా" అంటూ ప్రపంచంలోని హిందువులంతా ఏకతాటిపైకి రావడం హర్షణీయం. నేడు బంగ్లాలో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తుంటే రేపటి భారతం ఊహించుకోవచ్చు అని రాజకీయాలకు, కులాలకు అతీతంగా ప్రతి హిందువు చర్చించడం స్వాగతించాల్సిందే. ఎందుకంటే బంగ్లాలో జరుగుతున్న దాడులు కులాల ఆధారంగా చేయడం లేదని, హిందువు అయితే చాలు అంతం చేయాలనే కుట్ర సాగుతోందని గ్రహించడం గొప్ప విషయం. బంగ్లా విడిపోయిన సమయంలో 32 శాతం ఉన్న హిందూ జనాభా నేడు ఏడు శాతానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తూనే.. ఐక్యత రాగం పలుకుతున్నారు. ప్రపంచంలోని ప్రతి హిందువు తమ ఆత్మబంధువేనని ముందుకు రావడం హిందూ ఐక్యతకు నిదర్శనంగా చెప్పవచ్చు. భవదీయ పగుడాకుల బాలస్వామి ప్రచార ప్రసార ప్రముఖ్ విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్రం 9912975753 9182674010
భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న పాశ్చాత్య పోకడలలో కొత్తగా వచ్చి చేరిన మరో అనాగరిక సాంప్రదాయమే, డింక్ కల్చర్. డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ బట్ నో కిడ్స్. అంటే భార్య భర్త ఇద్దరు సంపాదిస్తారు. కానీ పిల్లలు కనడానికి ఇష్టం ఉండదు. భారతజాతి మనగడకు ప్రతి బంధకంగా మారుతున్న కొత్త దురాచారం మరియు ప్రకృతి విరుద్ధమైన ప్రయత్నం ఇది. సజీవుల ప్రాథమిక లక్షణాలు ఏడు విధాలుగా ఉంటాయి. అవి 1. పెరుగుదల. 2. చలనం 3. ఆకలి లేదా ఆహారాన్ని స్వీకరించడం. 4. శ్వాసక్రియ.5. విసర్జన.6. ప్రేరణ- ప్రతిస్పందన లేదా క్షోభ్యత.7.ప్రత్యుత్పత్తి నాగరికత అభివృద్ధి చెందింది అని భావించే ప్రస్తుత తరుణంలో, శాస్త్ర సాంకేతిక ప్రగతి మానవ జీవన గమనాన్ని తిరోగమన లేదా ప్రకృతి నియమానికి విరుద్ధంగా తీసుకెళ్తుంది. పిల్లలు కలగకుండా కుటుంబ నియంత్రణ పాటించటం. ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు,ఆపై అసలే వద్దు. అనే కుటుంభనియంత్రణ ప్రచారంతో ఎక్కువ ఆకర్షితులు మరియు ప్రభావితులు అయింది హిందువులు మాత్రమే. అందుకే స్వాతంత్రానంతరం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం హిందూ జనాభాను తగ్గించడానికి విసిరిన పాచికలో బలి అయింది హిందువులే. ఏ యుద్ధం,రక్తపాతం లేకుండానే పథకం ప్రకారం హిందూ జనాభాను తగ్గించగలిగారు. గర్భధారణ జరగగానే ఆరోగ్యం శిశు క్షేమం కోసం ఎప్పటికప్పుడు వైద్యున్ని సంప్రదించటంలో తప్పులేదు. కాని అధికంగా మందులు వాడటం వలన పుట్టిన శిశువుల్లో క్షోభ్యత మందగించటం, తద్వారా హిందూ జనాభా క్రియా హీనంగా మారటం జరుగుతోంది. హిందూ జనాభాను తగ్గించాలనుకునే సెక్యులర్ ముసుగులో ఉన్న వైద్యులు హిందువులపై పన్నే కుట్రలో రెండు రకాలు ఉంటాయి 1. ప్రసవ సమయంలో చేసే పెద్ద ఆపరేషన్ లేదా సిజేరియన్. 2. వివిధ కారణాలతో గర్భసంచిని తొలగించటం. ఇలా ఎలాంటి అలజడి లేకుండానే హిందూ జనాభాను తగ్గించే ప్రయత్నం విజయవంతం అవుతూనే ఉంది. ధనార్జనే ధ్యేయంగా పనిచేసే కొందరు డాక్టర్లు మరియు డయాగ్నోస్ సెంటర్స్ లింగ నిర్ధారణ పరీక్షలు చేసి తల్లి గర్భంలో కనుక ఆడపిల్ల ఉంటే వెంటనే బ్రూనహత్యలకు ఉసిగొల్పుతున్నారు. ఈ విధానం వలన హిందూ జనాభాలో లింగ అసమతౌల్యం ఏర్పడి ఆడ, మగ జనాభా నిష్పత్తిలో తీవ్ర తేడాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం PNDT ప్రీ నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్ అనే చట్టం 1994 లో చేసింది. 2003లో ఈ చట్టానికి మరికొన్ని సవరణలు చేసి ముందస్తు లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించడం జరిగింది కానీ డబ్బుకు కక్కుర్తి పడే కొందరు గర్భస్థ శిశువు ఆడపిల్ల అని తెలియగానే బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు ఈ హత్యలకు శిశువు యొక్క తల్లిదండ్రులు కూడా కారణమే. ఈ అనాగరిక విధానాల వల్ల కొన్ని ఉన్నత వర్గాల లేదా అగ్రవర్ణాల కుటుంబాలలో ఆడపిల్లలే కరువయ్యారు. ఇప్పుడు ఆ కుటుంబాల పరిస్థితి అమ్మాయి దొరికితే చాలు అనే స్థాయికి చేరింది. హిందువుల మానసిక స్థితిలో మార్పు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. సంతానాన్ని ధనార్చనకు లేదా కెరియర్ కు అడ్డంకిగా భావించటం, ఆడపిల్లల్ని భారంగా భావించటం మానుకోవాలి. గర్భసంచి తొలగింపు, సరోగసి లేదా అద్దెగర్భం వంటి ప్రకృతి విరుద్ధమైన చర్యలకు దూరంగా ఉండాలి. అలాగే కొత్తగా వచ్చిన డింక్ కల్చర్ కి పూర్తి దూరంగా ఉండాలి. లేకపోతే హిందూ జనాభా పతనం తీవ్రం అవుతుంది. ఆకలి మనిషికి ఎంత అవసరమో, ప్రత్యుత్పత్తి అంతే అవసరమని హిందువులు గుర్తించాలి.లేదంటే హిందూ జాతి మనుగడ కష్టం అవుతుంది. సంతానం సమస్యలకు మూలం అనే సంకుచిత ధోరణి విడనాడాలి. కుటుంభ జీవనంలో ఉండే మాధుర్యం మరియు విలువ తెలుసుకోవాలి. వ్యక్తిగత ఇష్టాల కంటే సామాజిక కట్టుబాట్లు, సామాజిక జీవనం గొప్పదని తెలుసుకోవాలి. సంతానాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దటం. కుటుంబ బాంధవ్యాల అంతరార్థం, ప్రాధాన్యత తెలుసుకొని ఇల్లే ఇలలో స్వర్గసీమ అనే భావన, బాంధవ్యాలు, పిల్లలు గొప్ప అనే స్థితి ప్రతి హిందువులో ఏర్పడాలి. అని ఆశిస్తున్నాను. వ్యాసకర్త రుద్రోజు శ్రీనివాస్ సామాజిక కార్యకర్త కరినగర్ 505001 సెల్ నం.9440763351
‘ఆర్.ఎస్.ఎస్’ యావత్ సమాజానికి చెందిన సంస్థ – డాక్టర్ మన్మోహన్ వైద్య జీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే సంస్థ మొత్తం సమాజానికి చెందిన సంస్థ అని ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు, మొదటి సర్ సంఘచాలక్ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జీ అన్నారని, గత 99 సంవత్సరాలుగా దీనిని అనుభవిస్తున్నామని ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ డాక్టర్ మన్మోహన్ వైద్య అన్నారు. అఖిల భారత ప్రతినిధుల సభ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017 నుండి 2024 వరకు సంఘ పని పరిధిని అంచనా వేయడం ద్వారా, దాని సమగ్రత దృష్టికి వస్తుందని తెలిపారు. దేశంలోని 99 శాతం జిల్లాల్లో సంఘ పని కొనసాగుతోందన్నారు. అంతకుముందు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభను పూజనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భగవత్ జీ, మాననీయ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సంవత్సరం మహారాష్ట్ర, నాగ్పూర్ లోని రేషిమ్ బాగ్, స్మృతి మందిర్ ప్రాంగణంలో మార్చి 15-17 వరకు సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 45 ప్రాంతాల నుండి 1500 మందికి పైగా ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ మన్మోహన్ వైద్య జీ సంఘ్ పని విస్తరణ గురించి మాట్లాడుతూ, “పని దృష్ట్యా సంఘంలో 45 ప్రాంతాలున్నాయి. తరువాత స్థాయిలో విభాగ్, జిల్లా, ఖండలున్నాయి. అలా 922 జిల్లాలలోని 6597 ఖండలలో 12-15 గ్రామాలను కలిపి ఒక మండల్ గా పరిగణిస్తారు. అటువంటి 27720 మండల్ లలో 73,117 దైనందిన శాఖలు నడుస్తున్నాయి. గతేడాది కంటే 4466 శాఖలు పెరిగాయి. ఈ శాఖలలో 60 శాతం విద్యార్థి శాఖలు, 40 శాతం ఉద్యోగ లేదా వ్యాపార కార్మిక శాఖలున్నాయి. ఇందులో 40 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 11 శాతం. సాప్తాహిక్ ల సంఖ్య 27,717 కాగా, గతేడాది కంటే 840 పెరిగాయి. సంఘ మండలి సంఖ్య 10,567. నగరాలు, మెట్రోలలోని 10 వేల బస్తీలలో 43 వేల శాఖలు నడుస్తున్నాయి. మహిళా సమన్వయం మహిళా సమన్వయ పనిలో, రాష్ట్ర సేవికా సమితి, వివిధ సంస్థలలో క్రియాశీలక మహిళా కార్యకర్తలు 44 ప్రాంతాలలో 460 మహిళా సదస్సులు నిర్వహించారు. ఇందులో 5 లక్షల 61 వేల మంది మహిళలు పాల్గొన్నారు. సంఘ శతాబ్ది సంవత్సరానికి సన్నాహక కోణంలో ఇది ముఖ్యమైనది. భారతీయ ఆలోచన, సామాజిక మార్పులో మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని పెంచడం దీని ఉద్దేశం. అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాలు మే 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు జరుపుకోబోతున్నారు. మతపరమైన స్థలాలను పునర్నిర్మించి, అణగారిన వారి ఆర్థిక స్వావలంబన కోసం తీవ్రంగా కృషి చేసిన గొప్ప అహల్యాబాయి రచనల గురించి సమాజానికి పెద్దగా తెలియదు. ఆమె సేవల గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ఉద్దేశ్యంతో సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో 100% ఓటింగ్ జరిగేలా సంఘ స్వయంసేవకులు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తారని డాక్టర్ మన్మోహన్ జీ వైద్య తెలిపారు. అయోధ్యలో రాంలాలా దీక్షతో సంఘ్కి విస్తృత ప్రజా సంపర్కం ఏర్పడింది. అక్షింతల పంపిణీ కార్యక్రమంలో స్వయంసేవకులు సహా 44 లక్షల 98 వేల 334 మంది రామభక్తులు 5,78,778 గ్రామాలు, 4,727 నగరాల్లోని 19 కోట్ల 38 లక్షల 49 వేల, 71 కుటుంబాలకు చేరుకున్నారు. అన్ని చోట్లా లభించిన ప్రోత్సాహకర స్పందన, సాదర స్వాగతం సమాజంలో ఆర్ఎస్ఎస్ పట్ల ఉన్న విశ్వాసానికి భరోసానిచ్చిందని డాక్టర్ మన్మోహన్ జీ అన్నారు. సంఘ శిక్షా వర్గలలో నూతన అంశాలు సంఘ శిక్షా వర్గలు కూర్పునకు కొత్త అంశాలు జోడించాలని నిర్ణయించారు. ఇంతకుముందు ప్రాథమిక శిక్షా వర్గ 7 రోజులు, ప్రథమ వర్ష 20 రోజులు, ద్వితీయ వర్ష 20 రోజులు, తృతీయ వర్ష 25 రోజులు ఉండేవి. ఇప్పుడు కొత్తగా 3 రోజుల ప్రారంబిక్ వర్గ, 7 రోజుల ప్రాథమిక, 15 రోజుల ప్రథమ వర్ష, కార్యకర్త వికాస వర్గ – 1, 20 రోజులు, కార్యకర్త వికాస వర్గ- 2,25 రోజులు ఉంటుంది. ఈ శిక్షావర్గలలో ప్రత్యేకంగా ఆచరణాత్మక శిక్షణ కూడా ఉంటుంది. 2017 నుండి 2023 వరకు ప్రతి సంవత్సరం RSS.org ఈ వెబ్సైట్లో RSSలో చేరడానికి లక్షకు పైగా అభ్యర్థనలు నిరంతరం వస్తున్నాయి. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ సంఖ్యలు రెట్టింపయిందని మన్మోహన్ జీ వైద్య తెలిపారు. మీడియా సమావేశంలో అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ జీ, సహ ప్రచార ప్రముఖులు నరేంద్ర కుమార్ జీ, అలోక్ కుమార్ జీ కూడా పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలో గ్యాస్ సిలిండర్ 500 కు సిలిండర్ గృహ జ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుమల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క... తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పాల్గొన్నారు
జనంగొంతు//డెస్క్//ఈ ప్రపంచం మొత్తం మీద లేజర్ ఆయుధం కలిగిన ఏకైక దేశం అమెరికా కాగా రెండవ దేశంగా భారత్ మారబోతోంది. ఈమేరకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో DRDO దుర్గా 2 పేరుతో లేజర్ ఆయుధం తయారు చేసింది. దీంతో ఎటువంటి బాలిస్టిక్ మిస్సైల్ ,కౄయిజ్ మిస్సైల్, యుద్ధ విమానాలు, డ్రోన్స్ నైనా క్షణాల్లో బస్మీపటలం చేయగల అదునాతన పరిజ్ఞానం ఈ లేజర్ వెపన్ సొంతం. కాగా వచ్చే నెలలోనే దీనిని పరీక్షంచనున్నారు. దీనితో భారత్ శత్రుదుర్బేంద్యంగా మారడం ఖాయం.