రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలోని వివిధ హోటల్స్ నందు చాలామంది ప్రజలు అల్పాహారంలో భాగంగా పచ్చి అటుకులు ఎక్కువగా తింటూ ఉంటారు. అల్పాహారంగా తీసుకునే అటుకులని న్యూస్ పేపర్ లో వేసి ఇస్తారు. న్యూస్ పేపర్ నందు ఉండే అక్షరాలను వివిధ రసాయనాలతో ముద్రిస్తారు. పచ్చి అటుకులను న్యూస్ పేపర్లో వేసి హోటల్స్ వారు వేశి ఇవ్వడం వలన రసాయనాలు పచ్చి అటుకుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి దారితీస్తుంది అన్న విషయాన్ని గమనించి స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య హోటల్ యజమానులను కలిసి అటుకులను పేపర్లో పెట్టడం వల్ల జరుగుతున్న నష్టాన్ని చెప్పి స్టీల్ ప్లేట్ లో అటుకులు పెట్టే విధంగా ప్రోత్సహించడానికి ప్రతి హోటల్ యజమానికి ప్రధానోపాధ్యాయురాలు యు. వి రమణి,మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి మహేశ్వరరావు, నాయకులు గుర్రం మహేందర్ చేతుల మీదుగా ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య స్టీల్ ప్లేట్స్, చెంచాలు అందించారు. ప్రధానోపాధ్యాయురాలు రమణి మాట్లాడుతూ ఈకో ఫ్రెండ్లీ, ప్రకృతి సంరక్షణలో భాగంగా ప్లేట్స్,చెంచాలు అందజేసిన బొల్లె చిన్నయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్,మహేష్, రాజగోపాల్,కమరుద్దీన్, భవాని, పుష్పలత, శైలజ,వేణుగోపాల్ పాల్గొన్నారు.