రామగుండంలో బీజేపీ ఆధ్వర్యంలో పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఇన్‌ఛార్జి కందుల సంధ్యారాణి నేతృత్వంలో “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ – “పండిట్‌ దీన్‌దయాళ్‌ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన జీవితాంతం కృషి చేశారు” అని తెలిపారు. కార్యక్రమంలో మేరుగు హనుమంత్‌గౌడ్‌, భాస్కర్‌ రెడ్డి, అపర్ణ, రమేష్‌, శ్రీనివాస్‌, మురళి, ఐలయ్య, సాయి, పవన్‌, కళ్యాణ్‌, సుమంత్‌, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.