ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది 27వ తేదీన ఒడిశా–ఉత్తర ఆంధ్ర తీరాలను దాటనుందని అంచనా. ఈ ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి సహా పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు.
Comments 0