పోచమ్మ ఆలయంలో చోరీ మల్యాల //జనంగొంతు న్యూస్//నేరెళ్ళ శ్రీనివాస్ మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని పోచమ్మ ఆలయంలో శనివారం రాత్రి హుండీ చోరీకి గురైనట్లు ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించారు.హుండిని పగులగొట్టి సుమారు రూ.20వేల నగదు, బంగారం, వెండి ఆభరణాలు అపహరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆలయాన్ని పరిచిలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు .
Comments 0