|
modi add 1

ముర్షిదాబాద్ శ్రీరామ నవమి ఉరేగింపు పై రాళ్లు

ముర్షిదాబాద్ (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా తీవ్ర హింస చెలరేగింది. మార్చి 27, 2026 (శుక్రవారం) సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళితే రామనవమి పండుగను పురస్కరించుకుని ముర్షిదాబాద్‌లోని రఘునాథ్‌గంజ్ మరియు జంగీపూర్ ప్రాంతాల్లో భక్తులు భారీ ఊరేగింపులు నిర్వహించారు. ఈ క్రమంలో మసీదుగుండా వెళుతున్న సమయంలో వివాదం మొదలైంది. ఇది కాస్తా ముదిరి ఇరు వర్గాల మధ్య వాగ్వాదానికి, ఆపై రాళ్లదాడికి దారితీసింది. ఊరేగింపుపై భవనాలపై నుండి రాళ్లు రువ్వడంతో తొక్కిసలాట జరిగింది. ఆగ్రహించిన అల్లరిమూకలు స్థానిక దుకాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో సుమారు 15 నుండి 20 మంది వరకు గాయపడ్డారు. వీరిలో పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన కొందరు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక జంగీపూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు .... టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఉద్రిక్తత దృష్ట్యా రఘునాథ్‌గంజ్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 (ప్రస్తుతం బిఎన్ఎస్ సెక్షన్ 163) విధించి, ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ముర్షిదాబాద్ జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, గాలిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రాష్ట్ర పోలీసులతో పాటు భారీగా కేంద్ర బలగాలను (CAPF) రంగంలోకి దించారు. ముర్షిదాబాద్ రేంజ్ డీఐజీ అజిత్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. "సిసిటివి (CCTV) ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నామని, హింసకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని" హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ రచ్చ మొదలైంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హిందువుల పండుగలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది. మరోవైపు, ఎన్నికల సమయంలో కావాలనే మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని అధికార టీఎంసీ విమర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా రామనవమి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

By NYALAKONDA ANIL DESAI | March 29, 2026 | 0 Comments

నకిలీ సర్టిఫికెట్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి, నేరగాళ్లకు అమ్ముతున్న ముఠా అరెస్ట్

నకిలీ సర్టిఫికెట్లతో బ్యాంకు ఖాతాలు తెరవడమే కాకుండా, వాటిని దళారీల ద్వారా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ క్రాక్ డౌన్’’ పేరుతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా ఈ మోసం బట్టబయలైంది. నిజామాబాద్ జిల్లా బోధన్ కి చెందిన ఖాసీం (25), షర్బతి కాలువకు చెందిన సయ్యద్ హఫీజ్ (32), రేంజల్ బస్ కి చెందిన మహ్మద్ అజర్ (28), మహ్మద్ అజర్ (28), మినాజ్ అహ్మద్ (35) ను అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికేట్ల ద్వారా గత మూడు నెలల్లోనే ఏకంగా 31 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇక.. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించామని సీపీ సాయి చైతన్య ప్రకటించారు.

By NYALAKONDA ANIL DESAI | March 27, 2026 | 0 Comments

డ్రంకెన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు – ఒకరికి జైలు శిక్ష

గోదావరిఖని లో మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికి 5 రోజుల జైలు శిక్ష విధించినట్లు వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఇటీవల వన్ టౌన్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 11 మందిని బుధవారం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి 5 రోజుల జైలు శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధించారు. మిగిలిన 10 మందికి రూ.20 వేల జరిమానా విధించినట్లు సీఐ ఇంద్రసేనారెడ్డి వివరించారు. డ్రంకెన్ డ్రైవ్‌పై ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.

By Ambati Sathish kumar | March 25, 2026 | 0 Comments

విద్యార్థుల్లో చైతన్యం కోసం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు

విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ, ప్రొటెక్షన్ మరియు యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. సమాజంలో చిన్నారులపై జరుగుతున్న వివిధ రకాల నేరాలు, వేధింపులు మరియు యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారుల భద్రత మరియు మాదకద్రవ్యాల నియంత్రణ సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చిన్నారుల భద్రతపై పలు సూచనలు చేశారు. అపరిచిత వ్యక్తుల నుండి జాగ్రత్తలు ఎలా పాటించాలి, ప్రమాద పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ఆన్‌లైన్ మోసాలు మరియు సైబర్ ప్రమాదాల నుండి ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ మరియు సామాజిక సమస్యలను వివరించారు. డ్రగ్స్ వినియోగం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు సమాజానికి కలిగే నష్టాన్ని కూడా అధికారులు వివరించారు. యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని సూచించారు. చిన్నారుల భద్రత కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజం కలిసి పనిచేయాలని అధికారులు తెలిపారు. చిన్నారులపై అనుమానాస్పద సంఘటనలు గమనించినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

By Ambati Sathish kumar | March 06, 2026 | 0 Comments

మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష పక్కా!

రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 13 మంది డ్రైవర్స్ డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడ్డారు. వీళ్లలో 12 మందికి రూ.28,000 జరిమానా విధించారు. రెండోసారి మత్తులో వాహనం నడిపిన వ్యక్తి – వెంకటేష్ దుర్వ కు ఐదు రోజుల జైలు శిక్ష విధించి కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.

By Ambati Sathish kumar | January 06, 2026 | 0 Comments

బ్యాంకుల్లో భద్రతపై సీఐ తనిఖీలు

గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఏటీఎం సెంటర్లలో భద్రతపై గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థ, లైటింగ్, సెక్యూరిటీ గార్డ్‌ల పనితీరును పరిశీలించారు. హై రిజల్యూషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి నిరంతరం పనిచేసేలా చూడాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని, కస్టమర్లకు భద్రతపై అవగాహన కల్పించాలని సీఐ సూచించారు.

By Ambati Sathish kumar | January 03, 2026 | 0 Comments

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు: ఒకరికి 3 రోజుల జైలు శిక్ష

రామగుండం ట్రాఫిక్ సబ్-ఇన్స్పెక్టర్ G. హరిశేఖర్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నలుగురు వ్యక్తులను సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్, గోదావరిఖని శ్రీ వెంకటేష్ దుర్వ గారి ముందు హాజరుపరచారు. ఇందులో ముగ్గురికి రూ.6,000/- జరిమానా విధించగా, రెండవసారి నేరానికి పాల్పడిన ఒక వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. శిక్ష విధించబడిన వ్యక్తిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.

By Ambati Sathish kumar | December 23, 2025 | 0 Comments

బారి కుట్ర బట్ట బయలు-పెద్ద ఫ్యక్తరీనే తెరిచారు

దేశంలో ఓ పెద్ద ఇస్లామిక్ ఉగ్రవాద ఆపరేషన్ ను భగ్నం చేసింది గుజరాత్ ఏటీఎస్. గుజరాత్ గాంధీనగర్ లోని అదాలజ్ టోల్ ప్లాజా సమీపంలో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. గుజరాత్ లో ఉగ్రదాడికి ప్రణాళికలు వేసినట్లు విచారణలో తేలింది. మరోవైపు ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి తుపాకులు, విషపూరిత రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా విచారణ కొనసాగుతోందని ఏటీఎస్ పేర్కొంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ కుమారుడు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, మహ్మద్ సులేమాన్ కుమారుడు మహ్మద్ సుహైల్ మరియు సులేమాన్ సైఫీ కుమారుడు ఆజాద్ అనే ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది.అరెస్టయిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ హైదరాబాద్ నివాసి. మొహమ్మద్ సుహెల్ మొహమ్మద్ సులేమాన్ మరియు ఆజాద్ సులేమాన్ సైఫీ ఇద్దరూ ఉత్తరప్రదేశ్ నివాసితులు. ముగ్గురి వయస్సు దాదాపు 25 సంవత్సరాలు. ముగ్గురు ఉగ్రవాదులను ఓ సంవత్సరం పాటు నిఘాలో వుంచింది ఏటీఎస్. వారి లొకేషన్ ను నిరంతరం ట్రాక్ చేసి, వారి ప్రతి కదలికను పరిశీలించారు. ఈ ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులు రైజిన్ అనే అత్యంత విషపూరితమైన ద్రవాన్ని తయారు చేస్తున్నారు.

By NYALAKONDA ANIL DESAI | November 10, 2025 | 0 Comments

తనదాక వస్తేకాని తెలియదు -సిపిఎం నేత కుటుంబంలో లవ్ జీహాద్

తనదాకా వస్తే గానీ తెలియదు అనేది ఓ సామెత. లవ్ జిహాద్ అసలు లేనేలేదని, ఆరెస్సెస్, హిందుత్వ వాదుల సృష్టేనంటూ చెప్పుకొచ్చిన కమ్యూనిస్టులకు తత్వం బోధపడింది. ఈ ఆపదే ఓ కమ్యూనిస్టు కూతురుకే వచ్చింది. దీంతో అది లేనే లేదు.. అదంతా సృష్టే అని మహా లౌకికత్వాన్ని ప్రదర్శిస్తూ తత్వ బోధ చేయాలి కదా.. అబ్బే అలా ఏమీ చేయలేదు.. లవ్ జిహాద్ లో తన కూతురు ఇరుక్కుందని తెలిసిన తర్వాత ఓ కమ్యూనిస్టు నేత ఏం చేశాడో తెలుసా... కాసర్ గఢ్ కి చెందిన సీపీఎం పార్టీ ఉడుమ ఏరియా కమిటీ సభ్యుడు పవీ భాస్కరన్ కే ఈ పరిస్థితి వచ్చింది. తన కూతురు సంగీత తన దగ్గరికి వచ్చి, ముస్లింని వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేసింది. చెప్పడమే ఆలస్యం.. అపర కమ్యూనిస్టు నేత భాస్కరన్ హింస చేయడం ప్రారంభించారు. తన ఇంట్లోనే కుమార్తె సంగీతను బంధించి, దారుణంగా హింసిస్తున్నాడని సంగీత ఓ వీడియో ద్వారా ప్రకటించింది. దీంతో పెద్ద సంచలనమే రేగింది. అయితే కొన్ని రిపోర్టుల ప్రకారం సంగీత నడుము కింద పక్షవాతంతో బాధపడుతోందని, చాలా బాధలతో వుందని అంటున్నారు. అయినా సరే లవ్ జిహాద్ బయటపడటంతో తాను గృహ నిర్బంధంలో వున్నానని, చికిత్స కూడా చేయించడం లేదని పేర్కొంది. అంతేకాకుండా తన ఆస్తిలోని వాటాను కూడా లాక్కోవడానికి ప్రయత్నించాడని, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా తనను ఒప్పించారని చెప్పుకొచ్చింది. విడాకుల తర్వాత తనకు మొత్తం అందిన భరణాన్ని తన తండ్రి, సోదరుడే స్వాధీనం చేసుకున్నారని, సరైన వైద్యం కూడా అందడం లేదని తెలిపింది.వేరే మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనే తన కోరికను వ్యక్తం చేసిన తర్వాత హింస తీవ్రమైందని ఆమె ఆరోపిస్తోంది. తన తలపై చాలాసార్లు కొట్టారని, "వెళ్లి చనిపో" అని చెప్పారని కూడా ఆమె ఆరోపిస్తోంది. కమ్యూనిజం, ఇలాంటి వాటికి ఈ ఇంట్లో స్థానం లేదని కూడా తన తండ్రి బెదిరిస్తున్నాడని, తన మాట వినకపోతే చంపేస్తానని కూడా అంటున్నాడని చెప్పుకొచ్చింది. తన వద్ద అధికారం వుందని, తనను ఏమీ చేయలేరని కూడా చెప్పుకొచ్చాడని పేర్కొంది. kerala cpm leadercpm leader love jihad

By NYALAKONDA ANIL DESAI | October 31, 2025 | 0 Comments

లేబర్ కమిషనర్ దృష్టికి ముద్ర ఉదంతం

* వేతనాలు ఇప్పించాలని లేబర్ కమిషన్ జాయింట్ కమిషనర్ సునీత దాస్ కు డబ్ల్యూజేఐ వినతి హైదరాబాద్: ముద్ర పత్రిక సిబ్బందికి యాజమాన్యం వెంటనే వేతనాలు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) రాష్ట్ర శాఖ కార్మిక శాఖకు విజ్ఞప్తి చేసింది. సోమవారం లేబర్ కమిషనర్ కార్యాలయంలో సంయుక్త కార్మిక కమిషనర్ సునీత గోపాల్ దాస్ ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ప్రతినిధి బృందంలో డబ్ల్యూ జే ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ రజ్జు భయ్యా, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అనిల్ దేశాయ్ న్యాలకొండ ఉన్నారు. ముద్ర పత్రిక జర్నలిస్టులు, సిబ్బందితో కలిసి వారు సమస్యను వివరించారు. తమకు దాదాపుగా 5 నెలల నుంచి 11 నెలల వరకు జీతం బకాయి ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై త్వరలో ముద్ర యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని సంయుక్త కార్మిక కమిషనర్ సునీత గోపాల్ దాస్ హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ముద్ర పత్రిక సెంట్రల్ టెస్ట్ ఇన్చార్జి కే జహంగీర్ పాషా, న్యూస్ ఎడిటర్ రామ్ మనోహర్, చీఫ్ సబ్ ఎడిటర్ ఉమా మహేశ్వరి, సీనియర్ సబ్ ఎడిటర్లు హరనాథ్, కిరణ్, బ్యూరో సభ్యులు శ్రీనివాస్, ముజాహిద్దీన్ బాబా, శరత్, సీనియర్ డిజైనర్లు రవి అనిత, మహేశ్వరి, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

By NYALAKONDA ANIL DESAI | September 15, 2025 | 0 Comments