|
modi add 1

నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్

నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్: హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు తమ తనిఖీలలో భాగంగా, ఒక వ్యక్తి తన వాహనాన్ని సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) లో రిజిస్ట్రేషన్ చేయించకుండా, ఇతరుల వాహన నంబర్‌తో కూడిన నకిలీ నంబర్ ప్లేట్‌ను వాడుతున్నట్లు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగా, హైదరాబాద్ సిటీలోని చార్మినార్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితుడైన మీర్జా హాషిమ్ రజా (తండ్రి: మీర్జా జాఫర్ రజా, నివాసం: జాఫర్ రోడ్, యాకుత్‌పురా, హైదరాబాద్) ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తనిఖీ మరియు విచారణలో, మీర్జా హాషిమ్ రజా ట్రాఫిక్ చలానాల నుండి తప్పించుకోవడానికి మరియు ప్రభుత్వ/అమలు అధికారులను తప్పుదోవ పట్టించే/మోసం చేసే ఉద్దేశ్యంతో.. ఆర్‌టీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించని తన హోండా యాక్టివా (Honda-Activa) వాహనానికి TS11EK3139 అనే నకిలీ నంబర్ ప్లేట్‌ను ఉపయోగించినట్లు తేలింది. ఈ నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌ను ఉపయోగించి నిందితుడు మీర్జా హాషిమ్ రజా పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. దీనివల్ల, ఆ నంబర్ గల అసలైన వాహన (హోండా షైన్ - Honda-Shine) యజమాని అయిన దిల్‌సుఖ్‌నగర్, గడ్డిఅన్నారం నివాసి శ్రీ ప్రదీప్ సురేష్ కుల్కర్ణి పేరిట తప్పుడు ట్రాఫిక్ చలానాలు జనరేట్ అయ్యాయి. తదుపరి దర్యాప్తులో నిందితుడి అసలైన వాహనం నంబర్ TS11QTR4778 గా గుర్తించబడింది. దీనికి సంబంధించి, చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో బిఎన్‌ఎస్ (BNS) సెక్షన్ 318(4) మరియు మోటార్ వాహనాల (M.V) చట్టం సెక్షన్ 192 కింద ఎఫ్‌ఐఆర్ నెం. 125/2026 తో క్రిమినల్ కేసు నమోదైంది. నిందితుడు మీర్జా హాషిమ్ రజాకు సిఆర్‌పిసి (Cr.P.C) సెక్షన్ 41 కి సమానమైన బిఎన్‌ఎస్‌ఎస్ (BNSS) సెక్షన్ 35(3) కింద నోటీసు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరియు చార్మినార్ పోలీసుల సమన్వయ ప్రయత్నాల ద్వారా ఈ నేరాన్ని ఛేదించడం జరిగింది. ప్రజలకు హెచ్చరిక: నకిలీ, ఒకే రకమైన లేదా మార్పులు చేసిన నంబర్ ప్లేట్‌లను ఉపయోగించడం అనేది భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు మోటార్ వాహనాల చట్టం ప్రకారం తీవ్రమైన మరియు శిక్షార్హమైన నేరమని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ఉల్లంఘనలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. నకిలీ లేదా మార్పులు చేసిన నంబర్ ప్లేట్‌లను ఉపయోగించే వాహనాలను గుర్తించడానికి మరియు వాహనాల కదలికలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం సిసిటివి (CCTV) నిఘా మరియు ఏఎన్‌పిఆర్ (ANPR) కెమెరాలతో కూడిన అధునాతన సాంకేతిక వ్యవస్థలను కలిగి ఉంది. వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల దుర్వినియోగానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా.. ప్రజలు https://echallan.tspolice.gov.in వెబ్‌సైట్ ద్వారా గానీ, echallanhelpdesk.hyd@gmail.com ఈమెయిల్ ఐడీ ద్వారా గానీ, లేదా ఇ-చలాన్ ట్రాఫిక్ వాట్సాప్ మొబైల్ నంబర్: 8712661690 ద్వారా గానీ పోలీసులకు నివేదించాల్సిందిగా కోరడమైనది. జారీ చేసిన వారు: డి. జోయల్ డేవిస్, ఐపిఎస్,జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), హైదరాబాద్ సిటీ.

By NYALAKONDA ANIL DESAI | May 30, 2026 | 0 Comments

ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు, వేణుగోపాల్ శర్మ ( ఇడ్లి వేణు ) అరెస్ట్

హైదరాబాద్: కేసు వివరాలు: నమ్మదగిన సమాచారం మేరకు, 29-05-2026 నాడు గోషామహల్ పోలీసులు బేగంబజార్‌లోని నారాయణ భవన్, ఇంటి నెం. 14-7-366 గల నివాసంలో ఆకస్మిక తనిఖీలు (రైడ్) నిర్వహించారు. చట్టవిరుద్ధంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వేణుగోపాల్ శర్మ అలియాస్ ఇడ్లీ వేణు (59 సంవత్సరాలు) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ సమయంలో నిందితుడు వాట్సాప్ (WhatsApp) మరియు ఇతర కమ్యూనికేషన్ మాధ్యమాల ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో నిందితుడు తన అనుచరులతో కలిసి "గోదావరి అసోసియేట్స్" పేరుతో క్రికెట్ మరియు రేస్‌కోర్స్ బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నట్లు, మధ్యవర్తుల ద్వారా పంటర్ల నుండి బెట్టింగ్ సొమ్మును వసూలు చేస్తున్నట్లు అంగీకరించాడు. అంతేకాకుండా, సాక్ష్యాలను దాచడానికి బెట్టింగ్‌కు సంబంధించిన వాట్సాప్ చాట్‌లను డిలీట్ చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు అలవాటు పడిన నేరస్థుడని, గతంలో గోషామహల్ మరియు చార్మినార్ పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు బెట్టింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై క్రైమ్ నెం. 193/2026 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. అరెస్ట్ అయిన నిందితుడి వివరాలు: A-1) వేణుగోపాల్ శర్మ అలియాస్ ఇడ్లీ వేణు, తండ్రి దివంగత మదన్‌మోహన్ శర్మ, వయస్సు 59 సంవత్సరాలు, వృత్తి: బెట్టింగ్ నిర్వాహకుడు, నివాసం: ఇంటి నెం. 14-7-366, నారాయణ భవన్, బేగంబజార్, హైదరాబాద్. (నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగింది). స్వాధీనం చేసుకున్న సొత్తు: • ఒక వన్‌ప్లస్ నార్డ్ (OnePlus Nord) మొబైల్ ఫోన్ (నెంబర్: 9396445500, IMEI నెం: 865276041897158) • రూ. 3,000/- నికర నగదు. ప్రజలకు విజ్ఞప్తి: • ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడే ఆటగాళ్లు, నిర్వాహకులు మరియు ప్రోత్సహించే వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. • తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను నిరంతరం గమనిస్తూ, బెట్టింగ్ వల్ల వచ్చే నష్టాలు మరియు చట్టపరమైన పరిణామాలపై వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుతున్నాము. • ప్రజలు ఎలాంటి బెట్టింగ్ లేదా జూద క్రీడల్లో పాల్గొనవద్దని, ఇటువంటి చట్టవిరుద్ధమైన పనుల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. గోల్కొండ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ జి చంద్ర మోహన్, గోషామహల్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కె. చంద్రశేఖర్ రెడ్డి గారి పర్యవేక్షణలో, గోషామహల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చురుకైన సహకారంతో ఈ అరెస్ట్ చేయడం జరిగింది. జారీ చేసిన వారు: బి. శ్రవణ్ కుమార్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, గోషామహల్ పి.ఎస్, గోల్కొండ జోన్ ,హైదరాబాద్.

By NYALAKONDA ANIL DESAI | May 30, 2026 | 0 Comments

మహిళా కార్మికురాలిపై థర్డ్ డిగ్రీ ప్రయోగం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు

మహిళా కార్మికురాలిపై థర్డ్ డిగ్రీ ప్రయోగం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు: పోలీసుల వివరణ ​కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళా మున్సిపల్ కార్మికురాలిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ సోషల్ మీడియా మరియు కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలు/వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ​ఈ విషయమై సప్తగిరి కాలనీ, కరీంనగర్‌కు చెందిన రాయనవేణి లక్ష్మి (భర్త: రాజయ్య, వయస్సు 52 సంవత్సరాలు, వృత్తి: లేబర్) స్వచ్ఛందంగా తన స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు. ​బాధిత మహిళ తన స్టేట్‌మెంట్‌లో తెలిపిన వివరాల ప్రకారం: ​ఆమె పని చేసే ఇంటి యజమానురాలు మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమీషనర్ సువార్త బంగారం పోయిందని ఫిర్యాదు చేయడంతో, విచారణ నిమిత్తం పోలీసులు లక్ష్మిని పిలిచారు. స్టేషన్‌కు వెళ్లిన లక్ష్మిని పోలీసులు కేవలం విచారించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు తప్ప... ఆమెను కొట్టడం కానీ, తిట్టడం కానీ చేయలేదు. ​అయితే, తమపై ఎక్కడ కేసు అవుతుందో అనే భయంతో, స్థానిక విలేకరి అడిగినప్పుడు భయపడి పొరపాటున పోలీసులపై తప్పుడు సమాచారం ఇచ్చామని ఆమె అంగీకరించారు. విలేకరి పేపర్‌లో ఏం రాశారో కూడా తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు. ​కాగా, ఈరోజు (23-05-2026) ఉదయం ఫిర్యాదుదారురాలైన అడిషనల్ కమీషనర్ సువార్తను లక్ష్మి కలవగా... తనకు పోయిన బంగారు ఆభరణం దొరికిందని, పోలీసు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానని ఆమె తెలిపినట్లు లక్ష్మి స్పష్టం చేశారు. ​కాబట్టి, పోలీసు స్టేషన్‌లో మహిళపై థర్డ్ డిగ్రీ జరిగిందంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం వదంతులేనని, ప్రజలు మరియు మీడియా ప్రతినిధులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈ పత్రికా ప్రకటన ద్వారా కోరడమైనది.

By NYALAKONDA ANIL DESAI | May 24, 2026 | 0 Comments

PMJ జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో కరుడుకట్టిన అంతర్ రాష్ట్ర దోపిడీ ముఠాను అరెస్ట్

PMJ జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో కరుడుకట్టిన అంతర్ రాష్ట్ర దోపిడీ ముఠాను అరెస్ట్ Cr. No. 245/2026 U/Sec. 310(2), 311, 109 BNS & Sec.25(1)(a), 27 Indian Arms Actof PS Karimnagar-II Town ఈ ఘటన 03-05-2026 రోజున కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న PMJ జ్యువెలరీ షాపులో జరిగింది. ఈ దోపిడీలో 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలు కలిపి మొత్తం రూ.82,02,000/- విలువైన ఆభరణాలు దోచుకెళ్లబడింది. ఈ ఘటనలో నలుగురు స్టాఫ్ గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌ను ప్రస్తుతం బీహార్ జైలులో ఉన్న అంతర్రాష్ట్ర గ్యాంగ్ హ్యాండ్లర్ మరియు “ది గోల్డెన్ థీఫ్” గా పేరొందిన సుభోద్ సింగ్ ప్రణాళికా బద్ధంగా నిర్వహించాడు. ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ @ జగీరా సింగ్‌ను 13-05-2026న సాయంత్రం 4:00 గంటల సమయంలో వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు రవీష్ కుమార్ @ ప్రద్యుమన్ మరియు మెహతాబ్ ఖాన్‌లను బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకువచ్చారు. రఘునాథ్ కర్మాకర్ విచారణలో బీహార్ మరియు బెంగాల్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా గురించి కీలక సమాచారం బయటపడింది. ఈ ముఠా బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జ్యువెలరీ షాపులు మరియు బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. “ది గోల్డెన్ థీఫ్”గా పేరొందిన సుభోద్ సింగ్ నాయకత్వంలో ఈ గ్యాంగ్ ఏర్పడినట్లు విచారణలో తేలింది. ఈ ముఠా ముందస్తుగా రేక్కీ నిర్వహించడం, నేరము చేసిన తరువాత తప్పించుకునే మార్గాలను గుర్తించడం, నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ బైక్ నంబర్ ప్లేట్లు ఉపయోగించడం, తప్పుడు పేర్లతో లాడ్జ్‌లలో ఉండడం, ఆధునిక సాంకేతికత వినియోగించడం వంటి పద్ధతులతో ఆయుధాలతో దోపిడీలు నిర్వహించేది. సుభోద్ సింగ్ మరియు అతని అనుచరుల ప్రణాళిక ప్రకారం కింది నిందితులు తెలంగాణకు రెండు నెలల క్రితం వచ్చారు: రఘునాథ్ కర్మాకర్ @ జగీరా సింగ్ రవీష్ కుమార్ @ ప్రద్యుమన్ రాధే @ అభయ్ @ ప్రమోద్ గోస్వామి మిశ్రా సూర్యమణి కుమార్ @ సనోజ్ తెలంగాణలోకి ప్రవేశించే ముందు వీరు జార్ఖండ్-పశ్చిమ బెంగాల్ సరిహద్దులో మెహతాబ్ ఖాన్ వద్ద ఒక్కో సిమ్ కార్డును రూ.10,000 చొప్పున కొనుగోలు చేశారు. అనంతరం వీరు ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో తిరుగుతూ జ్యువెలరీ షాపులు, బ్యాంకుల పై రేక్కీ నిర్వహించారు. చివరకు కరీంనగర్‌లోని PMJ జ్యువెలరీ షాప్‌ను లక్ష్యంగా ఎంచుకుని పెద్దపల్లిలోని ఒక లాడ్జ్‌ లో బస చేశారు. 01-05-2026 రోజున ధర్మపురిలోని విజయలక్ష్మి గెస్ట్ హౌస్‌కు మారి దోపిడీకి సిద్ధమయ్యారు. సుభోద్ సింగ్ అనుచరుల సమాచారంతో రఘునాథ్ కర్మాకర్ మంచిర్యాలకు వెళ్లి రైలులో చంద్రపూర్ సమీపానికి చేరుకున్నాడు. అక్కడ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు 02-05-2026 న గడ్‌చందూర్ పరిసరాల్లో ఆరు పిస్టల్స్ మరియు మ్యాగజైన్లు అందజేశారు. అనంతరం రఘునాథ్ కర్మాకర్ ఆయుధాలతో ధర్మపురికి తిరిగి వచ్చాడు. 03-05-2026న ఉదయం ఐదుగురు నిందితులు ధర్మపురిలో వారు ఉన్న లాడ్జ్ ఖాళీ చేసి రెండు బైక్‌ల పై బయలుదేరారు. బ్యాగులను కొండ ప్రాంతంలో దాచిపెట్టి, అక్కడే వారి బైక్ నంబర్ ప్లేట్లు మార్చి, వెలిచాల ఎక్స్ రోడ్ వద్దకి చేరుకొని అక్కడ టిఫిన్ చేసి, దోపిడీ ప్రణాళికను మరోసారి చర్చించారు. తరువాత ఉదయం 10:50 గంటలకు PMJ జ్యువెలరీ షాప్‌కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం రాధే @ అభయ్ కస్టమర్‌లా షాప్‌లోకి వెళ్లి పరిస్థితిని గమనించాడు. రాధే మెస్సేజ్ ఇచ్చిన తర్వాత మిగతా నిందితులు లోపలికి ప్రవేశించి సిబ్బందిని ఆయుధాలతో బెదిరించారు. నగలు దోచుకొనుచునడగా స్టాఫ్ ప్రతిఘతించడముతో నిందితులు వారి వద్ద ఉన్న ఆయుదాలతో స్టాఫ్ పై కాల్పులు జరిపారు. నిందితులు షాప్ నుండి పారిపోతూ వారు షాపులో దోచుకున్న ఒక ఆభరణాల బ్యాగ్‌ను తీసుకుని పారిపోయారు. ఆందోళనలో మరో బ్యాగ్‌ను షాప్‌లోనే వదిలివేశారు. ముందుగా నిర్ణయించిన మార్గంలో ధర్మపురికి చేరుకున్నారు. సనోజ్, రాధే @ అభయ్, ప్రద్యుమన్ గోదావరి నది ఒడ్డున పల్సర్ బైక్‌ను వదిలి నడుచుకుంటూ నది దాటి మంచిర్యాల నుంచి రైలులో పరారయ్యారు. మరోవైపు రఘునాథ్ కర్మాకర్ @ జగీరా సింగ్ మరియు మిశ్రా ఆభరణాల బ్యాగ్‌తో అపాచీ బైక్‌పై గుండాల అడవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తెలుపు రంగు క్రెటా కారులో వచ్చిన వ్యక్తులకు బ్యాగ్ మరియు బైక్ అప్పగించి సమీప రైల్వే స్టేషన్ ద్వారా బీహార్‌కు పారిపోయారు. సాంకేతిక నిఘా ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఇప్పటివరకు 13 మంది నిందితులను గుర్తించాయి. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, నకిలీ ఆధార్ కార్డులు, రూ.51,000 ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. మిగిలిన నిందితులు మరియు దోచుకెళ్లిన ఆభరణాల కోసం ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకొన్న వస్తువులు నగదు – రూ.51,000/- మొబైల్ ఫోన్లు – 2 సిమ్ కార్డులు – 2 నకిలీ ఆధార్ కార్డు అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు రఘునాథ్ కర్మాకర్ @ జాగీర సింగ్ s/o లేట్ కాళిదాస్ కర్మాకర్, వయస్సు 41 సంవత్సరాలు, కులం: హిందూ లోహర్, వృత్తి: కార్ డ్రైవర్, నివాసం: మల్లిక్ పడ, సాల్వన్ గ్రామము, అసన్సోల్ సౌత్ మండల్, పాశివర్ధన్, వెస్ట్ బెంగాల్, (ఇతనిపై వివిధ రాష్ట్రాల్లో దోపిడీ, హత్య, ఆయుధ చట్టాల కింద 7 కేసులు ఉన్నాయి) రావిష్ కుమార్ @ ప్రద్యుమన్ s/o శంకర్ ప్రసాద్, వయస్సు 23 సంవత్సరాలు, కులం: యాదవ్, వృత్తి: కూలి, నివాసం: గవాల్ బిఘ గ్రామం, హిల్స మండలం, నలంద జిల్లా, భీహార్ రాష్ట్రం. (ఇతనిపై దొంగతనం, దోపిడీ, హత్య, ఆయుధ చట్టాల కింద 15 కేసులు ఉన్నాయి) మెహతాబ్ ఖాన్ s/o మహబూబ్ ఖాన్, 32 సం. ముస్లిం, నివాసం. నూరుద్దీన్ రోడ్, అసన్సోల్ సౌత్ పి.యస్, పచ్చిమ్ బర్దన్, వెస్ట్ బెంగాల్. (నేరానికి ఉపయోగించిన సిమ్ కార్డులు సరఫరా చేసిన వ్యక్తి) పరారీలో ఉన్న నిందితులు సుభోద్ సింగ్ (గ్యాంగ్ లీడర్) రాధే మిశ్రా @ అభయ్ @ ప్రమోద్ గోస్వామి మిశ్రా సూర్యమణి కుమార్ @ సనోజ్ **** (లాజిస్టిక్ ఏర్పాట్లు చేసిన వ్యక్తి) **** (ఆపరేషన్ సమన్వయకర్త) **** (నేరానికి డబ్బు సమకూర్చిన వ్యక్తి) **** (రేకీ నిర్వహించిన వ్యక్తి) **** (క్రెటా కారు డ్రైవర్) **** (గ్యాంగ్ సభ్యుడు) పోలీసుల సూచనలు కరీంనగర్ పోలీసులు బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, లాడ్జ్‌లు, గెస్ట్ హౌస్ యజమానులకు కింది జాగ్రత్తలు పాటించాలని సూచించారు: నాణ్యమైన CCTV కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని నిరంతరం పర్యవేక్షించాలి. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించి అప్రమత్తంగా ఉంచాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. లాడ్జ్‌లు, గెస్ట్ హౌస్‌లు సరైన ఐడీ ధృవీకరణ తర్వాత మాత్రమే గదులు ఇవ్వాలి. నగదు, బంగారం రవాణా సమయంలో భద్రతా నియమాలు పాటించాలి. ఎమర్జెన్సీ అలారం వ్యవస్థలు, పానిక్ బటన్లు ఏర్పాటు చేయాలి. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. కరీంనగర్ పోలీసులు శాస్త్రీయ ఆధారాలు, CCTV ఫుటేజ్, సాంకేతిక విశ్లేషణ మరియు అంతర్రాష్ట్ర సమన్వయంతో దర్యాప్తు కొనసాగుతోందని, మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.

By NYALAKONDA ANIL DESAI | May 14, 2026 | 0 Comments

హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఏక్తా యాత్ర ర్యాలీకి పటిష్ట బందోబస్తు – కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం.

హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఏక్తా యాత్ర ర్యాలీకి పటిష్ట బందోబస్తు – కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారంనాడు కరీంనగర్ నగరంలో నిర్వహించనున్న హిందూ ఏక్తా యాత్ర ర్యాలీ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీ విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులకు ఆయన బ్రీఫింగ్ నిర్వహించారు. సుమారు 400 మంది పోలీసు అధికారులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో స్టాటిక్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, రూఫ్‌టాప్ నిఘా, మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు వంటి పలు రకాల విధులను కేటాయించినట్లు కమిషనర్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని చోట్ల దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. హిందూ ఏక్తా యాత్ర శోభాయాత్రకు సంబంధించి పోలీసు శాఖ తరపున అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు.

By NYALAKONDA ANIL DESAI | May 12, 2026 | 0 Comments

ఆర్టీసీ కార్మికులు శాంతియుత వాతావరణం లో సమ్మె నిర్వహించుకోవాలి ప్రజా అశాంతికి గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు : పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం

ఆర్టీసీ కార్మికులు శాంతియుత వాతావరణం లో సమ్మె నిర్వహించుకోవాలి ప్రజా అశాంతికి గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు : పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కరీంనగర్ ‌లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో చట్టాన్ని కాపాడటం పోలీస్ శాఖకు ప్రధాన ప్రాధాన్యతగా ఉందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. సమ్మెను ప్రజాస్వామ్యపరమైన హక్కుగా గౌరవిస్తున్నప్పటికీ , అది పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పేర్కొన్న ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి: 1) సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలు వినియోగించే ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ మరియు రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. 2) ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా, అలాగే ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి డ్యూటీలో చేరినా, వారికి ఎటువంటి బెదిరింపులు లేకుండా పూర్తి స్థాయిలో పోలీస్ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. 3) బస్సుల రాకపోకలు , డిపో ప్రాంతాలు , ముఖ్య కూడళ్లు , మరియు బస్టాండ్ పరిసరాల్లో అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 4) ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించినా, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించినా, అధికారులపై దాడులకు పాల్పడినా, అలాంటి వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 5) సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం , వదంతులు వ్యాప్తి చేసిన వారిపైనా పర్యవేక్షణ కొనసాగుతోందని , అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 6) సమ్మెలో పాల్గొనే కార్మికులు మరియు ప్రజలు పరస్పర గౌరవం పాటిస్తూ, ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. 7) శాంతి భద్రతల విఘాతం కలగకుండా సమ్మె నిర్వహించుకోవాలని ఎక్కడనైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటట్లు చర్యలు చేపడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు మరియు వారి ఉద్యోగం పరంగా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారన్నారు . 8) కరీంనగర్ ప్రజల శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ శాఖకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా, ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్లను బెదిరింపులకు గురించేసినా వెంటనే కరీంనగర్ పోలీసు స్పెషల్ బ్రాంచి కంట్రోల్ రూమ్ నంబర్ 8712670713 కు కాల్స్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ కోరారు.

By NYALAKONDA ANIL DESAI | April 24, 2026 | 0 Comments

కేంద్ర పనితీరును అడిగి తెలుసుకున్న అడిషనల్ డీజీపీ చారు సిన్హా

కేంద్ర పనితీరును అడిగి తెలుసుకున్న అడిషనల్ డీజీపీ చారు సిన్హా ​నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని ఆదేశం ​కరీంనగర్ భరోసా కేంద్రం తనిఖీ ​కరీంనగర్, ఏప్రిల్ 16: లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు సురక్షితమైన వాతావరణంలో చేయూతను అందించి, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు 'భరోసా' కేంద్రాలు కొండంత అండగా నిలుస్తున్నాయని రాష్ట్ర అడిషనల్ డీజీపీ (సీఐడీ & ఏసీబీ) చారు సిన్హా పేర్కొన్నారు. గురువారం నాడు కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా కొత్తపల్లిలో ఉన్న 'భరోసా' కేంద్రాన్ని ఆమె సందర్శించి, క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలను తనిఖీ చేశారు. ​రికార్డుల పరిశీలన - సిబ్బందికి సూచనలు: ​కేంద్రంలోని ప్రతి విభాగాన్ని సందర్శించిన అడిషనల్ డీజీపీ, సిబ్బందితో మాట్లాడి పనితీరును సమీక్షించారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. బాధితులకు తక్షణ న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందించడంలో ఏమాత్రం జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ​శిక్షల శాతం పెరగాలి: ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "తెలంగాణ పోలీసు శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు మంచి సత్ఫలితాలను ఇస్తున్నాయి. లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా పక్కాగా ఆధారాలను సేకరించాలి. బాధితులకు ప్రభుత్వం నుండి అందాల్సిన నష్టపరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలి" అని అధికారులను ఆదేశించారు. 2024 డిసెంబర్లో ప్రారంభమైన ఈ కేంద్రం, బాధితులకు పోలీస్ స్టేషన్లు మరియు ఆసుపత్రులకు తిరిగే ఇబ్బంది లేకుండా ఒకే చోట అన్ని సేవలు అందించడం అభినందనీయమన్నారు. తనిఖీ అనంతరం భరోసా కేంద్రం ఆవరణలో మొక్కను నాటారు. ఈ తనిఖీ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ వెంకటస్వామి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ పుల్లయ్య, ఎస్సై అనూష, భరోసా కేంద్రం సిబ్బంది మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | April 17, 2026 | 0 Comments

కరీంనగర్‌కు విచ్చేసిన రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి

కరీంనగర్‌కు విచ్చేసిన రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి; రేపు 'అరైవ్ - అలైవ్' రోడ్డు భద్రత సదస్సులో పాల్గొననున్న పోలీస్ బాస్ ​కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ పోలీస్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'అరైవ్ - అలైవ్' (Arrive - Alive) రోడ్డు భద్రత వారోత్సవాల 5వ రోజు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారు నేడు కరీంనగర్ చేరుకున్నారు. ​ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు భద్రత అవగాహన సదస్సులలో భాగంగా, రేపు (శుక్రవారం) కరీంనగర్‌లో నిర్వహించే జిల్లా స్థాయి భారీ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నేడు కరీంనగర్ చేరుకున్న డీజీపీ గారికి జిల్లా పోలీసు యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. రాత్రికి ఇక్కడే బస చేయనున్న ఆయన, రేపు ఉదయం పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, అనంతరం రోడ్డు భద్రతపై ఏర్పాటు చేసిన సదస్సులో ప్రజలను, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ​ ​ప్రాణం కన్నా వేగం మిన్న కాదు: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా 'అరైవ్ - అలైవ్' నినాదంతో సాగుతున్న ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ​నిబంధనల అమలు: హెల్మెట్ ధారణ, సీటు బెల్టు ప్రాధాన్యత మరియు మితిమీరిన వేగం వల్ల కలిగే అనర్థాలపై డీజీపీ గారు దిశానిర్దేశం చేయనున్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో పోలీసు శాఖ పాత్రను ఆయన వివరించనున్నారు. ​రేపు జరగనున్న ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ​కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ పోలీస్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'అరైవ్ - అలైవ్' (Arrive - Alive) రోడ్డు భద్రత వారోత్సవాల 5వ రోజు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారు నేడు కరీంనగర్ చేరుకున్నారు. ​ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు భద్రత అవగాహన సదస్సులలో భాగంగా, రేపు (శుక్రవారం) కరీంనగర్‌లో నిర్వహించే జిల్లా స్థాయి భారీ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నేడు కరీంనగర్ చేరుకున్న డీజీపీ గారికి జిల్లా పోలీసు యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. రాత్రికి ఇక్కడే బస చేయనున్న ఆయన, రేపు ఉదయం పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, అనంతరం రోడ్డు భద్రతపై ఏర్పాటు చేసిన సదస్సులో ప్రజలను, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ​ ​ప్రాణం కన్నా వేగం మిన్న కాదు: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా 'అరైవ్ - అలైవ్' నినాదంతో సాగుతున్న ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ​నిబంధనల అమలు: హెల్మెట్ ధారణ, సీటు బెల్టు ప్రాధాన్యత మరియు మితిమీరిన వేగం వల్ల కలిగే అనర్థాలపై డీజీపీ గారు దిశానిర్దేశం చేయనున్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో పోలీసు శాఖ పాత్రను ఆయన వివరించనున్నారు. ​రేపు జరగనున్న ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.

By NYALAKONDA ANIL DESAI | April 17, 2026 | 0 Comments

ముర్షిదాబాద్ శ్రీరామ నవమి ఉరేగింపు పై రాళ్లు

ముర్షిదాబాద్ (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా తీవ్ర హింస చెలరేగింది. మార్చి 27, 2026 (శుక్రవారం) సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళితే రామనవమి పండుగను పురస్కరించుకుని ముర్షిదాబాద్‌లోని రఘునాథ్‌గంజ్ మరియు జంగీపూర్ ప్రాంతాల్లో భక్తులు భారీ ఊరేగింపులు నిర్వహించారు. ఈ క్రమంలో మసీదుగుండా వెళుతున్న సమయంలో వివాదం మొదలైంది. ఇది కాస్తా ముదిరి ఇరు వర్గాల మధ్య వాగ్వాదానికి, ఆపై రాళ్లదాడికి దారితీసింది. ఊరేగింపుపై భవనాలపై నుండి రాళ్లు రువ్వడంతో తొక్కిసలాట జరిగింది. ఆగ్రహించిన అల్లరిమూకలు స్థానిక దుకాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో సుమారు 15 నుండి 20 మంది వరకు గాయపడ్డారు. వీరిలో పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన కొందరు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక జంగీపూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు .... టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఉద్రిక్తత దృష్ట్యా రఘునాథ్‌గంజ్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 (ప్రస్తుతం బిఎన్ఎస్ సెక్షన్ 163) విధించి, ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ముర్షిదాబాద్ జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, గాలిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రాష్ట్ర పోలీసులతో పాటు భారీగా కేంద్ర బలగాలను (CAPF) రంగంలోకి దించారు. ముర్షిదాబాద్ రేంజ్ డీఐజీ అజిత్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. "సిసిటివి (CCTV) ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నామని, హింసకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని" హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ రచ్చ మొదలైంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హిందువుల పండుగలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది. మరోవైపు, ఎన్నికల సమయంలో కావాలనే మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని అధికార టీఎంసీ విమర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా రామనవమి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

By NYALAKONDA ANIL DESAI | March 29, 2026 | 0 Comments

నకిలీ సర్టిఫికెట్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి, నేరగాళ్లకు అమ్ముతున్న ముఠా అరెస్ట్

నకిలీ సర్టిఫికెట్లతో బ్యాంకు ఖాతాలు తెరవడమే కాకుండా, వాటిని దళారీల ద్వారా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ క్రాక్ డౌన్’’ పేరుతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా ఈ మోసం బట్టబయలైంది. నిజామాబాద్ జిల్లా బోధన్ కి చెందిన ఖాసీం (25), షర్బతి కాలువకు చెందిన సయ్యద్ హఫీజ్ (32), రేంజల్ బస్ కి చెందిన మహ్మద్ అజర్ (28), మహ్మద్ అజర్ (28), మినాజ్ అహ్మద్ (35) ను అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికేట్ల ద్వారా గత మూడు నెలల్లోనే ఏకంగా 31 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇక.. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించామని సీపీ సాయి చైతన్య ప్రకటించారు.

By NYALAKONDA ANIL DESAI | March 27, 2026 | 0 Comments

Hot Categories

2
7
1