గోదావరిఖని ఎల్బీ నగర్కి చెందిన కారు డ్రైవర్ మారుపెల్లి ప్రణయ్ భాస్కర్ (29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిరాయికి తీసుకున్న, స్నేహితుల వద్ద నుండి తెచ్చుకున్న నాలుగు కార్లను ఇతరుల వద్ద తనఖా పెట్టి సుమారు రూ.10 లక్షలు తీసుకొని మోసపూరితంగా వినియోగించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, 4 కార్లు, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఏసీపీ ఎం.రమేష్ మాట్లాడుతూ వాహనాలు తనఖా పెట్టే ముందు యజమాని వివరాలు, పత్రాలు ఖచ్చితంగా పరిశీలించాలంటూ ప్రజలకు సూచించారు.
Comments 0