రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం పై మండలాధికారులతో మండల సమన్వయ కమిటీ సమావేశం మరియు ఏ.ఎన్.ఎం.లు,ఆశా కార్యకర్తలకు, అంగన్వాడీ టీచర్లకు పోలియో కార్యక్రమం పై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సతీష్ కుమార్, ఎంపీడీవో చిరంజీవి, సుష్మ ఎంపీ ఓ, ప్రమీల సిహెచ్ఓ, శ్రీనివాస్ హెచ్ ఈ ఓ, శ్రీధర్ హెచ్ఎస్, రత్నమాణిక్యం హెచ్ ఎస్, మరియు ఏ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లలు పాల్గొన్నారు.