గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఏటీఎం సెంటర్లలో భద్రతపై గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థ, లైటింగ్, సెక్యూరిటీ గార్డ్‌ల పనితీరును పరిశీలించారు. హై రిజల్యూషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి నిరంతరం పనిచేసేలా చూడాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని, కస్టమర్లకు భద్రతపై అవగాహన కల్పించాలని సీఐ సూచించారు.