|
modi add 1

రాయికల్ మున్సిపల్ చైర్మన్ కట్కం రవీంధర్, వైస్ చైర్ పర్సన్గా తురగ సౌజన్య

రాయికల్ మున్సిపాలిటీలో కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.మున్సిపల్ చైర్మన్ పీఠానికి ఇద్దరు మాత్రమే నామినేషన్ దాఖలు.చేయగా భాజపా నుంచి కల్లెడ ధర్మపురి ని కునరపు మానస ప్రతిపాదించగా తోపరపు ప్రశాంతి బలపరిచారు.బారాస నుండి తురగ సౌజన్య కట్కం రవీందర్ ను చైర్మన్ గా ప్రతిపాదన చేయగా ఎలిగేటి లతిక బల పరిచారు.కాంగ్రెస్,బారాస సభ్యుల తో పాటు స్వాతంత్ర అభ్యర్థి మద్దతు ఇవ్వడంతో బారాస పార్టీ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నారు.రాయికల్ పురపాలిక చైర్మన్ గా కట్కం రవీందర్,వైస్ చైర్ పర్సన్ గా తురగ సౌజన్య ఎన్నికయ్యారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ కట్కం రవీందర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పురపాలక చైర్మెన్ గా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు.రాయికల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పనలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు.వైస్ చైర్ పర్సన్ తురగ సౌజన్య మాట్లాడుతూ రాయికల్ పట్టణ అభివృద్ధికి అందరితో సమన్వయంగా పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి తోడ్పడుతానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పురపాలిక సిబ్బంది పాల్గొన్నారు.

By Gantyala Praveen | February 16, 2026 | 0 Comments

"గుడికోట' లో ఘనంగా రథోత్సవం

రాయికల్ పట్టణం గుడికోట ఆలయం లో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆఖరి ఘట్టమైన శివపార్వతుల రథోత్సవం కనుల పండుగ సాగింది. ఆదివారం ఆలయ కమిటీ మరియు ప్రధాన అర్చకులు మంగోలి సతీష్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు మునుగోటి రమేష్ శర్మ శివపార్వతుల కళ్యాణం, అభిషేకం మరియు స్వామివారికి బిల్వార్చన తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రోజున స్వామి వారి దర్శనం,రథోత్సవం డప్పు చప్పుల్లు మరియు మంగళవారం వాయిధ్యాలు మధ్యన కన్నుల పండుగ సాగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మచ్చ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి మంతెన మహేందర్, కోశాధికారి సాంబారు శ్రీనివాస్ లతోపాటు ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | February 16, 2026 | 0 Comments

రావికంటి "గుడికోట"చరిత్ర తెలుసుకుందాం.. ఆర్థిక చేయూతనిద్దాం!

మన రావికంటి చరిత్ర రావికంటిలో 'మిట్టన గుళ్ళు వంపున చెరువు' నిర్మించిన స్వాభిమాని జైనరాణి లకుమాదేవి! జగిత్యాల్ జిల్లా కేంద్రానికి అటు కోరుట్ల పట్టణానికి కేవలం 15-20 కి మీ దూరంలోనున్నా రాయికల్ ను మారుమూల గ్రామం అనేవారు. నాటి కాలంలో రావికంటి,ప్రభాకరరావు పేట,గోవిందరాజు పేట, బద్దులాపురం( పద్మాపురం ), నందిపేట, నాగారం, కొండాపురం అను ఏడు గ్రామాలు కలిసి ఏర్పడడం వల్ల గ్రామీణులు దీన్ని ఇప్పటికీ 'రావికంటి' అనే పిలుస్తుంటారు. వేములవాడ చాళుక్యుల/ కాకతీయుల కాలంనాటి గుడి, ఒకప్పుడు దాని చుట్టూవున్న కోటను బట్టి 'గుడికోట' గా ప్రసిద్ధమైన ప్రస్తుతం 'శ్రీ కేశవనాథస్వామి ఆలయం'గా పిలువబడుతున్న ఇక్కడి త్రికూటాలయం రాయికల్ కు మాకుటాయామనం లాంటిది. కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడు ( 1296-1325) రాజ్యం చేస్తున్న కాలంలో వారి సామంతుడు రుద్రదేవుడు,వారి సేవకుడు బెజగంగూలెంక శకవర్షం 1227 శ్రావణ బహుళ ద్వాదశి వడ్డవారం (క్రీశ1305 ఆగస్టు17మంగళవారం) నాటి దాన శాసనం ప్రకారం ఇది ఆనాడు రామనాథ లఖుమేశ్వర ( లక్ష్మణేశ్వర)ఆలయం. అయితే వేములవాడ రాజధానిగా కరీంనగర్ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యుల కాలంలో ఇది 'జైనాలయం'గా వుండేదని ఈ ఆలయ పరిసరాల త్రవ్వకాల్లో లభించిన జైన తీర్థంకరుని శిరస్సును బట్టి అర్థమౌతుంది. అంతే కాదు ఇక్కడి స్థల చరిత్రలో ఆలయ నిర్మాత గా చెప్పబడే, వైశ్య వనితగా భావించబడే 'లకుమాదేవి 'జైన మతస్తురాలు కావడం విశేషం. ఈ రాణి స్వాభిమానం మహిళా లోకానికే గర్వ కారణం. లకుమాదేవి తన బిడ్డకు పాలిస్తున్న సమయంలో ఆమె మామగారు లోపలికి రావడం , అది ఆమె గమనించక పోవడం జరిగిందట. కోడలు తనను చూసి కూడా లేచి నిలబడలేదని, కుర్చీ పీట వేయలేదని ఆగ్రహించిన ఆ పెద్దాయన ' వంపున చెరువు - మిట్టన గుళ్ళు కట్టించిన రాణిలా మిడిసిపడుతున్నావని' అన్నాడట. ఆత్మభిమానం గల లకుమ బాధ పడుతూనే 'గర్వంతో కాదు మీ రాక గమనించకనే, అయితే మీ వాక్కుల్లో నాకు భవిష్యత్ వాణి వినబడుతుంది, మీరన్న పనులు నేను చేసి చూపుతా'నని ప్రతిన బూని తన తల్లిగారు పెట్టిన ఏడు వారాల నగలను కూడా అమ్మి 'మిట్టన ఈ గుళ్ళు - వంపున చెరువు' నిర్మించిందని చెబుతారు. చెరువు నిర్మాణం పూర్తి అయినా వర్షాభావం వల్ల అది నిండకపోవడాన్ని కొందరు పండితులు తన దోషంగా చెబుతూ చెరువు నరబలి కోరుతుందనడంతో స్వయంగా తానే ఒక అర్ధరాత్రి లేచి సర్వాలంకార భూషితయయి వెళ్లి చెరువులో ఒక గుండు దగ్గర ఊరి కోసం ప్రాణత్యాగం చేసిందన్నది బహుళ ప్రచారంలోనున్న కథ. ఈ మహాసాధ్వి పేరుతో ఇప్పటికీ అది 'లకుమాదేవి గుండు 'గానే పిలువబడుతుంది. కాకతీయుల కాలం నాటి 'బెజగంగూలెంక దాన శాసనాన్ని' లెక్కలోకి తీసుకున్నా రాయికల్ దాదాపు ఏడున్నర శతాబ్దాల నాటి చారిత్రక గ్రామం. 'మాధవ చరిత్ర(అముద్రితం) 'కర్త తిరునగరి నర్సింహదాసు, రామశతక కర్త వరకవి భూమగౌడు (వీరి జీవిత ఆధారంగా నేను రచించిన నవల ఇదే పేరుతో 2017 లో వెలువడింది. కీ శే వేముల పెరుమాళ్ళు గారు రాయికల్ మండల మొదటి అధ్యక్షులు(1987-1993)కావడమే కాకుండా 'శ్రీ కేశవనాథ స్వామి ఆలయ' చరిత్రను వెలికితీసి దీని అభివృద్ధికి విశేషంగా కృషి చేసినారు. మహాశివరాత్రి సందర్భంగా మన "గుడి కోట" ఆలయంలో ధన,వస్తు రూపేనా సహాయం చేయవలసిన వారు గుడి కోట ఆలయ అభివృద్ధి కమిటీ కోశాధికారి "సాంబరు శ్రీనివాస్" ఫోన్ పే నెంబర్ 9030159587 కి పంపించగలరు.

By Gantyala Praveen | February 14, 2026 | 0 Comments

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాఖ్య లపై భగ్గుమన్న "వెల్మ సంఘం"

రాయికల్ పట్టణంలోని వెల్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెల్మ సంక్షేమ సంఘం సభ్యులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని కులాల, సామాజిక వర్గాల, ప్రజలను సమానంగా చూస్తానని ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కాగా రాజ్యాంగబద్ధంగా ఆయన చేసిన ప్రమాణాన్ని తరుచుగా విస్మరిస్తూ వెల్మ కులం మీద విరుచుక పడుతూ వెల్మలపై కాక్ష్య సాధింపు కు దిగుతున్నారని వ్యక్తులతో రాజకీయ వైరుధ్యాలు ఉంటే అట్టి వ్యక్తులతో చూసుకోవాలి కానీ పదేపదే వెలుమ కులాన్ని దూషిస్తూ వ్యాఖ్యలు చేయడం వలన మా మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై ఇలాగే ప్రవర్తిస్తే ఊరుకోం అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెల్మ నాయకులు ఆలోచించి రేవంత్ రెడ్డి ని గట్టిగా నిలదీయాలి అని ఇకనైనా మంచి బుద్ధిని నేర్పాలని హితువు పలికారు ఆయన రావుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేస్తున్న వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఐ కమాండ్ దృష్టికి తీసుకుపోయి ముఖ్యమంత్రి పై చర్యలు తీసుకునేలా చేయాలని సూచించారు.ఇకనైనా ముఖ్యమంత్రి తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికలల్లో మా వెల్మల సత్తా ఎందో చూపిస్తామని హెచ్చరించారు . కేసీఆర్ వేల్మ జాతిలో పుట్టి తెలంగాణ రాష్ట్రం రావడానికి చేసిన కృషి వలన ఆయనను జాతి పితా అని అభిమానులు గౌరవంగా సంబోధిస్తే మీకు వచ్చిన భాధ ఎంది అని ప్రశ్నించారు పదేపదే వెల్మ జాతిని కించపరుస్తూ ఉంటే చట్టపరంగా న్యాయబద్ధంగా వెళ్లేందుకు కూడ వెనుకడుగు వేయమని చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో దుగ్యాల రాజేశ్వర్ రావు, యాచమనేని శ్రీనివాసరావు, సంతోష్ రావు, జకిలేటి హరీష్ రావు, జకిలేటి రాజశేఖర్ రావు, ప్రశాంత్ రావు, యాచమనేని కిరణ్ రావు, లక్మణ్ రావు, దాసరపు వేణు రావు, కరుణాకర్ రావు, దుగ్యాల రమాపతి రావు, దుగ్యాల శ్రీనివాస్ రావు, సాగర్ రావు,రత్నాకర్ రావు మండల వెలమ సభ్యులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | February 05, 2026 | 0 Comments

రాయికల్ "భీమన్న" ఆలయానికీ ఆర్థిక చేయూతనిద్దాం!

రాయికల్ పట్టణంలోని వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న భీమన్న ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది ప్రజలు ఆలయంలో ప్రతియోటా ఫిబ్రవరి నెలలో వచ్చే పౌర్ణమికి ప్రారంభం అయి మూడు రోజులు జరిగే భీమన్న జాతరకు చుట్టూ పక్కల జగిత్యాల,మెట్ పల్లి, కోరుట్ల,మల్లాపూర్ ఖానాపూర్, మరియు ఇతర జిల్లా కేంద్రాలు అయినా నిజామాబాద్ ,కరీంనగర్ ఆదిలాబాద్ వేలాదిగా ప్రజలు వచ్చి స్వామివారికి మొ క్కులు చెల్లించుకుంటారు. మూడవ తేదీనాడు ఘనంగా స్వామివారి రథోత్సవం జరుగనున్నది. భీమన్న ఆలయ అభివృద్ధి రీత్యా ఆర్థిక సహాయం అందించాలని భక్తులకు ఆలయ నిర్వాహకులు దేవుని లింగయ్య విజ్ఞప్తి చేశారు. ఆలయం రోడ్డుకు ఇరువైపులా కామన్ లు మరియు ఆలయం చుట్టూ సిసి స్లాబ్ వేయుటకు ఆర్థిక సహాయం చేయుటకు జి పే /ఫోన్ పే నెంబర్ 9441725016,9908645621 సంప్రదించండి.

By Gantyala Praveen | February 02, 2026 | 0 Comments

రాయికల్ మున్సిపల్ వార్... ముగిసిన నామినేషన్లు.. 100 మంది అభ్యర్థులు

రాయికల్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు శుక్రవారం ముగిసింది మొత్తం 100 మంది అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. జనవరి 31న నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది అదే రోజు ఫైనల్ అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తుంది ఈసీ ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా 13న కౌంటింగ్ జరుగుతుంది. 1వ వార్డులో కైరాం రమణ BRS , ఫర్హాన్జాజ్ Congress ,తోపరపు సౌందర్య BJP ,తోపరపు ప్రశాంతి BJP ..... 2వ వార్డులో మ్యకల రమేష్ Congress కట్కం రవి. BRS శ్రీరాముల సత్యనారాయణ BRS సుంటిగీకర రాము BJP .... 3 వ వార్డు లో భూక్యా రాకేష్ నాయక్ Congress కన్నాక మహేందర్ BRS కురిసేంగ వేణు BJP ఆత్రం పెద్ద ఆనంద్ inc చౌహాన్ శ్రీనివాస్. Janasena ఆత్రం శంకర్ ind .... 4వ వార్డు లో తురగ సౌజన్య BRS పుప్పాల వనిత Congress అఫ్ష షహీదా మున్ను Congress సురతని భాగ్య bjp.... 5వ వార్డులో వల్ల కొండ సంధ్య BRS కునారపు అనూష BJP సింగని శారద. Congress అఫ్ష మున్ను. Congress తాటిపముల మమత Congress కసవెని హేమలత. Janasena దువ్వక వాణి ind .... 6వ వార్డులో వేముల మౌనిక BJp ఆసియా నికిత్ Congress తబస్సుం. Brs తలత్ ఫాతిమా brs సదాశ ఫాతిమా. Congress పిప్పిజి సునీత congress బండపెల్లి లక్ష్మి bjp ... 7వ వార్డులో ఎలిగేటి అనిల్ BRS ఎలిగేటి లతికా BRS ఎలిగేటి రాజేశ్వరి BRS కోన రాజు. BJP సమాళ్ల రాజేశం. Bjp దువ్వక లావణ్య. Congress చిలువేరి ప్రవీణ్. BJP మచ్చ నారాయణ ,BJP గట్టుపెళ్లి నరేష్. Congress మోర హన్మండ్లు కాంగ్రెస్... 8వ వార్డులో బోదాసు నవీన్ brs మచ్చ నారాయణ బీజేపీ కడకుంట్ల నరేష్ కాంగ్రెస్ పల్లికొండ గంగాధర్ కాంగ్రెస్ మ్యకల జనార్ధన్ జన సేన ......... 9వ వార్డులో శ్రీరాముల సువర్ణ brs బత్తిని మహేశ్వరి కాంగ్రెస్ కైరమ్ అనూష బీజేపీ గండ్ర రమాదేవి కాంగ్రెస్ వాసం సుమలత కాంగ్రెస్ గాజుల జ్యోతి ind ..... 10 వార్డులో మచ్చ గంగలక్ష్మి Congress ఆడెపు ప్రశాంతి bjp పెండెల వనిత brs లింగంపల్లి రోజా ind కొత్తపల్లి లావణ్య brs...... 11 వార్డులో మారంపల్లి సాయికుమార్ BRS మరంపెల్లి రాణి BRS నేరేళ్ల వినోద్ brs పాలేపు బాలరాజు జనసేన పాశం నడిపి భూమయ్య. Congress ముక్కెర రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ పుర్రె శ్రీధర్. Bjp లింగంపల్లి రాజేష్ కాంగ్రెస్ ..... 12 వ వార్డు లో మోర ధీరజ్(రామ్మూర్తి) congress సిర్ప మణిదీప్ BRS/ind కల్లెడ ధర్మపురి bjp మచ్చ నారాయణ bjp గంగాధరి గంగాధర్ ind ఆడెపు అర్జున్ జనసేన పాలేపు బాలరాజు జనసేన కట్ల నర్సయ్య కాంగ్రెస్.

By Gantyala Praveen | January 30, 2026 | 0 Comments

సహృదయు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ పెన్నుల పంపిణీ

సహృదయు ఫౌండేషన్ ఆధ్వర్యం లో శుక్రవారం రోజున గంగుల శ్రీనివాస్ సారిక 12వ పెళ్లి రోజు సందర్భంగా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో దంపతులు 40 పరీక్ష ప్యాడ్స్ పెన్నుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్కూల్ హెడ్ మాస్టర్ మోహన్ రెడ్డి, ఉపాధ్య యులు గంగరాజం ,నర్సయ్య ఫౌండేషన్ సభ్యులు గంగుల శ్రీనివాస్, మహేష్, వెంకటేష్,అభి, రాజు ,రాము తది తరులు పాల్గొన్నారు

By Gantyala Praveen | January 30, 2026 | 0 Comments

హిందీ భాష దేశవ్యాప్త ఐక్యతకు ప్రతీక

జాతీయభాష హిందీ ద్వారా విద్యార్థులలో జాతీయభావాలు పెంపొందుతాయని, దేశభక్తి కలిగిన ఉత్తమ పౌరులుగా వారు ఎదుగుతారని తాట్లావాయి కాంప్లెక్స్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బోగ రమేష్ అన్నారు. జడ్పీహెచ్ఎస్ తాట్లావాయి పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన హిందీ ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హిందీ భాష దేశవ్యాప్త ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, భిన్న భాషలు, సంస్కృతులు కలిగిన భారతదేశాన్ని ఒక్కటిగా కట్టిపడేసే శక్తి హిందీకి ఉందని పేర్కొన్నారు. ఆరవ, ఏడవ తరగతి విద్యార్థులకు హిందీ వర్ణమాల, గుణితాలు పటిష్టంగా నేర్పి, వారు ఎనిమిదో, తొమ్మిదో, పదవ తరగతులకు వచ్చేసరికి హిందీని స్పష్టంగా చదివే స్థాయికి తీసుకురావాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇది విద్యార్థుల భాషా నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా జాతీయ చైతన్యాన్ని బలపరుస్తుందని తెలిపారు. జాతీయభాష అభివృద్ధి బాధ్యత ప్రతి హిందీ ఉపాధ్యాయుడిపైనే ఉందని, అందరూ సమిష్టిగా కృషి చేసి హిందీ భాష ఔన్నత్యాన్ని విద్యార్థులకు చేరువ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు హిందీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, రీసోర్స్ పర్సన్స్ వసంతరావు, సయీద్ పాషా, సి.ఆర్.పి నూతికట్ల సత్యనారాయణ, రాపర్తి నర్సయ్య, మ్యాకల శంకరయ్య, మోర నరహరి, జంగిలి రాజేశం, నారాయణ, కూరగాయల సురేష్, గంగాధర్, రమేష్, మల్లేషం, యశోద, సదా లక్ష్మీ, ధనలక్ష్మి, స్వప్న, పద్మజా, సుజాత తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | January 30, 2026 | 0 Comments

ఎన్నికల ప్రవర్తన నియమావాళిని పాటించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్

శుక్రవారం రోజున రాయికల్ మున్సిపాలిటీలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్బంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసి నామినేషన్ ఫారాలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆయా వార్డులకు దాఖలైన నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటిని, అప్పిళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన తదితర ప్రక్రియలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాఖలైన నామినేషన్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి వెంట వెంటనే రోజు వారీగా టీ. పోల్ యాప్ లో అప్ లోడ్ చేయాలని అన్నారు. అభ్యర్థులు అన్ని వివరాలతో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేలా హెల్ప్ డెస్క్ ద్వారా అవగాహన కల్పించాలని, వారి సందేహాలు నివృత్తి చేయాలని అన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను పక్కాగా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించుటకు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో రాయికల్ మున్సిపల్ కమిషనర్ నాగరాజు, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | January 30, 2026 | 0 Comments

"మీడియా టుడే" క్యాలెండర్ ఆవిష్కరణ

జగిత్యాల పట్టణంలో ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రముఖ జాతీయ దినపత్రిక "మీడియా టుడే" క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాయటంలో, సమస్యలను వెలికితీయటంలో పత్రికల పాత్ర ఎంతో ఉందని , అనతి కాలంలో నే మీడియా టుడే పత్రిక తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మీడియా టుడే చీఫ్ ఎడిటర్ ఏ.ఎం. రాజురెడ్డి, ఎడిటర్ కడకుంట్ల జగదీశ్వర్, వార్తా పత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎల్లాల రాజేందర్ రెడ్డి, సాక్షి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కందుకూరి శశిధర్, సిక్స్ టీవీ ఉమ్మడి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ప్రవీణ్ కుమార్ ,భారత్ టుడే రిపోర్టర్ సిరిసిల్ల వేణుగోపాల్, నమస్తే తెలంగాణ రూరల్ రిపోర్టర్ బండ స్వామి, బి ఆర్ కె స్ట్రింగర్ గాజుల మహేష్, మహా న్యూస్ స్ట్రింగర్ రఘు ఐ న్యూస్ స్ప్రింగర్ శ్రీకాంత్ గౌడ్, మేఘ9 స్ట్రింగర్ చందు మరియు మీడియా టుడే రిపోర్టర్ లవులి సంతోష్ తదితరులు పాల్గొన్నారు

By Gantyala Praveen | January 29, 2026 | 0 Comments

Hot Categories

2
8