|
modi add 1

తెలంగాణ రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు డో,కరాటే పోటీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో వీర కుంఫు అకాడమీ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కూంఫు కరాటే ఛాంపియన్ షీప్- 2025 లో కూంఫు డో,మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ కనుక ప్రభాకర్, కనుక ప్రవీణ్ కుమార్ మరియు హరికృష్ణ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన రాయికల్ కు చెందిన 18 మంది కూంఫు డో విద్యార్థులకు 16 బంగారు పతకాలు, రెండు వెండి పథకాలు సాధించారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ కనుక ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు కూంఫు డో , మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకోవడం వల్ల శారీరకంగా,మానసికంగా ధృడత్వం పెరిగి స్వీయ రక్షణలో ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు.

By Gantyala Praveen | December 08, 2025 | 0 Comments

జిల్లా కోర్టును సందర్శించిన విస్డం విద్యార్థులు

విజ్డం హై స్కూల్ రాయికల్ కి చెందిన విద్యార్థులు ఎడ్యుకేషన్ టూర్ లో భాగంగా శుక్రవారం రోజున జిల్లా కోర్టును సందర్శించారు. గంటన్నరసేపు కోర్టులో జరిగే కేసుల విచారణ, న్యాయవాదుల వాదోపవాదాలు, జడ్జి తీర్పునిచ్చే విధానాన్ని విద్యార్థులు గమనించారు. కోర్టు ఆవరణలోని రికార్డ్ రూమ్, సెక్షన్ రూమ్ లలో కేసులకు సంబంధించిన ఫైల్స్ ను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం, జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయాలను సందర్శించి వివిధ రకాల సేవలు సమస్యల పరిష్కారాల గురించి సంబంధిత అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం పుస్తకాలలో చదువు మాత్రమే కాకుండా,ఇలాంటి ఎడ్యుకేషన్ టూర్ ల ద్వారా విజ్ఞానం తో పాటు మంచి, చెడు ల మధ్య తేడాలు,నేరాల మీద వాటికీ విధించే శిక్ష ల మీద అవగాహన, సమాజం లో విద్యార్థులకు ప్రశ్నించే తత్వం, ఉన్నత అధికారులతో ప్రవర్తించే తీరు, వారితో పని తీసుకోవడంలో అవగాహన తో పాటు జీవితంలో ఉన్నత లక్ష్యాలు నిర్ణయించుకుని, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమం లో , ఉపాధ్యాయులు,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

By Gantyala Praveen | November 22, 2025 | 0 Comments

వివేకవర్ధిని ఉన్నత పాఠశాలలో ఘనంగా ఎన్‌సిసి అవతరణ దినోత్సవం

రాయికల్ పట్టణంలోని వివేకవర్ధిని ఉన్నత పాఠశాలలో ఎన్‌సిసి అవతరణ దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కైరం సత్యం మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు సైనిక శిక్షణ ఇచ్చి అత్యవసర పరిస్థితుల్లో సేవల నిమిత్తం సిద్ధంగా ఉంచడం ఈ సమస్త ప్రధాన లక్ష్యం అని స్కూలు రోజులనుంచి తలపై ఎర్రటి కుచ్చులు గల టోపి తో ఖాకీ దుస్తులు ధరించి శిక్షణ తీసుకునే విద్యార్ధులనే ఎన్‌.సి.సి. స్టూడెంట్స్ అంటాము నేటి చిన్నారులే రేపటి పౌరులు క్రమశిక్షణాయుత , దేశభక్తిగ పౌరులను తయారుచేయడమే ఎన్‌.సి.సి. ముఖ్య ఉద్దేశము . ఎన్‌.సి.సి. లో చేరే పిల్లలు దృఢ చిత్తము తో శిక్షణ సాగిస్తుంటారు . ఎన్ .సి .సి సర్టిఫికెట్ ద్వారా విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత చదువులకు మరియు ఉద్యోగ అవకాశాలకు తోడ్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివేకవర్ధిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | November 22, 2025 | 0 Comments

మధ్యప్రదేశ్: జబల్పూర్‌లోని ఇంగ్లీష్ మీడియం స్కూల్ షరియాకు అనుగుణంగా మారింది, ఆదివారం కాకుండా 'జుమ్మా డే' నాడు వారానికోసారి సెలవు ప్రకటించింది.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని అంజుమన్ ఇస్లామియా ఇంగ్లీష్ స్కూల్, ఆదివారం కాకుండా శుక్రవారం జుమ్మా డేను వారపు సెలవు దినంగా ప్రకటించడం ద్వారా వివాదానికి దారితీసింది, ఆదివారం అధికారిక వారపు సెలవు దినంగా ప్రభుత్వ నిబంధనలను విస్మరించింది. ఇక నుండి శుక్రవారం సెలవు దినంగా ఉంటుందని మరియు ఆదివారం పాఠశాల తెరిచి ఉంటుందని పాఠశాల యాజమాన్యం వాట్సాప్ గ్రూప్ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ నిర్ణయం తల్లిదండ్రులలో విస్తృత అసంతృప్తికి దారితీసింది మరియు త్వరలోనే పెద్ద సమస్యగా మారింది. బిజెపి మైనారిటీ ఫ్రంట్ ఈ చర్యను వ్యతిరేకించింది మరియు పాఠశాల యాజమాన్యంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా యంత్రాంగం మరియు విద్యా అధికారులకు ఫిర్యాదు చేసింది. మీడియా నివేదికల ప్రకారం, ఫిర్యాదుల తర్వాత, విద్యా శాఖ బృందం పాఠశాలకు చేరుకుని ప్రధాన గేటు తాళాన్ని పగలగొట్టింది. దర్యాప్తు తర్వాత, అంజుమన్ ఇస్లామియా బోర్డు అధికారులు తమ తప్పును అంగీకరించి, శుక్రవారం సెలవు దినంగా ప్రకటించాలనే ఆదేశాన్ని ఉపసంహరించుకున్నారు. జుమ్మా ప్రార్థనల కారణంగా చాలా మంది విద్యార్థులు శుక్రవారం పాఠశాలకు వెళ్లకుండా ఉండేవారని, అందుకే పాఠశాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని పాఠశాల మేనేజర్ అన్ను అన్వర్ వివరించారు. అయితే, ప్రజల నుండి అభ్యంతరాలు ఎదుర్కొన్న తర్వాత, ఆ ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకున్నారు మరియు ఆదివారం పాఠశాల మునుపటిలాగే వారపు సెలవు దినంగా పాటిస్తుంది. ఈ వివాదం నగరంలో తీవ్ర చర్చకు దారితీసింది, కొందరు ఈ నిర్ణయాన్ని శుక్రవారాల్లో విద్యార్థుల హాజరు సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారంగా భావించగా, మరికొందరు దీనిని మతపరమైన కారణాల ఆధారంగా జోక్యంగా విమర్శించారు. విద్యార్థుల విద్య ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల యాజమాన్యం వాదిస్తోంది, అయితే సమయాన్ని తిరిగి మార్చాలనే అధికారులు మరియు తల్లిదండ్రుల ఆదేశాన్ని అంగీకరించింది. అంజుమన్ ఇస్లామియా వక్ఫ్ బోర్డు నగరంలో మరో నాలుగు పాఠశాలలు మరియు ఒక కళాశాలను నిర్వహిస్తోంది, ఇక్కడ ముస్లింలు అధికంగా ఉండటం వల్ల సంవత్సరాలుగా శుక్రవారం సెలవులు పాటిస్తున్నారు. ప్రశ్నార్థక జబల్‌పూర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వారి ఆధ్వర్యంలోని ఆరు సంస్థలలో ఒకటి మరియు దాదాపు 700 మంది విద్యార్థులు ఉన్నారు.

By NYALAKONDA ANIL DESAI | November 02, 2025 | 0 Comments

నరహంతక కంపు సిద్ధాంతం

దున్నే వాడిదే భూమి, కంపనీలో పని చేసేవాడిదే ఉత్పత్తి లాంటి సొగసైన అందమైన నినాదం తో సామాన్యుల బుర్రల్లో ఆశలు నింపి తమ గల్లాలు నింపుకున్న సిద్ధాంతం ఏదయినా ఉంది అంటే అది కమ్యునిజం సిద్దాంతం ఒక్కటే. కాని చరిత్రలోకి తొంగి చూస్తే నక్షలిజమ్ పేర మన దేశం లోనే కాకుండా ఆ సిద్ధాంతం మొదలైన రష్యా చైనా లో కూడా ఆ సిద్ధాంతం ఒక విఫల సిద్దాంతంగా మిగిలి పొయింది. కాని ఇప్పటికీ మన దేశం లో కుహనా కమ్యునిజం వాదులు కమ్యునిజం సోషలిజం అంటూ నీతి వాక్యాలు చెబుతూ అమాయకుల బుర్రలు నింపేస్తునే ఉంటారు. మనలో కూడా చాలామంది వారి మాటలు నమ్మి కమ్యునిజం సిద్దాంతం మంచిదే కానీ ఆచరణ సాద్యం కానిది అని అంటూ ఒకరకమైన బ్రమలో మాట్లాడుతూ వుంటారు. మరి మంచి సిద్దాంత మైతే అది పుట్టిన చోట కూడా ఎందుకు విఫల మైనది. అలాగే కమ్యూనిజాన్ని అనుసరించిన దేశాలు కమ్యునిజం స్థానం లో కర్పోరేటికరణ ఎందుకు చేసారు. మావోయిజం పేరిట రైతుకు ఇచ్చిన భూమిని మల్లి ఎందుకు లాక్కున్నారు మల్లి ఎందుకు రైతులకు హక్కులు కల్పించారు వ్యవసయవిధానం లో కర్పోరేటికరణ ఎందుకు తీసుకు వచ్చారు అంటే సమాధానాలు చెప్పరు. అసలు ఈ సమాచారం ఎందుకు సమాజానికి తెలియనివ్వరు అనేది కోట్ల రూపాయల ప్రశ్న . దీనికి తోడు కొందరు మేధావుల ముసుగులో యువత నక్సలిజం వైపు మరలె విదంగా పాటలు నృత్యాలు కవితలు కథలు కాకరకాయలు రాసి యువత నక్షలిజమ్ వైపు వెళ్ళేల ప్రేరేపిస్తుంటారు . అలంటి వారిలో ప్రధాన మైన వ్యక్తి గద్దర్ వరవరరావు విమలక్కలు . గద్దర్ గురించి తెలియని వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు వుండరు ఈ విషయంలో అంతటి ప్రాముక్యత సాధించు కున్నారు. గ్రామగ్రామాన తిరిగి తన ఆటపాటలతో యువతను ఉద్రేక పరచారు . దీంతో అయన పాటల మూలంగా వేలాది మంది యువత నక్షలిజమ్ ప్రబావానికి గురై అడవుల పట్టారనే విమర్శలు అనేకం ఉన్నాయి. అలగే శ్రీశ్రీ లాంటి వారు పేదలు, ఆకలి కలయికలతో ఎన్నో కవితలు రాయడం మూలంగా యువత ఒకవిదమైన ప్రబుత్వ | రాజ్యవ్యతిరేక బావనకి లోనయ్యారు . అలగే అరుణోదయ కలమండలి పేరుతో విమలక్క లాంటి వారు కూడా ఇక్కడ అర్బన్ నక్సల్ కింద మనం మాట్లాడుకోవచ్చు. నాడు అంటే నక్షలిజమ్ భారత దేశం లో ప్రవేశించే క్రమంలో అంటే 1967 లో మొదటగా నక్షల్బరిలొ ప్రారంబమై మన దేశం లో దాదాపు 20 రాష్ట్రాల్లో 182 జిల్లాల్లో దాని ప్రబావం చూపినప్పటికీ ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ , జార్ఖండ్ ,ఒడిష ,వెస్ట్ బెంగాల్ ,బిహార్ ,తెలంగాణా , ఆంధ్రప్రదేశ్ ,మహారాష్ట్ర లలో 18 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది . అదికూడా నేదో రేపో అంతం కానుంది ఈమేరకు ఈ దేశపు హోంమంత్రి అమిత్ షా 2026 డిసెంబర్ నాటికి నక్షలిజమ్ లేకుండా చేస్తామని ప్రకటించారు. అయితే నేడు ఈ నక్షలిజమ్ అర్బన్ నక్సలిజం గ మారడమే కాకుండా నాటి దున్నే వాడిదే బూమి నినాదం నుండి పని చేసే వాడిదే కంపని లాభం అనేంతగా ఎదిగింది . కాని దీనికి ఏ సమాజాన్ని రెచ్చగొట్టి విప్లవం తీసుకు రావాలని చూసారో ఆ సమాజం నుండే మద్దతు కరువు అవడం తో ఇప్పుడు కొత్తగా కులాల పేరుతో మతాల పేరుతో కుల అంతరాల పేరుతో వీరి బావజాలం ప్రవహిస్తోంది. అది అలా ఉన్నప్పటికీ అసలు ఈ మావోయిజం లెనినిజం నక్సలిజం పుట్టిన రష్యా చైనల్లోనే కనుమరుగయ్యింది. అసలు ఈ నక్సలిజం కారణంగా రష్యా చైనాల్లో 1917 నుండి 1930 వరకు దాదాపు 10 కోట్ల ప్రాణాలు గాల్లో కలిసి పొయ్యాయి. మొదట సోషలిజం కమ్యునిజం పేరుతో కారల్ మార్క్స్ విదానాలంటూ 1920 , 1930 ప్రాంతాల్లో భూమి కలెక్ట వైజేషణ్ పేరుతో రైతుల దగ్గరి నుండి భూములను లాక్కుని ప్రభుత్వం దగ్గరే పెట్టుకొని వ్యవసాయం చేయించారు. దీంతో ఉక్రెయిన్ లో తీవ్ర కరువు సంభవించి ఆకలితో కూడా లక్షలాది మంది చనిపోయ్యారు . దీనికి కారణం భూమి ప్రభుత్వం దగ్గర వుండడం తో ఎవరు సరయిన పద్దతిలో పని చెయ్యక పోవడమే. కాని చేసినట్లుగా దొంగ లెక్కలు చూపించి ప్రజా ధనాన్ని మాత్రం కాజేశారు . కానీ మార్కెట్లో నిత్యావసర సరుకులు లేకపోవడం తో ఆకలితో లక్షలాది మంది చని పొయ్యారు. ఇక చైనాలో కూడా లెనిన్ మావోల ప్రబావం తో సోషలిజం పేర 1953-1958 మావో జెడాంగ్ సమానత్వం పేరిట ప్రజల భూములు లాక్కోబడ్డాయి. ప్రజలు తమ భూములు ఇవ్వడానికి నిరాకరించడం తో రక్తపుటేరులు పారించి బలవంతంగా భూములు లాక్కున్నారు . ఇక్కడ కూడా సేం రష్యాలో జరిగినట్లుగానే ఆహారకొరత ఏర్పడింది. మొదట్లో కొంత మెరుగ్గా అనిపించినా 1978 నాటికి పరిస్థితి దిగజారిపోయింది. వ్యవసాయ ఉద్యోగులు అందరు కూడా దొంగ లెక్కలు చూపించి ప్రజా ధనాన్ని కాజేశారు. చేసేది లేక చైనా తిరిగి భూములను లీజుకు ఇచ్చే పద్ధతి తీసుకు వచ్చి ఈ విషయం లో ప్రవేటు బాగస్వామ్యాన్ని కలిపింది. కాని ప్రస్తుతం అటు రష్యాలో కాని ఇటు చైనా లో కాని వ్యవసాయ భూములన్నీ కూడా కార్పొరేట చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు చైనా రష్యాలలో సామాన్య రైతులు వ్యవసాయం చేయలేక కార్పోరేట్ సంస్థలకు తమ భూములను అమ్మేసుకుంటున్నారు దీంతో ఇప్పుడు vరష్యాలో వ్యవసాయ భూములలో గణనీయమైన భాగం పెద్ద వ్యవసాయ సంస్థలు మరియు కార్పొరేట్ హోల్డింగ్స్ వద్ద ఉంది. 2023 నాటికి, 73 ప్రధాన సంస్థలు 17.4 మిలియన్ హెక్టార్ల భూమిని నియంత్రిస్తున్నాయి, ఇందులో టాప్-5 సంస్థలు 4.4 మిలియన్ హెక్టార్లను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, Prodimex, Rusagro, Miratorg వంటి సంస్థలు పెద్ద ఎత్తున భూములను కలిగి ఉన్నాయి. చైనాలో కూడా 1978 డెంగ్ సంస్కరణల తర్వాత, చిన్న రైతు ఫామ్‌లు (0.5 హెక్టార్) పెద్ద సంస్థలకు లీజ్ చేస్తున్నాయి. 2025 నాటికి, 30% వ్యవసాయ భూమి పెద్ద ఫామ్‌లలో చేరిపోయింది . ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నక్షలిజమ్ మన దేశం లోకి 1967 ప్రాంతం లో బెంగాల్ లోని నక్సల్ బరి లో మొదటగా కనపడి దేశం లోని 20 రాష్ట్రాలలోని 182 జిల్లాలకు పాకింది. మన తెలుగు ప్రాంతం లో ముఖ్యమైన వారిలో కొండపల్లి సీతారామయ్య ,నంబాల కేశవరావు .వెంపటాపు సత్యనారాయణ , ఆదిబట్ల కైలాసం , నల్ల యాది రెడ్డి , సుబ్బారావు పాణిగ్రాహి ,సంతోష్ రెడ్డి , శీలం నరేష్ , కట్టా రామచంద్ర రెడ్డి , సుజాత లాంటి వరెందరో కనపడుతారు. ప్రస్తుతం వీరి లో చాల వరకు పొలిసు ఎన్ కౌంటర్ లలో చని పొయ్యారు . నక్షలిజమ్ ఎక్కడ అయితే పురుడు పోసుకున్తుందో అక్కడ అభివృద్ధి అన్న మాటే ఉండదు. నక్షలిజమ్ సిద్ధాంతం మావో లెనినిజం సిద్ధాంతం ల పేరుతో దాదాపు 30 సంవత్సరాల పాటు బెంగాల్ ను పాలించిన జ్యోతి బసునే మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బెంగాల్లో ఎలాంటి దరిద్రం వుందో మనం కళ్ళార చూస్తున్నాము . నక్సలిజం ఉనికి ఎక్కడ అయితే కనపడుతుందో అక్కడ ఒక రోడ్డు వేయనివ్వరు ఒక విద్యుత్ ఫెసిలిటి రానివ్వరు అంత చీకటి మయం. ఇలా అభివృద్ధి లేని ప్రజల జీవితాలు ఎలా బాగుపడతాయో చెప్పమంటే వీళ్ళ దగ్గర సమాదానం ఉండదు. తుపాకి అండన ప్రజలను కాపు కాస్తూ పైగా రాజ్యం హింసిస్తోంది అంటారు. అయిన దానికి కాని దానికి సాటి మనుషుల్ని చంపుకుంటూ వెళ్ళే వీళ్ళకు రాజ్యం హింసిస్తోంది అనే అర్హత ఎవరిచ్చారు . ఒకప్పుడు కమ్యునిజం ఏలిన ప్రపంచం లోని ఎన్నో దేశాలు సోవియట్ యూనియన్, చైనా , క్యుభా , వియత్నాం , ఉత్తర కొరియా , తూర్పు ఐరోపా దేశాలు , లాటిన్ అమరిక దేశాలు ఇప్పుడు ప్రజాస్వామ్యం వైపు నడుస్తున్నాయి . ఇదే మావోయిజం పుట్టిన రష్యా చైనాలో ఇప్పుడు నక్షలిజమ్ అంటే తూటాలతో జల్లెడ పడుతారు. కాని మన దేశం లో మాత్రం ఇంకా మేము తుపాకి తో రాజ్యాధికారం సాదిద్దామంటూ యువతను రెచ్చ గొడుతున్నారు . మందు పాతరలు పేల్చి సాటి మనుషులను రాక్షసుల మదిరి పొట్టన పెట్టుకుంటున్నారు. మనం ఇది వరకు కూడా వీడియోల్లో చర్చించుకున్నాము మన దేశం లో కేవలం నక్సలిజం కారణంగా దాదాపు 50 వేల మంది భారతీయులు చనిపోయ్యారు . ఇందులో చని పోయిన వారిలో 99.99 శాతం సామాన్య పేదలే ఉన్నారు. వీరంతా ఏమి పాపం చేసారు ఈ కమ్యునిజం నక్సలిజం సిద్దాంతాల కొరకు సామాన్యులు తమ ప్రాణాలు ఇస్తుంటే ఇదే సిద్దాంతాన్ని వాడుకున్నన్ని రోజులు వాడుకొని చివరకు జన జీవన స్రవంతి పేరుతో కోట్లాది రూపాయల ప్రజదనం పోగేసుకొని సామాన్యుడిల సన్నాయి నొక్కులు నొక్కడం దేనిని సూచిస్తుంది. ఇది యువత అర్ధం చేసుకుంటే నక్సలిజం లేదా మావోయిజం అనే మాట నోట్లోంచి వచ్చినా కూడా వాడిని అక్కడికక్కడే జనం ఉప్పు పాతర వేస్తారన్నది నగ్నసత్యం. న్యాలకొండ అనిల్ రావు దేశాయి సామాజిక విశ్లేషకులు 9912009171

By NYALAKONDA ANIL DESAI | September 25, 2025 | 0 Comments

16 వేల మంది దేశం మీద పడి తింటున్న ద్రోహులకు చెక్

దేశం పడి తేరగా తినడమే గాక అనేక నేరాలకు పాల్గొంటున్న విదేశీయులను భాహిష్కరించడానికి కేంద్రం రెడీ అవుతోంది . ఈ మేరకు రూపొందించిన నూతన విదేశీ వలస చట్టాలను వారిపై ప్రయోగించడానికి సిద్ధం అవుతోంది . ఇందుకుగాను నార్కోటిక్స్ రవాణా, ఇతర నేరాలతో సంబంధమున్న దాదాపు 16 వేల మంది విదేశీయులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం వీరందరూ నిర్బంధంలోనే వున్నారు. వీరందర్నీ దేశం నుంచి బహిష్కరించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది. అయితే ఈ 16 వేల మంది జాబితాను ఇప్పటికే హోంశాఖ సంబంధిత సంస్థలకు కూడా అందించింది. మరో వైపు మన దేశంలో అక్రమంగా నివాసం వుంటున్న విదేశీయులకు కఠిన శిక్షలు విధించే కొత్త చట్టం సెప్టెంబర్ 2 న అమలులోకి వచ్చింది. దీని ప్రకారం తప్పుడు పత్రాలతో దేశంలోకి వచ్చిన విదేశీయులకు కనిష్టంగా రెండేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష వుంటుంది. అలాగే లక్ష నుంచి పది లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారు. ఇలాంటి అక్రమ పాత్రలతో దేశం లోకి జొరబడిన వారి సంఖ్య దాదాపు 6 కోట్ల వరకు ఉందని ఒక అంచనాగా ఉంది.

By NYALAKONDA ANIL DESAI | September 17, 2025 | 0 Comments

పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణ

ఒక్కరి కోసం అందరు... అందరి కోసం ఒక్కరు...! .. మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హాన్మాండ్లు మనమంతా ఐక్యంగా ఉండి సమస్యలు ఎదురైనప్పుడు ఒక్కరి కోసం అందరు .. అందరి కోసం ఒక్కరుగా కలిసికట్టుగా *ముందుకు సాగాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హాన్మాండ్లు అన్నారు . రాయికల్ పట్టణ పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారణ మహోత్సవం కార్యక్రమం పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ హాజరై 2025 -27 సంవత్సర నూతన అధ్యక్షులుగా భోగ రాజేశం,ఉపాధ్యక్షుడిగా దాసరి గంగాధర్,ప్రధాన కార్యదర్శిగా కడకుంట్ల నరేష్,కోశాధికారిగా ఆడెపు నర్సయ్య లచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత సంవత్సరం చేపట్టిన సేవా కార్యక్రమాలను అభినందించారు.సంఘ సభ్యులను సమన్వయం చేసుకునేందుకు సంఘంలో చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని సభ్యులకు సమాచారం అందిస్తూ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలపాలని సూచించారు.మనందరం ఐక్యంగా ఉంటే భవిష్యత్తులో సంఘ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు పొందేందుకు తోడ్పడుతుందన్నారు.సంఘం ఎన్నికలు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం మాత్రమేనని తదనంతరం అందరం కలిసికట్టుగా ఐక్యంగా ఉండి ఆర్థికంగా,సామాజికంగా,రాజకీయంగా ఎదగాలన్నారు.విద్యార్థులకు విద్య పట్ల ప్రోత్సాహం,విద్య ఉపకరణాల కల్పన,ఆరోగ్యం,నిరుపేదలకు ప్రోత్సాహం లాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.అనంతరం నూతన అధ్యక్షులు భోగ రాజేశం మాట్లాడుతూ సంఘ సభ్యులు సహకారంతో పద్మశాలి సేవా సంఘ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం,హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్,రాష్ట్ర కార్యదర్శి జక్కుల చంద్రశేఖర్,మాజీ కార్యదర్శి మామిడాల లక్ష్మీనారాయణ మాజీ ఉపాధ్యక్షులు శ్రీరాముల సత్యనారాయణ, సిరిపురం రఘు,మాజీ కోశాధికారి నర్సయ్య ఫోపా అధ్యక్షులు ఎలిగేటి రాజ్ కిషోర్,పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సామల్ల సతీష్,ఉపాధ్యక్షులు సింగని సతీష్,ప్రధాన కార్యదర్శి *ఆడెపు రాజీవ్,కోశాధికారి బొమ్మ కంటి నవీన్,సంయుక్త కార్యదర్శి అనుమండ్ల తేజ ,గంట్యాల ప్రవీణ్ పోప సభ్యులు దాసరి రామస్వామి,గాజంగి రాజేశం, సింగని రాందాస్,సామల్ల గంగాధర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 13, 2025 | 0 Comments

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ముందుగా "రక్షాబంధన్ వేడుకలు"

రాయికల్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో గురువారం ముందస్తు రక్ష బంధన్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా చిన్నారులు వివిధ రకాలైన వృత్తుల వేషధారణలో వచ్చి అలరించారు. పాఠశాల ప్రిన్సిపల్ జే వేణుగోపాల్ రావు మాట్లాడుతూ రక్షాబంధన్ అంటే సోదరి సోదరుల అనుబంధమే కాకుండా ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడాలని విద్యార్థులకు సూచించారు. రక్షా బంధన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది సోదర ప్రేమ, రక్షణ మరియు బాధ్యతలను గుర్తుచేసే ఒక ముఖ్యమైన సందర్భం. ఈ పండుగను జరుపుకోవడం ద్వారా, మనం మన కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకోవాలి, అలాగే సమాజంలో సోదర భావాన్ని పెంపొందించుకోవాలి. మనదేశంలో ఇంత ప్రశాంతంగా ప్రతి ఒక్కరు జీవిస్తున్నారంటే దానికి నిరంతరం శ్రమించే కొన్ని వృత్తులు వారి త్యాగాలను విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి దేశ రక్షణకై సమాజ సేవకై పాటుపడాలని వివరిస్తూ రక్షాబంధన్ సందర్భంగా ప్రతి విద్యార్థి తన ఇంటి వద్ద ఒక మొక్కను నాటాలని ప్రిన్సిపల్ వేణుగోపాల్ రావు విద్యార్థులకు సూచించారు తదనంతరం తరగతి విద్యార్థులు అందరూ ఒకరికి ఒకరు రాఖీ కట్టుకొని "నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష "అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గారు జే తిరుపతి రావు గారు, ప్రిన్సిపల్ జె వేణుగోపాల్ రావు ,ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 07, 2025 | 0 Comments

భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం "చేనేత" కళ...!

భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచింది "చేనేత" కళ అని రాయికల్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ రాజేశం అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయికల్ పట్టణంలోని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చెమట చుక్కల్ని చీరలుగా మలచి.. మనిషికి నాగరికతను అద్దింది నేత కార్మికులని పేర్కొన్నారు.దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.ప్రాచీన కాలం నుంచే మన దేశంలో మగ్గాల ద్వారా చేనేత ఉత్పత్తి జరిగిందని మొదట్లో ఈ విధానంతో వస్త్ర ఉత్పత్తికి చాలా సమయం పట్టేదన్నారు. ఇంగ్లాండ్ కు చెందిన జాన్ కే 1733 లో ఫ్లై షటిల్ ను కనిపెట్టాక మగ్గం ద్వారా వస్త్రాల ఉత్పత్తి సామర్థ్యం బాగా పెరిగింది అన్నారు.1801 లో జోసెఫ్ ఎం జాకార్డ్ పెద్ద డిజైన్లు రూపొందించే పరికరాన్ని తయారు చేయగా ప్రస్తుతం చేనేత రంగంలో ఉపయోగిస్తున్నారని ఆ పరికరాన్ని జాకార్డ్ గా పిలువ పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులుగా దాసరి గంగాధర్, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్,కోశాధికారి ఆడెపు నర్సయ్య,పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సామల్ల సతీష్,ఉపాధ్యక్షులు సింగని సతీష్,ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజీవ్,కోశాధికారి బొమ్మ కంటి నవీన్,సంయుక్త కార్యదర్శి గంట్యాల ప్రవీణ్,మాజీ అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం,మ్యాకల కాంతారావు,గాజంగి అశోక్,బొమ్మ కంటి గోపాల్, సభ్యులు మచ్చ నారాయణ,మామిడాల లక్ష్మీనారాయణ,వాసం స్వామి,దాసరి గంగాధర్,దిలీప్,లక్ష్మీనారాయణ,ప్రభాకర్,గంగన్న,మధు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 07, 2025 | 0 Comments

రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు

రాయికల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ వారి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించి సుమారు 50 మంది బాలింతలకు మరియు గర్భిణీ స్త్రీలకు పండ్లు మరియు బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ మాజీ చైర్మన్ లయన్ మోర హనుమాన్లు మాట్లాడుతూ బిడ్డకు సరిపడా పాలు ఉండాలంటే గర్భంతో ఉన్నప్పుడే తల్లి పౌష్టికాహారం తీసుకోవాలని. ప్రోటీన్లు ఉండే పాలు, చేపలు, గుడ్లు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని. దీనివల్ల బిడ్డకు సరిపడా పాలు పుష్కలంగా లభిస్తాయని,తల్లికి కలిగే ప్రయోజనాలు బిడ్డకు ముర్రుపాలు పట్టడం వల్ల గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో రొమ్ము, అండాశయ క్యాన్స ర్లు, మధుమేహం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుం ది. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ఊబకాయం నుంచి తప్పించుకోవచ్చు. గర్భదారణకు పూర్వం ఉండే బరువును మళ్లీ పొందవచ్చు. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే గర్భిణిగా ఉన్నప్పటి నుంచి పోషక విలువల ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో డయాబెటిక్ డిస్టిక్ కోఆర్డినేటర్ బత్తిని భూమయ్య, రాయికల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమాదేవి , వాసం ప్రసాద్, వెంకట్ రెడ్డి, ప్రసాద్ ,సుధవేణి మురళి ,సాంబారు శ్రీనివాస్ ,మరియు డాక్టర్లు స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు,

By Gantyala Praveen | August 05, 2025 | 0 Comments

Hot Categories

2
7
1