నేడు ఛత్రపతి శివాజీ జయంతి * జర్నలిస్టులకు జాతీయ సేవా పురస్కారాల ప్రదానం హైదరాబాద్: భాగ్యనగర్ శివాజీ సేవాసమితి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శివాజీ జయంతి సందర్భంగా గురువారం జర్నలిస్టులకు జాతీయ సేవా పురస్కారాల ప్రదానం చేయనున్నారు.కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సహా పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గత 28 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న వారికి ఏటా పురస్కారాలు ఇస్తున్నట్లు భాగ్యనగర్ శివాజీ సేవాసమితి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నందనం దివాకర్ తెలిపారు. ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 60 మంది పాత్రికేయులను సన్మానిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు సేంద్రియ రైతులు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్వాతంత్య్ర సమరయోధులు, కవులు-రచయితలు, పర్యావరణవేత్తలు, కార్గిల్యోధులు, అయోధ్య కరసేవకులు...ఇలా అనేక రంగాల వారికి జాతీయ సేవా పురస్కారాలు ప్రదానం చేసినట్లు వివరించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మండలం రంగారెడ్డి నగర్. శివాజీ చౌక్ వద్ద గురువారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని నందనం దివాకర్ కోరారు.
రాయికల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో జరిగిన మండల స్థాయి సీఎం కప్పు పోటీలలో గ్రీన్ వుడ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు దీనిలో గర్ల్స్ విభాగంలో మండల స్థాయిలో వాలీ వాలీబాల్ విభాగంలోమొదటి స్థానం లో మరియు ఖో ఖో విభాగంలో రెండో స్థానంలో నిలిచారు.దీనిలో ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ శైలేంద్రనీ రెడ్డి మరియు రాయికల్ సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్ రావు,ఎంపీడీవో బి.చిరంజీవి, మండల విద్యాధికారి రాఘవులు పిడి కృష్ణ ప్రసాద్ మరియు వివిధ పాఠశాలల పీడీలు విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్పీ శైలేంద్రిని రెడ్డి విద్యార్థులను అభినందించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కరస్పాండెంట్ మిట్టపల్లి మహేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
రాయికల్ మండలం చెర్ల కొండాపూర్ అనుబంధ గ్రామం "పల్లె" గ్రామస్థులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని పార్టీ కార్యాలయంలో కలిసి తమ గ్రామాన్ని నూతన గ్రామ పంచాయితీ గా ఏర్పాటు చేయాలనీ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా గ్రామ మాజీ సర్పంచ్ అర్మురి లక్ష్మి నారాయణ,పెద్ద మనిషి దువ్వక నర్సయ్యలు మాట్లాడుతూ చెర్ల కొండాపూర్ గ్రామానికి అనుబంధంగా ఉన్న పల్లెకు గ్రామ పంచాయతీ కి 1 కి.మీ పైగా దూరం ఉన్నదని,దాదాపు 500 మందికి పైగా జనాభా ఉన్న "పల్లె"గ్రామ వాసులు పెన్షన్ దారులు,రేషన్ కోసం, ఇతరత్ర గ్రామ సమస్యల పరిష్కారం కోసం చెర్ల కొండాపూర్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామని,పల్లె ను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ను కోరినట్లు వారు తెలిపారు.అనంతరం గ్రామ నాయకులు,మహిళలు ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో గ్రామ సంఘం ఉప అధ్యక్షులు నారాయణ,క్యాషియర్ పల్లికొండ శివ,మాజీ అధ్యక్షులు నర్సయ్య, రాజేష్,రమేష్,రాజు,రాజయ్య, లింగమూర్తి,చిన్న రాజాం,మహిళా సంగమ్ అధ్యక్షులు నాగలక్ష్మి,రాజేశ్వరి, లావణ్య,మమత,సువర్ణ,రూప, సుజాత,లలిత, పల్లె ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ జేఏసీ కార్యాలయంలో మంగళవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షులుగా చింతకుంట సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా సింగిడి శంకర్, కోశాధికారిగా కడకుంట్ల జగదీశ్వర్, ఉపాధ్యక్షులుగా యాచమనేని కిరణ్ బాబు, సింగని శ్యాంసుందర్, సంయుక్త కార్యదర్శిగా తిరుమల శంకర్, కార్యవర్గ సభ్యులుగా గంగాధరి సురేష్, కళ్ళెం శ్రీనివాస్, ఎద్దండి జితేందర్ రెడ్డి, తీగుళ్ళ గోపాల్ రెడ్డి, కనికరపు లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు సయ్యద్ రసూల్, ఎన్నికల పర్యవేక్షకులుగా గుర్రాల వేణు, పటేల్ నరేందర్, నాగమల్ల శ్రీకర్ లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పాల్గొన్నారు.
రాయికల్ పట్టణం లోని ఆర్. ఆర్ గార్డెన్స్ లో డ్రగ్స్ ,యాంటీ డ్రగ్స్ మరియు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల పై ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ,అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన రాయికల్ పోలీసులు మరియు రాయికల్ ప్రెస్ క్లబ్ జేఏసి సభ్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై, భవిష్యత్ను పాడుచేసుకోవద్దని, మాదక ద్రవ్యాల రహిత సమాజంగా నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష సాధన దిశగా అడుగులు వేయాలని సూచించారు. మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటివి తీసుకుంటే ఆరోగ్యంపై హానికర ప్రభావాలతోపాటు ఆర్థిక నష్టాలు, సమాజంలో గుర్తింపు గౌరవం ఉండదని సూచించారు. నిషేధిత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. క్షణ కాలం సంతోషం కోసం విద్యార్థులు నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. డ్రగ్స్ నేరుగా మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయన్నారు. వాటిని వాడే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా దుష్ప్రభావాలు చూపుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల అడిషనల్ ఎస్పీ కుమారి శేషాద్రిని రెడ్డి, డీఎస్పీ రఘు చందర్,సీఐ ,రాయికల్ యస్. ఐ సుధీర్ రావు, రాయికల్ ఎమ్మార్వో నాగార్జున, ఎంఈఓ రాఘవులు, ఎంపీ ఓ ,రాయికల్ మండలం ప్రెస్ జే ఏ సి అధ్యక్షులు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, కోశాధికారి మచ్చశేఖర్, ఉపాధ్యక్షులు నాగిరెడ్డి రఘుపతి రెడ్డి, చింతకుంట సాయికుమార్, సంయుక్త కార్యదర్శి గంగాధర్ సురేష్,కమిటీ సభ్యులు నాగమల్ల శ్రీకర్ గుర్రాల వేణు, సింగిడి శంకరయ్య, కల్చరల్ కార్యదర్శి ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి కార్యవర్గ సభ్యులు సింగని శ్యాంసుందర్, వాసం లింబద్రి, అన్నపురం లింబాద్రిగౌడ్, ఇమ్మడి విజయ్, కళ్లెం శ్రీనివాస్, తీగుళ్ల గోపి, సయ్యద్ రసూల్,పాత్రికేయులు విద్యార్థిని,విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో వీర కుంఫు అకాడమీ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కూంఫు కరాటే ఛాంపియన్ షీప్- 2025 లో కూంఫు డో,మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ కనుక ప్రభాకర్, కనుక ప్రవీణ్ కుమార్ మరియు హరికృష్ణ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన రాయికల్ కు చెందిన 18 మంది కూంఫు డో విద్యార్థులకు 16 బంగారు పతకాలు, రెండు వెండి పథకాలు సాధించారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ కనుక ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు కూంఫు డో , మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకోవడం వల్ల శారీరకంగా,మానసికంగా ధృడత్వం పెరిగి స్వీయ రక్షణలో ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు.
విజ్డం హై స్కూల్ రాయికల్ కి చెందిన విద్యార్థులు ఎడ్యుకేషన్ టూర్ లో భాగంగా శుక్రవారం రోజున జిల్లా కోర్టును సందర్శించారు. గంటన్నరసేపు కోర్టులో జరిగే కేసుల విచారణ, న్యాయవాదుల వాదోపవాదాలు, జడ్జి తీర్పునిచ్చే విధానాన్ని విద్యార్థులు గమనించారు. కోర్టు ఆవరణలోని రికార్డ్ రూమ్, సెక్షన్ రూమ్ లలో కేసులకు సంబంధించిన ఫైల్స్ ను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం, జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయాలను సందర్శించి వివిధ రకాల సేవలు సమస్యల పరిష్కారాల గురించి సంబంధిత అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం పుస్తకాలలో చదువు మాత్రమే కాకుండా,ఇలాంటి ఎడ్యుకేషన్ టూర్ ల ద్వారా విజ్ఞానం తో పాటు మంచి, చెడు ల మధ్య తేడాలు,నేరాల మీద వాటికీ విధించే శిక్ష ల మీద అవగాహన, సమాజం లో విద్యార్థులకు ప్రశ్నించే తత్వం, ఉన్నత అధికారులతో ప్రవర్తించే తీరు, వారితో పని తీసుకోవడంలో అవగాహన తో పాటు జీవితంలో ఉన్నత లక్ష్యాలు నిర్ణయించుకుని, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమం లో , ఉపాధ్యాయులు,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రాయికల్ పట్టణంలోని వివేకవర్ధిని ఉన్నత పాఠశాలలో ఎన్సిసి అవతరణ దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కైరం సత్యం మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు సైనిక శిక్షణ ఇచ్చి అత్యవసర పరిస్థితుల్లో సేవల నిమిత్తం సిద్ధంగా ఉంచడం ఈ సమస్త ప్రధాన లక్ష్యం అని స్కూలు రోజులనుంచి తలపై ఎర్రటి కుచ్చులు గల టోపి తో ఖాకీ దుస్తులు ధరించి శిక్షణ తీసుకునే విద్యార్ధులనే ఎన్.సి.సి. స్టూడెంట్స్ అంటాము నేటి చిన్నారులే రేపటి పౌరులు క్రమశిక్షణాయుత , దేశభక్తిగ పౌరులను తయారుచేయడమే ఎన్.సి.సి. ముఖ్య ఉద్దేశము . ఎన్.సి.సి. లో చేరే పిల్లలు దృఢ చిత్తము తో శిక్షణ సాగిస్తుంటారు . ఎన్ .సి .సి సర్టిఫికెట్ ద్వారా విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత చదువులకు మరియు ఉద్యోగ అవకాశాలకు తోడ్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివేకవర్ధిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోని అంజుమన్ ఇస్లామియా ఇంగ్లీష్ స్కూల్, ఆదివారం కాకుండా శుక్రవారం జుమ్మా డేను వారపు సెలవు దినంగా ప్రకటించడం ద్వారా వివాదానికి దారితీసింది, ఆదివారం అధికారిక వారపు సెలవు దినంగా ప్రభుత్వ నిబంధనలను విస్మరించింది. ఇక నుండి శుక్రవారం సెలవు దినంగా ఉంటుందని మరియు ఆదివారం పాఠశాల తెరిచి ఉంటుందని పాఠశాల యాజమాన్యం వాట్సాప్ గ్రూప్ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ నిర్ణయం తల్లిదండ్రులలో విస్తృత అసంతృప్తికి దారితీసింది మరియు త్వరలోనే పెద్ద సమస్యగా మారింది. బిజెపి మైనారిటీ ఫ్రంట్ ఈ చర్యను వ్యతిరేకించింది మరియు పాఠశాల యాజమాన్యంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా యంత్రాంగం మరియు విద్యా అధికారులకు ఫిర్యాదు చేసింది. మీడియా నివేదికల ప్రకారం, ఫిర్యాదుల తర్వాత, విద్యా శాఖ బృందం పాఠశాలకు చేరుకుని ప్రధాన గేటు తాళాన్ని పగలగొట్టింది. దర్యాప్తు తర్వాత, అంజుమన్ ఇస్లామియా బోర్డు అధికారులు తమ తప్పును అంగీకరించి, శుక్రవారం సెలవు దినంగా ప్రకటించాలనే ఆదేశాన్ని ఉపసంహరించుకున్నారు. జుమ్మా ప్రార్థనల కారణంగా చాలా మంది విద్యార్థులు శుక్రవారం పాఠశాలకు వెళ్లకుండా ఉండేవారని, అందుకే పాఠశాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని పాఠశాల మేనేజర్ అన్ను అన్వర్ వివరించారు. అయితే, ప్రజల నుండి అభ్యంతరాలు ఎదుర్కొన్న తర్వాత, ఆ ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకున్నారు మరియు ఆదివారం పాఠశాల మునుపటిలాగే వారపు సెలవు దినంగా పాటిస్తుంది. ఈ వివాదం నగరంలో తీవ్ర చర్చకు దారితీసింది, కొందరు ఈ నిర్ణయాన్ని శుక్రవారాల్లో విద్యార్థుల హాజరు సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారంగా భావించగా, మరికొందరు దీనిని మతపరమైన కారణాల ఆధారంగా జోక్యంగా విమర్శించారు. విద్యార్థుల విద్య ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల యాజమాన్యం వాదిస్తోంది, అయితే సమయాన్ని తిరిగి మార్చాలనే అధికారులు మరియు తల్లిదండ్రుల ఆదేశాన్ని అంగీకరించింది. అంజుమన్ ఇస్లామియా వక్ఫ్ బోర్డు నగరంలో మరో నాలుగు పాఠశాలలు మరియు ఒక కళాశాలను నిర్వహిస్తోంది, ఇక్కడ ముస్లింలు అధికంగా ఉండటం వల్ల సంవత్సరాలుగా శుక్రవారం సెలవులు పాటిస్తున్నారు. ప్రశ్నార్థక జబల్పూర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వారి ఆధ్వర్యంలోని ఆరు సంస్థలలో ఒకటి మరియు దాదాపు 700 మంది విద్యార్థులు ఉన్నారు.
దున్నే వాడిదే భూమి, కంపనీలో పని చేసేవాడిదే ఉత్పత్తి లాంటి సొగసైన అందమైన నినాదం తో సామాన్యుల బుర్రల్లో ఆశలు నింపి తమ గల్లాలు నింపుకున్న సిద్ధాంతం ఏదయినా ఉంది అంటే అది కమ్యునిజం సిద్దాంతం ఒక్కటే. కాని చరిత్రలోకి తొంగి చూస్తే నక్షలిజమ్ పేర మన దేశం లోనే కాకుండా ఆ సిద్ధాంతం మొదలైన రష్యా చైనా లో కూడా ఆ సిద్ధాంతం ఒక విఫల సిద్దాంతంగా మిగిలి పొయింది. కాని ఇప్పటికీ మన దేశం లో కుహనా కమ్యునిజం వాదులు కమ్యునిజం సోషలిజం అంటూ నీతి వాక్యాలు చెబుతూ అమాయకుల బుర్రలు నింపేస్తునే ఉంటారు. మనలో కూడా చాలామంది వారి మాటలు నమ్మి కమ్యునిజం సిద్దాంతం మంచిదే కానీ ఆచరణ సాద్యం కానిది అని అంటూ ఒకరకమైన బ్రమలో మాట్లాడుతూ వుంటారు. మరి మంచి సిద్దాంత మైతే అది పుట్టిన చోట కూడా ఎందుకు విఫల మైనది. అలాగే కమ్యూనిజాన్ని అనుసరించిన దేశాలు కమ్యునిజం స్థానం లో కర్పోరేటికరణ ఎందుకు చేసారు. మావోయిజం పేరిట రైతుకు ఇచ్చిన భూమిని మల్లి ఎందుకు లాక్కున్నారు మల్లి ఎందుకు రైతులకు హక్కులు కల్పించారు వ్యవసయవిధానం లో కర్పోరేటికరణ ఎందుకు తీసుకు వచ్చారు అంటే సమాధానాలు చెప్పరు. అసలు ఈ సమాచారం ఎందుకు సమాజానికి తెలియనివ్వరు అనేది కోట్ల రూపాయల ప్రశ్న . దీనికి తోడు కొందరు మేధావుల ముసుగులో యువత నక్సలిజం వైపు మరలె విదంగా పాటలు నృత్యాలు కవితలు కథలు కాకరకాయలు రాసి యువత నక్షలిజమ్ వైపు వెళ్ళేల ప్రేరేపిస్తుంటారు . అలంటి వారిలో ప్రధాన మైన వ్యక్తి గద్దర్ వరవరరావు విమలక్కలు . గద్దర్ గురించి తెలియని వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు వుండరు ఈ విషయంలో అంతటి ప్రాముక్యత సాధించు కున్నారు. గ్రామగ్రామాన తిరిగి తన ఆటపాటలతో యువతను ఉద్రేక పరచారు . దీంతో అయన పాటల మూలంగా వేలాది మంది యువత నక్షలిజమ్ ప్రబావానికి గురై అడవుల పట్టారనే విమర్శలు అనేకం ఉన్నాయి. అలగే శ్రీశ్రీ లాంటి వారు పేదలు, ఆకలి కలయికలతో ఎన్నో కవితలు రాయడం మూలంగా యువత ఒకవిదమైన ప్రబుత్వ | రాజ్యవ్యతిరేక బావనకి లోనయ్యారు . అలగే అరుణోదయ కలమండలి పేరుతో విమలక్క లాంటి వారు కూడా ఇక్కడ అర్బన్ నక్సల్ కింద మనం మాట్లాడుకోవచ్చు. నాడు అంటే నక్షలిజమ్ భారత దేశం లో ప్రవేశించే క్రమంలో అంటే 1967 లో మొదటగా నక్షల్బరిలొ ప్రారంబమై మన దేశం లో దాదాపు 20 రాష్ట్రాల్లో 182 జిల్లాల్లో దాని ప్రబావం చూపినప్పటికీ ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ , జార్ఖండ్ ,ఒడిష ,వెస్ట్ బెంగాల్ ,బిహార్ ,తెలంగాణా , ఆంధ్రప్రదేశ్ ,మహారాష్ట్ర లలో 18 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది . అదికూడా నేదో రేపో అంతం కానుంది ఈమేరకు ఈ దేశపు హోంమంత్రి అమిత్ షా 2026 డిసెంబర్ నాటికి నక్షలిజమ్ లేకుండా చేస్తామని ప్రకటించారు. అయితే నేడు ఈ నక్షలిజమ్ అర్బన్ నక్సలిజం గ మారడమే కాకుండా నాటి దున్నే వాడిదే బూమి నినాదం నుండి పని చేసే వాడిదే కంపని లాభం అనేంతగా ఎదిగింది . కాని దీనికి ఏ సమాజాన్ని రెచ్చగొట్టి విప్లవం తీసుకు రావాలని చూసారో ఆ సమాజం నుండే మద్దతు కరువు అవడం తో ఇప్పుడు కొత్తగా కులాల పేరుతో మతాల పేరుతో కుల అంతరాల పేరుతో వీరి బావజాలం ప్రవహిస్తోంది. అది అలా ఉన్నప్పటికీ అసలు ఈ మావోయిజం లెనినిజం నక్సలిజం పుట్టిన రష్యా చైనల్లోనే కనుమరుగయ్యింది. అసలు ఈ నక్సలిజం కారణంగా రష్యా చైనాల్లో 1917 నుండి 1930 వరకు దాదాపు 10 కోట్ల ప్రాణాలు గాల్లో కలిసి పొయ్యాయి. మొదట సోషలిజం కమ్యునిజం పేరుతో కారల్ మార్క్స్ విదానాలంటూ 1920 , 1930 ప్రాంతాల్లో భూమి కలెక్ట వైజేషణ్ పేరుతో రైతుల దగ్గరి నుండి భూములను లాక్కుని ప్రభుత్వం దగ్గరే పెట్టుకొని వ్యవసాయం చేయించారు. దీంతో ఉక్రెయిన్ లో తీవ్ర కరువు సంభవించి ఆకలితో కూడా లక్షలాది మంది చనిపోయ్యారు . దీనికి కారణం భూమి ప్రభుత్వం దగ్గర వుండడం తో ఎవరు సరయిన పద్దతిలో పని చెయ్యక పోవడమే. కాని చేసినట్లుగా దొంగ లెక్కలు చూపించి ప్రజా ధనాన్ని మాత్రం కాజేశారు . కానీ మార్కెట్లో నిత్యావసర సరుకులు లేకపోవడం తో ఆకలితో లక్షలాది మంది చని పొయ్యారు. ఇక చైనాలో కూడా లెనిన్ మావోల ప్రబావం తో సోషలిజం పేర 1953-1958 మావో జెడాంగ్ సమానత్వం పేరిట ప్రజల భూములు లాక్కోబడ్డాయి. ప్రజలు తమ భూములు ఇవ్వడానికి నిరాకరించడం తో రక్తపుటేరులు పారించి బలవంతంగా భూములు లాక్కున్నారు . ఇక్కడ కూడా సేం రష్యాలో జరిగినట్లుగానే ఆహారకొరత ఏర్పడింది. మొదట్లో కొంత మెరుగ్గా అనిపించినా 1978 నాటికి పరిస్థితి దిగజారిపోయింది. వ్యవసాయ ఉద్యోగులు అందరు కూడా దొంగ లెక్కలు చూపించి ప్రజా ధనాన్ని కాజేశారు. చేసేది లేక చైనా తిరిగి భూములను లీజుకు ఇచ్చే పద్ధతి తీసుకు వచ్చి ఈ విషయం లో ప్రవేటు బాగస్వామ్యాన్ని కలిపింది. కాని ప్రస్తుతం అటు రష్యాలో కాని ఇటు చైనా లో కాని వ్యవసాయ భూములన్నీ కూడా కార్పొరేట చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు చైనా రష్యాలలో సామాన్య రైతులు వ్యవసాయం చేయలేక కార్పోరేట్ సంస్థలకు తమ భూములను అమ్మేసుకుంటున్నారు దీంతో ఇప్పుడు vరష్యాలో వ్యవసాయ భూములలో గణనీయమైన భాగం పెద్ద వ్యవసాయ సంస్థలు మరియు కార్పొరేట్ హోల్డింగ్స్ వద్ద ఉంది. 2023 నాటికి, 73 ప్రధాన సంస్థలు 17.4 మిలియన్ హెక్టార్ల భూమిని నియంత్రిస్తున్నాయి, ఇందులో టాప్-5 సంస్థలు 4.4 మిలియన్ హెక్టార్లను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, Prodimex, Rusagro, Miratorg వంటి సంస్థలు పెద్ద ఎత్తున భూములను కలిగి ఉన్నాయి. చైనాలో కూడా 1978 డెంగ్ సంస్కరణల తర్వాత, చిన్న రైతు ఫామ్లు (0.5 హెక్టార్) పెద్ద సంస్థలకు లీజ్ చేస్తున్నాయి. 2025 నాటికి, 30% వ్యవసాయ భూమి పెద్ద ఫామ్లలో చేరిపోయింది . ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నక్షలిజమ్ మన దేశం లోకి 1967 ప్రాంతం లో బెంగాల్ లోని నక్సల్ బరి లో మొదటగా కనపడి దేశం లోని 20 రాష్ట్రాలలోని 182 జిల్లాలకు పాకింది. మన తెలుగు ప్రాంతం లో ముఖ్యమైన వారిలో కొండపల్లి సీతారామయ్య ,నంబాల కేశవరావు .వెంపటాపు సత్యనారాయణ , ఆదిబట్ల కైలాసం , నల్ల యాది రెడ్డి , సుబ్బారావు పాణిగ్రాహి ,సంతోష్ రెడ్డి , శీలం నరేష్ , కట్టా రామచంద్ర రెడ్డి , సుజాత లాంటి వరెందరో కనపడుతారు. ప్రస్తుతం వీరి లో చాల వరకు పొలిసు ఎన్ కౌంటర్ లలో చని పొయ్యారు . నక్షలిజమ్ ఎక్కడ అయితే పురుడు పోసుకున్తుందో అక్కడ అభివృద్ధి అన్న మాటే ఉండదు. నక్షలిజమ్ సిద్ధాంతం మావో లెనినిజం సిద్ధాంతం ల పేరుతో దాదాపు 30 సంవత్సరాల పాటు బెంగాల్ ను పాలించిన జ్యోతి బసునే మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బెంగాల్లో ఎలాంటి దరిద్రం వుందో మనం కళ్ళార చూస్తున్నాము . నక్సలిజం ఉనికి ఎక్కడ అయితే కనపడుతుందో అక్కడ ఒక రోడ్డు వేయనివ్వరు ఒక విద్యుత్ ఫెసిలిటి రానివ్వరు అంత చీకటి మయం. ఇలా అభివృద్ధి లేని ప్రజల జీవితాలు ఎలా బాగుపడతాయో చెప్పమంటే వీళ్ళ దగ్గర సమాదానం ఉండదు. తుపాకి అండన ప్రజలను కాపు కాస్తూ పైగా రాజ్యం హింసిస్తోంది అంటారు. అయిన దానికి కాని దానికి సాటి మనుషుల్ని చంపుకుంటూ వెళ్ళే వీళ్ళకు రాజ్యం హింసిస్తోంది అనే అర్హత ఎవరిచ్చారు . ఒకప్పుడు కమ్యునిజం ఏలిన ప్రపంచం లోని ఎన్నో దేశాలు సోవియట్ యూనియన్, చైనా , క్యుభా , వియత్నాం , ఉత్తర కొరియా , తూర్పు ఐరోపా దేశాలు , లాటిన్ అమరిక దేశాలు ఇప్పుడు ప్రజాస్వామ్యం వైపు నడుస్తున్నాయి . ఇదే మావోయిజం పుట్టిన రష్యా చైనాలో ఇప్పుడు నక్షలిజమ్ అంటే తూటాలతో జల్లెడ పడుతారు. కాని మన దేశం లో మాత్రం ఇంకా మేము తుపాకి తో రాజ్యాధికారం సాదిద్దామంటూ యువతను రెచ్చ గొడుతున్నారు . మందు పాతరలు పేల్చి సాటి మనుషులను రాక్షసుల మదిరి పొట్టన పెట్టుకుంటున్నారు. మనం ఇది వరకు కూడా వీడియోల్లో చర్చించుకున్నాము మన దేశం లో కేవలం నక్సలిజం కారణంగా దాదాపు 50 వేల మంది భారతీయులు చనిపోయ్యారు . ఇందులో చని పోయిన వారిలో 99.99 శాతం సామాన్య పేదలే ఉన్నారు. వీరంతా ఏమి పాపం చేసారు ఈ కమ్యునిజం నక్సలిజం సిద్దాంతాల కొరకు సామాన్యులు తమ ప్రాణాలు ఇస్తుంటే ఇదే సిద్దాంతాన్ని వాడుకున్నన్ని రోజులు వాడుకొని చివరకు జన జీవన స్రవంతి పేరుతో కోట్లాది రూపాయల ప్రజదనం పోగేసుకొని సామాన్యుడిల సన్నాయి నొక్కులు నొక్కడం దేనిని సూచిస్తుంది. ఇది యువత అర్ధం చేసుకుంటే నక్సలిజం లేదా మావోయిజం అనే మాట నోట్లోంచి వచ్చినా కూడా వాడిని అక్కడికక్కడే జనం ఉప్పు పాతర వేస్తారన్నది నగ్నసత్యం. న్యాలకొండ అనిల్ రావు దేశాయి సామాజిక విశ్లేషకులు 9912009171