రాయికల్ పట్టణం లోని ఆర్. ఆర్ గార్డెన్స్ లో డ్రగ్స్ ,యాంటీ డ్రగ్స్ మరియు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల పై ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ,అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన రాయికల్ పోలీసులు మరియు రాయికల్ ప్రెస్ క్లబ్ జేఏసి సభ్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై, భవిష్యత్ను పాడుచేసుకోవద్దని, మాదక ద్రవ్యాల రహిత సమాజంగా నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష సాధన దిశగా అడుగులు వేయాలని సూచించారు. మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటివి తీసుకుంటే ఆరోగ్యంపై హానికర ప్రభావాలతోపాటు ఆర్థిక నష్టాలు, సమాజంలో గుర్తింపు గౌరవం ఉండదని సూచించారు. నిషేధిత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. క్షణ కాలం సంతోషం కోసం విద్యార్థులు నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. డ్రగ్స్ నేరుగా మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయన్నారు. వాటిని వాడే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా దుష్ప్రభావాలు చూపుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల అడిషనల్ ఎస్పీ కుమారి శేషాద్రిని రెడ్డి, డీఎస్పీ రఘు చందర్,సీఐ ,రాయికల్ యస్. ఐ సుధీర్ రావు, రాయికల్ ఎమ్మార్వో నాగార్జున, ఎంఈఓ రాఘవులు, ఎంపీ ఓ ,రాయికల్ మండలం ప్రెస్ జే ఏ సి అధ్యక్షులు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, కోశాధికారి మచ్చశేఖర్, ఉపాధ్యక్షులు నాగిరెడ్డి రఘుపతి రెడ్డి, చింతకుంట సాయికుమార్, సంయుక్త కార్యదర్శి గంగాధర్ సురేష్,కమిటీ సభ్యులు నాగమల్ల శ్రీకర్ గుర్రాల వేణు, సింగిడి శంకరయ్య, కల్చరల్ కార్యదర్శి ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి కార్యవర్గ సభ్యులు సింగని శ్యాంసుందర్, వాసం లింబద్రి, అన్నపురం లింబాద్రిగౌడ్, ఇమ్మడి విజయ్, కళ్లెం శ్రీనివాస్, తీగుళ్ల గోపి, సయ్యద్ రసూల్,పాత్రికేయులు విద్యార్థిని,విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
.jpeg)

Comments 0