రామగుండం మండల నూతన విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన జింక మల్లేశంను ఈరోజు ఉపాధ్యాయ బృందం ఆత్మీయంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల చదువు ప్రమాణాలు మెరుగుపరచడం, పాఠశాలల సౌకర్యాలు అభివృద్ధి చేయడం, విద్యా రంగంలో మంచి ఫలితాలు సాధించడం కోసం కలిసి కృషి చేస్తామని ఉపాధ్యాయులు అన్నారు. మల్లేశం కూడా అందరి సహకారంతో విద్యార్థుల భవిష్యత్తు కోసం అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.