తెలంగాణ రాష్ట్రం లో మహిళలకు పెద్దపీట మహాలక్ష్మిగా గుర్తింపు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు రవాణా సంస్థ కు చెందిన ప్రభుత్వ బస్సులో ఉచిత ప్రయాణం. అంత వరకు బాగానే ఉంది. నిజానికి ఈ పథక ఉద్దేశ్యం కూడా అద్భుతంగా ఉంది. తెలంగాణ లో రాష్ట్రం లో బస్సు ప్రయాణం ఖరీదు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల లో బాగంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా చేర్చి అధికారం లోకి కూడా రావడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే క్షేత్ర స్థాయిలో అమలు జరిపేది బస్సు కండక్టర్లు కాగా ఇది వారికి తల నొప్పి గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్లెల్లో ఎలాంటి సమస్యా లేనప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో మాత్రం కొత్త తలనొప్పులు తెస్తోంది. మహిళ ఉచిత ప్రయాణం చేయాలంటే తన వెంట కేవలం ఆదార్ కార్డు ఉంటే చాలు. అయితే ఇదే సావకాశంగా కొందరు మహిళలు ఆదార్ కార్డు లు చూపిస్తున్నప్పటికి అవన్ని కూడా ఫేక్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా కండక్టర్లు చెప్పిన మాటలు వింటుంటే బిత్తర పోవడం తప్ప చేసేదేం లేదు అనే విషయం ఇక్కడ తేటతెల్లం అవుతుంది. రాష్ట్ర అధికారిక పట్టణం హైదరాబాద్ ( భాగ్యనగరం) లోనే ఈతరహ మోసాలు అదికంగా జరుగుతున్నాయని కండక్టర్లు చెబుతున్నారు. పట్టణంలో ని పాతబస్తీ, కార్వాన్, గోషామహల్,మహదీపట్నం,ఎల్ బి నగర్ ప్రాంతంలో అదికంగా ఇలా ఒకే ఆదార్ నెంబర్ తో పలువురు మహిళలు ప్రయాణం చేస్తున్నారని అదేమని అడిగితే కొట్టేంత పని చేస్తున్నారని తెలిపారు. పట్టణంలోని ఎల్ బి నగర్ ప్రాంతంలో ఇదే ఫేక్ ఆదార్ కార్డు ప్రయాణం చెల్లదనే విషయమై వారితో అనగా మూకుమ్మడిగా దాడి చేసారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించగా ఇలాంటి సంఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు. అయినప్పటికీ సామాన్యులకు ఆర్దికంగా ఉపయేగపడాలనే ప్రభుత్వ ఆలోచనలు ఇలాంటి వారి మూలంగా మరిన్ని సమస్యలను తెస్తోంది. అయితే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు దబాయింపు దోరణిలో ప్రయాణం చేస్తున్నారని కండక్టర్లు చెప్పిన మాటలు బట్టి అర్థమవుతోంది. మహిళ ప్రయాణం తెలంగాణ లో పూర్తి ఉచిత మే కాబట్టి ఫేక్ ఆదార్ కార్డు తీసుకు రావాల్సిన అవసరం లేదు. అయితే అటువంటి అవసరం ఎవరికి ఉంటుంది. వారు ఇతర రాష్ట్రాల మహిళ లా లేక రోహింగ్యా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారా అనేది పోలీస్ వర్గాలు విచారించిన అంశంగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ వర్గాలు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అంగన్వాడీ సెంటర్ లో అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాన్ని రాయికల్ మండలము భూపతిపూర్ అంగన్వాడి సెంటర్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపిడిఓ చిరంజీవి మాట్లాడుతూ పిల్లల సంఖ్య ను అంగన్వాడీ లో పెంచే విధంగా కృషిచేయాలని సూచించారు.పిల్లలకి పోషకాలతో కూడిన సమతుల్య ఆహరం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ ,సెక్రటరీ హరికృష్ణ, సూపర్వైజర్ రాధ,అంగన్వాడీ టీచర్స్,కవిత,సుమలత ,సుగుణ ,ఆశా వర్కర్లు, వివోలు పాల్గొన్నారు
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్: హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు తమ తనిఖీలలో భాగంగా, ఒక వ్యక్తి తన వాహనాన్ని సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) లో రిజిస్ట్రేషన్ చేయించకుండా, ఇతరుల వాహన నంబర్తో కూడిన నకిలీ నంబర్ ప్లేట్ను వాడుతున్నట్లు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగా, హైదరాబాద్ సిటీలోని చార్మినార్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితుడైన మీర్జా హాషిమ్ రజా (తండ్రి: మీర్జా జాఫర్ రజా, నివాసం: జాఫర్ రోడ్, యాకుత్పురా, హైదరాబాద్) ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తనిఖీ మరియు విచారణలో, మీర్జా హాషిమ్ రజా ట్రాఫిక్ చలానాల నుండి తప్పించుకోవడానికి మరియు ప్రభుత్వ/అమలు అధికారులను తప్పుదోవ పట్టించే/మోసం చేసే ఉద్దేశ్యంతో.. ఆర్టీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించని తన హోండా యాక్టివా (Honda-Activa) వాహనానికి TS11EK3139 అనే నకిలీ నంబర్ ప్లేట్ను ఉపయోగించినట్లు తేలింది. ఈ నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ను ఉపయోగించి నిందితుడు మీర్జా హాషిమ్ రజా పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. దీనివల్ల, ఆ నంబర్ గల అసలైన వాహన (హోండా షైన్ - Honda-Shine) యజమాని అయిన దిల్సుఖ్నగర్, గడ్డిఅన్నారం నివాసి శ్రీ ప్రదీప్ సురేష్ కుల్కర్ణి పేరిట తప్పుడు ట్రాఫిక్ చలానాలు జనరేట్ అయ్యాయి. తదుపరి దర్యాప్తులో నిందితుడి అసలైన వాహనం నంబర్ TS11QTR4778 గా గుర్తించబడింది. దీనికి సంబంధించి, చార్మినార్ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ (BNS) సెక్షన్ 318(4) మరియు మోటార్ వాహనాల (M.V) చట్టం సెక్షన్ 192 కింద ఎఫ్ఐఆర్ నెం. 125/2026 తో క్రిమినల్ కేసు నమోదైంది. నిందితుడు మీర్జా హాషిమ్ రజాకు సిఆర్పిసి (Cr.P.C) సెక్షన్ 41 కి సమానమైన బిఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్ 35(3) కింద నోటీసు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరియు చార్మినార్ పోలీసుల సమన్వయ ప్రయత్నాల ద్వారా ఈ నేరాన్ని ఛేదించడం జరిగింది. ప్రజలకు హెచ్చరిక: నకిలీ, ఒకే రకమైన లేదా మార్పులు చేసిన నంబర్ ప్లేట్లను ఉపయోగించడం అనేది భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు మోటార్ వాహనాల చట్టం ప్రకారం తీవ్రమైన మరియు శిక్షార్హమైన నేరమని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ఉల్లంఘనలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. నకిలీ లేదా మార్పులు చేసిన నంబర్ ప్లేట్లను ఉపయోగించే వాహనాలను గుర్తించడానికి మరియు వాహనాల కదలికలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం సిసిటివి (CCTV) నిఘా మరియు ఏఎన్పిఆర్ (ANPR) కెమెరాలతో కూడిన అధునాతన సాంకేతిక వ్యవస్థలను కలిగి ఉంది. వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల దుర్వినియోగానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా.. ప్రజలు https://echallan.tspolice.gov.in వెబ్సైట్ ద్వారా గానీ, echallanhelpdesk.hyd@gmail.com ఈమెయిల్ ఐడీ ద్వారా గానీ, లేదా ఇ-చలాన్ ట్రాఫిక్ వాట్సాప్ మొబైల్ నంబర్: 8712661690 ద్వారా గానీ పోలీసులకు నివేదించాల్సిందిగా కోరడమైనది. జారీ చేసిన వారు: డి. జోయల్ డేవిస్, ఐపిఎస్,జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), హైదరాబాద్ సిటీ.
Your experience on this site will be improved by allowing cookies.