ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఎందా గ్రామంలో గల ఆశ్రమ ఉన్నత పాఠశాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే వేడ్మ బొజ్జుతో కలిసి సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా వంటగదితో పాటు తదితర వాటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని చదువులలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దిశ నిర్దేశం చేశారు.