రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ZPHS ఆలూరు గ్రామ పాఠశాల యందు 10వతరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులు తెలంగాణ సైకాలజీ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కూర్మాచలం రఘునందన్ గారు పదవ తరగతి ఏ విధంగా సంసిద్ధత కావాలి. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఎలా రూపొందించుకోవాలి అని అదేవిధంగా పరీక్షలు ఏ విధంగా రాయాలి. పరీక్షలు రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా పదవ తరగతి పరీక్ష రాసిన తర్వాత పై తరగతులకు వెళ్లేటప్పుడు అందరూ ఒకరిని చూసి ఒకరు అనుకరించకుండా తమ తమ నైపుణ్యం ఆధారంగా పై తరగతికి సంబంధించిన కోర్సులలో చేరాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థుల యొక్క బలాలు.... బలహీనతలు... అవకాశాలు... అవరోధాలు.... ఏలా ఎదుర్కోవాలి. నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, సంఘంలో సమాజంలో విద్యార్థుల పాత్ర అన్న మొదలైన విషయాలు చాలా చక్కగా వివరించడం జరిగింది ఇట్టి ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉదయభాస్కర్ గారు, ఉపాధ్యాయులు రాజగోపాల్ రమేష్ ,శ్రీనివాస్ , వినోద్, సంపత్ , స్వర్ణలత మొదలైన వారు పాల్గొన్నారు. రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ZPHS ఆలూరు గ్రామ పాఠశాల యందు 10వతరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులు తెలంగాణ సైకాలజీ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కూర్మాచలం రఘునందన్ గారు పదవ తరగతి ఏ విధంగా సంసిద్ధత కావాలి. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఎలా రూపొందించుకోవాలి అని అదేవిధంగా పరీక్షలు ఏ విధంగా రాయాలి. పరీక్షలు రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా పదవ తరగతి పరీక్ష రాసిన తర్వాత పై తరగతులకు వెళ్లేటప్పుడు అందరూ ఒకరిని చూసి ఒకరు అనుకరించకుండా తమ తమ నైపుణ్యం ఆధారంగా పై తరగతికి సంబంధించిన కోర్సులలో చేరాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థుల యొక్క బలాలు.... బలహీనతలు... అవకాశాలు... అవరోధాలు.... ఏలా ఎదుర్కోవాలి. నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, సంఘంలో సమాజంలో విద్యార్థుల పాత్ర అన్న మొదలైన విషయాలు చాలా చక్కగా వివరించడం జరిగింది ఇట్టి ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉదయభాస్కర్ గారు, ఉపాధ్యాయులు రాజగోపాల్ రమేష్ ,శ్రీనివాస్ , వినోద్, సంపత్ , స్వర్ణలత మొదలైన వారు పాల్గొన్నారు.
ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఎందా గ్రామంలో గల ఆశ్రమ ఉన్నత పాఠశాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే వేడ్మ బొజ్జుతో కలిసి సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా వంటగదితో పాటు తదితర వాటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని చదువులలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దిశ నిర్దేశం చేశారు.
రాయికల్ పట్టణంలోని విస్డం హైస్కూల్లో విద్యార్థుల మానసిక , వ్యక్తిత్వ వికాస పరిణితి కోసం విశ్వతేజాస్ ట్రైనింగ్ మరియు కౌన్సిలింగ్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించడం జరిగింది. సమాజంలో మారుతున్న పోకడలకు, విద్యా వ్యవస్థలో అనునిత్యం జరుగుతున్న మార్పులకి, పిల్లల్లో చోటుచేసుకుంటున్న టెక్నాలజీ వ్యసనం లాంటి వాటినుండి మేలుకొలుపడానికి విస్డం హై స్కూల్ కరస్పాండెంట్ డా. ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి శ్రీకారం చుట్టారు. విశ్వతేజాస్ ఫౌండర్ ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు లైఫ్ కోచ్ తిరునగరి శ్రీహరి "విజన్ టు విక్టరీ" అనే అంశంపై మాట్లాడుతూ విద్యార్థులు పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే సృజనాత్మకత,వారు చేసే పనులలో అనుశాసనం, క్రమశిక్షణ , ఆత్మవిశ్వాసం అత్యవసరమని కథల ద్వారా కళ్ళకు కట్టినట్లు వివరించారు. మరో వక్త, తైక్వాండో శిక్షకులు నరహరి నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు ఏర్పరచుకునే లక్ష్యం స్పష్టంగా ఉండాలని అనుక్షణం లక్ష్యాన్ని స్మరిస్తూ సాధన చేయాలని తల్లి తండ్రి గురువులకు గౌరవం ఇవ్వాలని మనకు సహాయం చేసే వారిపట్ల నిత్యం కృతజ్ఞత తో మెదలాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎద్దండి నివేదిత రెడ్డి,విశ్వతేజాస్ డైరెక్టర్ ప్రసన్న, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.