రామగుండం ప్రాజెక్ట్ పరిధిలో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమం మరియు విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం “ముందడుగు” అంగన్‌వాడీ టీచర్స్ & హెల్పర్స్ వెల్ఫేర్ యూనియన్‌ను ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన ముఖ్య బాధ్యుల సమావేశంలో యూనియన్‌ను అధికారికంగా ఆవిర్భావం చేశారు.యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, ముఖ్య సలహాదారుగా మేయర్ మహంకాళి స్వామిని ఎన్నుకున్నారు. కన్వీనర్లుగా రాకం శారద, సింగంశెట్టి రజిత, కొట్టూరి నర్మద తదితరులను ఎంపిక చేశారు. ఐక్యతతో అంగన్‌వాడీ సిబ్బంది హక్కుల సాధన కోసం పనిచేస్తామని నాయకులు తెలిపారు.