పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేపట్టిన ""గో టు విలేజ్ – 40 డేస్"" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ మండల కార్యదర్శి `పాలేపు బాలరాజు' ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ మాట్లాడుతూ, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఇచ్చిన సర్క్యులర్ మేరకు గ్రామాల్లోని ప్రతి మాదిగ విద్యార్థి తప్పనిసరిగా చదువుకోవాలని పిలుపునిచ్చారు. సుమారు 30 సంవత్సరాలపాటు వర్గీకరణ కోసం నిరంతర పోరాటం చేసి దానిని సాధించిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆశయాలను నెరవేర్చాలంటే విద్యనే ప్రధాన ఆయుధంగా తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందాలంటే ప్రతి మాదిగ కుటుంబం తమ పిల్లలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని సూచించారు. అదేవిధంగా జూలై 7న జరగనున్న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని రాయికల్ మండలంలోని ప్రతి మాదిగవాడలో ఘనంగా నిర్వహించి, ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్ మాదిగ, జిల్లా కార్యదర్శి సంగెపు ముత్తు మాదిగ, జిల్లా సంయుక్త కార్యదర్శి బదినేపల్లి సురేష్ మాదిగ, బొల్లె గంగాధర్, బొల్లె చిన్నయ్య, మస్తీన్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు దర్శనం శంకర్, దర్శనం విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Comments 0