సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 2,200 మంది అధికారుల వేతన సవరణ, పర్‌ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ (PRP) తదితర సమస్యలపై రెండు నుంచి మూడు నెలల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. అధికారుల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించి, అధికార సంఘం నాయకులతో చర్చించి వారికి భరోసా కల్పించాలని సూచించారు. అలాగే సింగరేణి పోటీతత్వాన్ని పెంచి సంస్థను మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.