వర్షాభావంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న పెద్దపల్లి జిల్లా రైతులు ఇప్పుడు విద్యుత్ కోతలతో మరింత ఆందోళన చెందుతున్నారు. నాట్ల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవడంతో బోర్లు, బావుల ద్వారా సాగునీరు అందించడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. నిర్ణీత సమయాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా కల్పించి పంటలను కాపాడాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.