రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బండారి మారుతిపై జారీ చేసిన పీడీ (నిరోధాత్మక నిర్బంధ) ఉత్తర్వులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జి.ఓ.ఆర్.టి. నెం.1013, తేదీ 13-07-2026 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని కమిషనర్ తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేసే వారిపై అవసరమైతే పీడీ చట్టాన్ని అమలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులు, ముఠాలు, వ్యాపారులపై చట్టపరమైన చర్యలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.