పద్మావతి కాలనీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న రోడ్డు కబ్జా సమస్యను కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫోన్ చేసి స్థలాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే తక్షణ స్పందనతో కాలనీవాసుల్లో సమస్య పరిష్కారంపై ఆశలు చిగురించాయి. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్‌కు, సమస్యను దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్ సాగి సంతోష్ కుమార్ రావు, అసోసియేషన్ అధ్యక్షుడు డా. నాగండ్ల రవికుమార్, కమిటీ సభ్యులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.