కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో యువత కీలక పాత్ర పోషించాలని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీరం రాజేష్ అన్నారు.మంగళవారం రాయికల్ పట్టణంలో పట్టణ,మండల యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ యువతకి అవకాశాలు కల్పిస్తుందని కష్టపడ్డ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అర్హులైన వారికి చేరేలా అవగాహన కల్పించాలని అన్నారు.రాజకీయాల్లో యువత చురుకైన పాత్ర పోషించాలని ప్రతి యువకుడు ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి రావాలని సూచించారు.యువత తమ ప్రతిభ,సేవా దృక్పథం,నిబద్ధతతో ప్రజలకు చేరువై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావడంతో పాటు సామాజిక సేవలో ముందుండాలని కోరారు.దేశాభివృద్ధి,రాష్ట్ర ప్రగతిలో యువశక్తి కీలకమని పార్టీ బలోపేతానికి యువత ముందుండి పనిచేయాలని పిలుపునిచ్చారు.గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ యువతకు సముచిత ప్రాధాన్యతతో పాటు నాయకత్వ అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. రానున్న ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల్లో యువత చురుకైన పాత్ర పోషించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ బలుస సాయి,అసెంబ్లీ యూత్ ప్రెసిడెంట్ కర్నె భూమా రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ బొద్దుల శివ,రాయికల్ పట్టణ యూత్ నాయకులు అల్లె పురుషోత్తం,అనుమల్ల చింటూ,కాశిరెడ్డి సంజీవ్,మోర చైతన్య,గుండేటి రూపేష్,నరంశెట్టి మనోజ్,గట్టు బంటు,సింగని వరుణ్,శ్రీరాముల సాయి,పడిగెల నరసింహ,కొత్తపెల్లి అరవింద్, శివ,శ్రీకాంత్, సాయి,హరీష్,జలపతి,మధు,యూత్ నాయకులు పాల్గొన్నారు.