పర్యావరణహితమైన జూట్ బ్యాగులను ప్రజలు వినియోగించాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాసం ప్రసాద్ అన్నారు... అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద 200 జూట్ బ్యాగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ జూట్ బ్యాగుల వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్,కోశాధికారి సుధవేణి మురళి,క్లబ్ సభ్యులు బత్తిని భూమయ్య,మ్యాకల రమేష్,మచ్చ శేఖర్,దాసరి గంగాధర్, కాటిపెల్లి రామ్ రెడ్డి,కటకం కళ్యాణ్,బొమ్మ కంటి నవీన్,ఆడెపు రాం ప్రసాద్,గోపాల్,వాసం రాజేందర్,పులి రమేష్, సత్యనారాయణ ,అశోక్ పద్మశాలి సంఘం అధ్యక్షులు భోగ రాజేశం,యువకులు అనుమండ్ల తేజ,సాయికుమార్,తదితరులు పాల్గొన్నారు
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.