|
modi add 1

తబిత ఆశ్రమంలో పండ్ల పంపిణీ, భోజన కార్యక్రమం నిర్వహించిన పోలాడి శ్రీనివాసరావు–హారిక దంపతులు

టీబీజీకేఎస్ యూనియన్ నాయకుడు పోలాడి శ్రీనివాసరావు, హారిక దంపతులు తమ పెళ్లిరోజు సందర్భంగా రామగుండంలోని తబిత ఆశ్రమంలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దంపతులు మాట్లాడుతూ..., తమ జీవితంలోని ఆనందకరమైన రోజును ఆశ్రమ చిన్నారులతో కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక సందర్భాలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ద్వారా సమాజానికి ఉపయోగపడే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఆశ్రమ నిర్వాహకులు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పిల్లల సంక్షేమం కోసం అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సిబ్బంది, యూనియన్ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొని దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.

By Ambati Sathish kumar | June 18, 2026 | 0 Comments

Hot Categories

2
7
1