మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు.... ఈరోజు మంగపేట మండల మల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు యాకుబి గారి మనవరాలు ఎండీ సన కు ఫల పుష్పాలంకరణ వేడుకకు హాజరై ఆశీర్వదించిన మంగపేట మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో.... జిల్లా హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్ టి ఐ చైర్మన్ బండా జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య, జిల్లా సెక్రటరీలు తుడి భగవాన్ రెడ్డి, పూజారి సమ్మయ్య, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పెద్ది నరసింహారావు, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాటబోయిన నరసింహారావు, మండల ప్రచార కార్యదర్శి ఎర్రoగాని సురేష్, మండల సీనియర్ నాయకులు.. గడ్డం చిరంజీవి, తోట అశోక్, నలబోయిన లక్ష్మణరావు, మహబూబ్ హుస్సేన్, జట్టి రాజు, గడ్డం సురేష్, తదితరులు హాజరయ్యారు.....
పట్టణంలో పీర్లగుట్టపై ప్రజల ఆర్తనాదాలు వినండి. గొంతు ఎండిపోతున్న ప్రజలకు నీరు తాపండి ప్రజాప్రతినిధులారా అధికారులారా ప్రజలు కట్టిన పన్నుపై జీతాలు తీసుకొని వారి సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారా? వారికి సేవ చేయoడని డబల్ బెడ్ రూమ్ లో నివసించే ప్రజలకు పలు కష్టాలు ఉన్నాయని వాటిని వెంటనే తీర్చాలని ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక వెళ్లి పరిశీలించి డిమాండ్ చేసింది. వనపర్తి లో నెలకొన్న సమస్యలపై అఖిలపక్ష ఐక్యవేదిక మోటార్ సైకిళ్ల పై తిరుగుతూ ప్రజలతో మమేకమై తెలుసుకొని బహిరంగ లేఖ రాస్తూ పత్రికా ముఖంగా పాలకపక్షాలకు, ప్రజా ప్రతినిధులకు సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి పలు డిమాండ్లు చేయడం జరిగింది. ఈరోజు స్థానికంగా ఉండే పలు పార్టీల నాయకులతో కలిసి మోటార్ సైకిళ్ల పై బయలుదేరి డబల్ బెడ్ రూమ్ ల సమస్యలపై తిరుగుతూ పీర్లగుట్ట ప్రజలు అఖిలపక్ష ఐక్యవేదికకు ఇచ్చిన దరఖాస్తు పై వెళ్లి చూడగా అక్కడ నీటి సమస్య, కరెంటు సమస్య, శానిటరీ సమస్యలు రోడ్డు సమస్యలతో విలవిలలాడుతున్నారని వారి ఆర్తనాదాలు ఎవరికి వినిపించలేదని, రాజకీయాలు విడిచిపెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని, అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది.
త్వరలో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం!! పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను భుజాలపైన మోస్తాం!! పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలి!! భోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు పాలకవర్గం ప్రమాణస్వీకారం సభలో రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క తెలంగాణలో రైతులని రాజులను చేసే ప్రక్రియ కొనసాగుతుందని, త్వరలో రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతు రుణ విముక్తి దారుణ చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముందున్న ప్రధాన లక్ష్యం అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, శ్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు సీతక్క పేర్కొన్నారు స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బోత్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం లో పాల్గొని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గానికి శాలువాలతో సన్మానించారు ముందుగా ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు నూతన పాలకవర్గంతో ప్రమాణస్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు అనంతరం జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా మోసి కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు లభిస్తోందని, దానికి నిదర్శనమే బోత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి అని పేర్కొన్నారు ప్రజల్లో ఉండండి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బోజ్జు నూతనంగా ఎన్నుకోబడ్డ పాలకవర్గం అనునిత్యం రైతాంగ సమస్యల మీద, రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా దళారులు నష్టపరచకుండా రైతులందరికీ అందుబాటులో ఉండాలని, పార్టీలో కూడా క్రియాశీలకంగా ప్రజల్లో పనిచేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఆర్ గ్యారంటీలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి కష్టపడి పని చేయాలని సూచించారు సీతక్క నోట భోథ్ రెవెన్యూ డివిజన్ మాట రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్త సమస్యలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని రానున్న కేబినెట్ మీటింగ్లో బోథ్ రెవెన్యూ డివిజన్, సోనాల మండల ఏర్పాటు, ఫైర్ స్టేషన్, డిగ్రీ కళాశాల ఇన్చార్జి మంత్రిగా కేబినెట్ ముందు ఉంచుతానని భరోసా ఇచ్చారు బిఆర్ఎస్ బిజెపిలో ఒకే తాను గుడ్డలని నూతన వ్యవసాయ చట్టాలు అమలు చేస్తూ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని వారి పార్టీలో వ్యక్తిగత జీవితం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద ప్రజా సమస్యల మీద చూపించాలని బిఆర్ఎస్ బిజెపి నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం, భోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆడే గజేందర్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్, తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ అడ్డీ బోజారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లీ శ్రీధర్, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రపూల్ రెడ్డి, మహమూద్ ఖాన్, తలమడుగు మండల ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, జడ్పిటిసి సభ్యులు మల్లెపూల నరసయ్య, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ యూత్ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఫిషరీస్ , భోథ్ నియోజకవర్గ అన్ని మండలాల అధ్యక్షులు ముఖ్య నాయకులు, ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు రైతులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు
రాయికల్ పట్టణ ఆర్యవైశ్య సంఘ మహిళ అధ్యక్షురాలుగా జిల్లా లావణ్య , ప్రధాన కార్యదర్శిగా సిద్ధంశెట్టి స్వప్న, కోశాధికారిగా ఐతమాధవి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఏర్పాటు చేయడానికి పట్టణ సంఘ అధ్యక్షులు కూరగాయల రవికుమార్ ,ప్రధాన కార్యదర్శి గరిపెల్లి శ్రీనివాస్ ,కోశాధికారి పల్లెర్ల పవన్ కుమార్, మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.