తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కమ్యూనిటీ హల్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
హైదరాబాదులోని తెలంగాణ సచివాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం లో ప్రముఖ హైకోర్టు న్యాయవాది లాయర్స్ పోరం పర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ సామాజిక చైతన్యత రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మునుగోడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే నర్రి స్వామి కుర్మ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లా (న్యాయ పరిపాలన) చీఫ్ సెక్రటరీ ఐ ఎ ఎస్ తిరుపతి గారిని తెలంగాణ సచివాలయం లో కలిసి వినతి పత్రాన్ని ఇచ్చిన అనంతరం న్యాయవ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలను నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సరైన న్యాయం చేకూర్చాలని లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు న్యాయ వ్యవస్థలోని ముఖ్యమైన సమస్యలు 1. P.P లు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు క్యాడర్ లో నియమితులైన వారు మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ కావాలి. కానీ హైదరాబాదులోనే గత 15 సంవత్సరాలుగా అనేకమంది పనిచేస్తున్నారు. అందులో చాలామంది ఆంధ్ర పౌరసత్వం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు దీని వలన తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు చాలా అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని నాంపల్లి ఎల్బీనగర్ కుకట్పల్లి మేడ్చల్ రాజేంద్రనగర్ మల్కాజ్గిరి మొదలైన కోర్టులో 15 సంవత్సరాల వరకు పనిచేస్తున్నారు ఉదాహరణకు ఓకే ప్లేస్ లో చాలా కాలం నుంచి పనిచేస్తున్న ప్రభుత్వ క్యాడర్ పీపీలు రాజలక్ష్మి ,శ్రీరాము ,రజిని శైలజ మొదలైన వారు 2. పిపీలుగా జేపీలుగా ఒకే ప్లేస్లో చాలాకాలం పని చేయడం వలన నూతనంగా వృత్తిలోకి వచ్చేటటువంటి వారికి ప్రాక్టీస్ లో చాలా ఇబ్బందులు తలెత్తి వారు న్యాయవాద వృత్తికి దూరమవుతున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జడ్జీలను ట్రాన్స్ఫర్ చేసిన విధంగా ఏపిపీలను కూడా ట్రాన్స్ఫర్ చేయాలి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న వారందరినీ వీలైనంతవరకు ట్రాన్స్ఫర్ చేయాలి 3. కోర్టు కానిస్టేబుల్ గా లైసెన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నవారు మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండటం వల్ల నూతనంగా ప్రాక్టీస్ చేసేటటువంటి న్యాయవాదులకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది కేసుల విషయంలో కోర్టు కానిస్టేబుల్ లో జోక్యాన్ని తగ్గించి వారిని వెంటనే మూడు సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేయాలి 4. నూతన గవర్నమెంట్ తన మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జూనియర్ న్యాయవాదులకు 5 గౌరవ వేతనం చెల్లించాలి 5. న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఏర్పడే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి స్టేట్ న్యాయ ప్రొటెక్షన్ ఆక్ట్ తీసుకురావాలి దాని వలన న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టవచ్చు 6. నూతనంగా హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో నియమించే జిపిలు ఏజీపీలు స్టాండింగ్ కౌన్సిల్ మొదలైన పోస్టుల్లో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయవాదులకు సరైన ప్రాతినిథ్యం కల్పించాలి పైన పేర్కొన్నటువంటి సమస్యలను వీలైనంత త్వరగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పరిష్కరించి తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవ్యవస్థలో ఉన్న న్యాయవాదులు అందరికీ న్యాయం చేకూర్చే విధంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నం తెలియజేశారు ఈ కార్యక్రమంలో లాయర్స్ పోరంపర సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ యాదవ్ , తెలంగాణ న్యాయవాదుల సమిత అధ్యక్షులు పద్మారావు ,బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ యాదవ్, లాయర్స్ ఫోరం కార్యదర్శి సుదర్శన్ నేత సత్యనారాయణ మల్లేష్ మహేష్ బాబు అనేకమంది న్యాయవాదులు పాల్గొన్నారు
త్వరలో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం!! పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను భుజాలపైన మోస్తాం!! పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలి!! భోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు పాలకవర్గం ప్రమాణస్వీకారం సభలో రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క తెలంగాణలో రైతులని రాజులను చేసే ప్రక్రియ కొనసాగుతుందని, త్వరలో రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతు రుణ విముక్తి దారుణ చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముందున్న ప్రధాన లక్ష్యం అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, శ్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు సీతక్క పేర్కొన్నారు స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బోత్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం లో పాల్గొని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గానికి శాలువాలతో సన్మానించారు ముందుగా ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు నూతన పాలకవర్గంతో ప్రమాణస్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు అనంతరం జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా మోసి కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు లభిస్తోందని, దానికి నిదర్శనమే బోత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి అని పేర్కొన్నారు ప్రజల్లో ఉండండి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బోజ్జు నూతనంగా ఎన్నుకోబడ్డ పాలకవర్గం అనునిత్యం రైతాంగ సమస్యల మీద, రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా దళారులు నష్టపరచకుండా రైతులందరికీ అందుబాటులో ఉండాలని, పార్టీలో కూడా క్రియాశీలకంగా ప్రజల్లో పనిచేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఆర్ గ్యారంటీలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి కష్టపడి పని చేయాలని సూచించారు సీతక్క నోట భోథ్ రెవెన్యూ డివిజన్ మాట రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్త సమస్యలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని రానున్న కేబినెట్ మీటింగ్లో బోథ్ రెవెన్యూ డివిజన్, సోనాల మండల ఏర్పాటు, ఫైర్ స్టేషన్, డిగ్రీ కళాశాల ఇన్చార్జి మంత్రిగా కేబినెట్ ముందు ఉంచుతానని భరోసా ఇచ్చారు బిఆర్ఎస్ బిజెపిలో ఒకే తాను గుడ్డలని నూతన వ్యవసాయ చట్టాలు అమలు చేస్తూ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని వారి పార్టీలో వ్యక్తిగత జీవితం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద ప్రజా సమస్యల మీద చూపించాలని బిఆర్ఎస్ బిజెపి నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం, భోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆడే గజేందర్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్, తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ అడ్డీ బోజారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లీ శ్రీధర్, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రపూల్ రెడ్డి, మహమూద్ ఖాన్, తలమడుగు మండల ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, జడ్పిటిసి సభ్యులు మల్లెపూల నరసయ్య, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ యూత్ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఫిషరీస్ , భోథ్ నియోజకవర్గ అన్ని మండలాల అధ్యక్షులు ముఖ్య నాయకులు, ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు రైతులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు
* ఇరిగేషన్, మైనింగ్ శాఖకు రూ.50కోట్ల జరిమానా.. * అవినీతిపరులకు వంతపాడిన అధికారులను వదలం.. * NGT తీర్పుని స్వాగతిస్తున్నాం..... * బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి గారు... పెద్దపల్లి,మే 22(జనం గొంతు): అధికారమధంతో మానేరువాగు నుండి ఇసుక అక్రమ ఇసుక తవ్వకాలు జరిపి వేలకోట్లు దోచుకున్న గత అధికార, ప్రతిపక్ష నాయకులకు చెన్నయ్ హరిత ట్రిబ్యూనల్ న్యాయస్థానం వెలువరించిన తీర్పు చెంపపెట్టులాంటిదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి ఇసుక మానిటరింగ్ కమిటీకి వ్యతిరేఖంగా హరిత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపధ్యంలో బుధవారం సురేష్ రెడ్డి ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా మానేరువాగు వెంబడి 19ఇసుక రీచులకు సంబంధిత అధికారులు అనుమతులు ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుపట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా అధికార పార్టీ, ప్రతిపక్ష నాయకులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమ తవ్వకాలు జరపడం పట్ల కోర్టు ఆగ్రహించిందని వివరించారు. అవినీతికి బాద్యులను చేస్తూ ఇరిగేషన్, మైనింగ్ శాఖలుకు రూ.50కోట్ల జరిమానా విధించినదని, అట్టి డబ్బులను మూడునెలల్లో గోదావరి రివర్ మేనేజిమెంటు ఖాతాలో జమచేయాల్సిందిగా న్యాయస్థానం తీర్పు వెలువరించిదన్నారు. చేతివృత్తులు చేసుకునే వారికి మాత్రమే పర్యావరణ శాఖ నుండి అనుమతులు అవసరముండదనే విషయాన్ని కోర్టు స్పష్టంగా తెలియపరిచిందని సురేష్ రెడ్డి అన్నారు.జిల్లాలో అన్ని రీచులను వెంటనే మూసివేయాలని, అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా అధికారులను కోరారు. గత ప్రభుత్వం చేసిన ఇసుక మాఫియాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా వాటా ఉందని, అవినీతిపరులకు అండగా ఉన్న అధికారలు వదిలిపెట్టబోమని సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడేళ్ళుగా ప్రాణాలకు తెగించి తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచిన రైతులు, ప్రజలు, అభిమానులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేషంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు, మాజీ సర్పంచ్ కట్కూరి సత్యనారాయణ రెడ్డి, పార్లమెంట్ దళిత మోర్చా కోకన్వీనర్ ఈర్ల శంకర్, అమరగాని శ్రీనివాస్ యాదవ్, కందుల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఆధార్ నమోదు కేంద్రాన్ని రాయికల్ మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ,మండల ప్రజలు ,విద్యార్థులు ఆధార్ నమోదు కేంద్రం లో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆధార్ నమోదు కేంద్రం నిర్వాహకులు గంట్యాల ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.