|
modi add 1

ఫల పుష్పాలంకరణ వేడుక కు హాజరై ఆశీర్వదించిన

మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు.... ఈరోజు మంగపేట మండల మల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు యాకుబి గారి మనవరాలు ఎండీ సన కు ఫల పుష్పాలంకరణ వేడుకకు హాజరై ఆశీర్వదించిన మంగపేట మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో.... జిల్లా హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్ టి ఐ చైర్మన్ బండా జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య, జిల్లా సెక్రటరీలు తుడి భగవాన్ రెడ్డి, పూజారి సమ్మయ్య, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పెద్ది నరసింహారావు, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాటబోయిన నరసింహారావు, మండల ప్రచార కార్యదర్శి ఎర్రoగాని సురేష్, మండల సీనియర్ నాయకులు.. గడ్డం చిరంజీవి, తోట అశోక్, నలబోయిన లక్ష్మణరావు, మహబూబ్ హుస్సేన్, జట్టి రాజు, గడ్డం సురేష్, తదితరులు హాజరయ్యారు.....

By NYALAKONDA ANIL DESAI | February 25, 2024 | 0 Comments

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మండల అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి గారు ....

ఈరోజు మంగపేట మండల నరసింహ సాగర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరీ అనసూయ సీతక్క గారి చొరవతో మంజూరైన 10 లక్షల సిసి రోడ్డును కొబ్బరికాయ కొట్టి రోడ్డును ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి గారు ఈ కార్యక్రమం లో.... గ్రామ పార్టీ అధ్యక్షులు తాతినేని హరికృష్ణ, మండల యూత్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, మండల ఉపాధ్యక్షులు గాదె శ్రావణ్ కుమార్, మండల సీనియర్ నాయకులు... లోకు సత్యం, అన్నాల వెంకన్న, కొంకర బుచ్చి రాములు, బండి రాములు, దోమల నరేందర్, కోడం శ్రీకాంత్, దోమల పుల్లారావు, బోడ సతీష్, చందా నరేష్, తదితరులు హాజరయ్యారు....

By NYALAKONDA ANIL DESAI | March 05, 2024 | 0 Comments

సామాజిక సమరసత నిర్మాణానికి కృషిచేద్దాం

సామాజిక సమరసత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర సంయోజక్ అప్పాల ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి కరీంనగర్ పట్టణంలోని కోదండ రామాలయంలో జరిగిన సమరసతా సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమరసత కోసం జీవించిన భాగ్యరెడ్డి వర్మ, గౌతమ బుద్ధుడు, వీర సావర్కర్, అహల్య భాయి హోల్కర్ ల జయంతుల సందర్భంగా ఈ సమ్మేళనం జరిగింది. భారతదేశం వైవిధ్యంతో కూడిన దేశమని, ఇక్కడ సామరస్యం తప్ప సంఘర్షణ జరుగదని తెలిపారు. మహాపురుషులు అనేకమంది సామాజిక సమరసతకు వారి జీవితాలు అర్పించారని కొనియాడారు. భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ భవనం ద్వారా బాలికలకు పాఠశాల ప్రారంభించారని వివరించారు. బుద్ధుని అహింస, శాంతిని అందించే బౌద్ధం ప్రపంచంలో అనేక దేశాలకు విస్తరించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య వీర సావర్కర్ తన సొంత జిల్లాలో హరిజనులను పూజారులుగా నియమించారని చేపరు. అహల్య భాయి హోల్కర్ దేశంలోని ప్రధాన మందిరాలను పునర్నిర్మాణం చేసినట్లు తెలిపారు. స్త్రీ నేతృత్వ శక్తికి అహల్య భాయ్ నిదర్శనం అని ఆయన అన్నారు.సమరసత వేదిక గ్రామాల్లో అన్ని కులాల మధ్య సమన్వయం సాధించటానికి పని చేస్తుందని చెప్పారు. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అనే స్ఫూర్తి అంతటా నేడు కనిపిస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే హిందూ భావనతో సమాజం అంతా ఐకమత్యం తో శక్తివంతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమ్మేళనంలో వేదిక జిల్లా అధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి,పుల్లూరు రామారావు, మహిళా విభాగం వినోద, సంధ్య మరియు సభ్యులు పురుషోత్తం, సంతోష్, నర్సింగం తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | May 25, 2024 | 0 Comments

ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక

రాయికల్ పట్టణ ఆర్యవైశ్య సంఘ మహిళ అధ్యక్షురాలుగా జిల్లా లావణ్య , ప్రధాన కార్యదర్శిగా సిద్ధంశెట్టి స్వప్న, కోశాధికారిగా ఐతమాధవి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఏర్పాటు చేయడానికి పట్టణ సంఘ అధ్యక్షులు కూరగాయల రవికుమార్ ,ప్రధాన కార్యదర్శి గరిపెల్లి శ్రీనివాస్ ,కోశాధికారి పల్లెర్ల పవన్ కుమార్, మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 05, 2024 | 0 Comments

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. బి ఎం ఎస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని కార్మిక సంక్షేమమును పూర్తిగా విస్మరించిందని తెలంగాణ కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మోహన్ రెడ్డి విమర్శించారు.ఆదివారం నాడు కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కార్మిక శాఖకు మంత్రి లేడని ఎద్దేవా చేశారు.కార్మిక శాఖ అధికారుల ఇష్టారాజ్యమైందని ఆరోపించారు.భవన నిర్మాణ కార్మికులకు చెందవలసిన నిధులను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని,అందువల్ల కార్మికులకు కొత్త రూల్స్ పెట్టి లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కార్మిక శాఖ అధికారులు తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సంవత్సరం కాలంగా బోర్డు నుంచి అందాల్సిన పథకాల రూపాయలు అందట్లేవని వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.15 సంవత్సరాల నుండి కార్మికులకు కనీస వేతనం పెంపుకు నోచుకోవట్లేదని,ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ కార్మికుల కడుపు కొడుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ,బి ఎం ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పుల సురేష్,ప్రదీప్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కరీంనగర్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు పసుల శ్రావణ్,తోర్తి శ్రీనివాస్,మోగిలిపాలెం తిరుపతి,సత్యం తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | April 20, 2025 | 0 Comments

Hot Categories

2
1
6
1