తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బార్ కౌన్సిల్ నిర్వహించిన అడ్వకేట్ అసోసియేషన్స్ ఎన్నికల్లో భాగంగా చౌటుప్పల్ బార్ అసోసియేషన్ లో ఎలక్షన్ ఆఫీసర్లు ఈసం శంకరయ్య వెంకటయ్య రామకృష్ణ గార్ల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ పోరం పర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెండ్ ఎమ్మెల్యే అభ్యర్థి చౌటుప్పల్ బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి గ్రంథాలయ కార్యదర్శి స్థానిక సంస్థ నారాయణపురం మండల మల్లారెడ్డిగూడెం గ్రామ నివాసి.**నర్రి స్వామి కురుమ** ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సంవత్సరం తెలంగాణ బార్ కౌన్సిల్ నిర్వహించే ఎన్నికల్లో భాగంగా నేను రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టు లో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ నాకు జన్మనిచ్చిన ప్రాంతం నేను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని సంకల్పంతో నా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు ఈ సందర్భంగా నన్ను లైబ్రరీ సెక్రటరీగా ఎన్నుకున్నటువంటి చౌటుప్పల్ బారసోసియేషన్ అడ్వకేట్ సోదరీ సోదరీమణులందరికీ కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ బార అసోసియేషన్ అధ్యక్షులు ఊడుగు శ్రీనివాస్ ఉపాధ్యక్షులు పరమేష్ ప్రధాన కార్యదర్శి వేణు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి నరసింహ లేడీ రిప్రజెంటేటివ్ స్వాతి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శ్రీశైలం శేఖర్ సీనియర్ న్యాయవాదులు మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి ఎలమొని శ్రీనివాస్ ఎస్ ఆర్ బిక్షపతి వెంకటాచలం రవీందర్ శ్రీకాంత్ అనేకమంది న్యాయవాదులు పాల్గొన్నారు
Your experience on this site will be improved by allowing cookies.