రాయికల్ పట్టణ అభివృద్ధి మరియు పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరు చేయుటకు గురించి, రాయికల్ పట్టణము 2018 ఆగస్టులో గ్రామ పంచాయితీ నుండి 3వ శ్రేణి మున్సిపాలిటిగా ఏర్పడినది. మున్సిపల్ గా ఏర్పడిన నాటి నుండి పట్టణములో చుట్టుపక్కల ప్రాంతాల నుండి వలసలు పెరిగి జనాభా పెరిగింది. పెరిగిన జనాభాతో పాటు నివాసాలు వ్యాపార సంస్థలు పెరిగినాయి. గతంలో ఉన్న ఇంటి పన్నులు కొద్ది మొత్తంలో పెరిగి ప్రస్తుతము 1.20 కోట్లుగా సంవత్సర ఆదాయము కలదు. పన్ను వసూళ్లు తప్ప వేరే ఇతర ఆదాయ మార్గము రాయికల్ మున్సిపాలిటీకి లేదు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి కార్యక్రమము ద్వారా ప్రతి నెల పారిశుద్ధ్య నిర్వహణకు, పలు ముఖ్యమైన అభివృద్ధి పనులు చేపట్టుటకు నిధులు విడుదల అయ్యేవి. ఇట్టి నిధుల ద్వారా పట్టణములో పారిశుద్ధ్య నిర్వహణకు ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేది. కానీ గత 12 నెలలుగా ఇట్టి పట్టణ ప్రగతి నిధులు మంజూరీ లేక పారిశుద్ధ్య నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. పారిశుద్ధ్య వాహనాల మరమ్మత్తులు, పారిశుద్ధ్య సంబంధిత రసాయనాల కొనుగోలు, ఇతరత్రా సామాగ్రిని మున్సిపల్ సాధారణ నిధుల నుండే కొనుగోలు చేయడం వలన కార్యాలయ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు చెల్లించుటకు నిధుల కొరత ఏర్పడుచున్నది. పెరిగిన జనాభా అవసరాలను బట్టి అదనంగా పారిశుద్ధ్య కార్మికుల అవసరము కూడా ఉన్నది. ఇట్టి అదనపు కార్మికులను తీసుకొనుటకు ప్రభుత్వము నుండి అనుమతి లేనందున పట్టణములో ప్రతి రోజూ 100% పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టలేక పోవుచున్నాము. మొక్కల పెంపకము, నర్సరీల నిర్వహణకు మరింత కష్టతరముగా ఉన్నది. పై వాటి అన్నింటికి నిధుల లేమి కారణము కావున తమరు పై విషయాలను గమనించి రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా తగిన మొత్తంలో నిధులు మంజూరు చేయించగలరని రెండవ ఆర్థిక కమిషనర్ సమీక్ష సమావేశంలో ప్రసంగించి రాష్ట్ర ఆర్థిక కమిషన్ అధ్యక్షుడు సిరిసిల్ల రాజయ్యకు రాయికల్ చైర్మన్ మోర హనుమాన్లు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక కమిషనర్ చైర్మన్ రాజయ్య, సెక్రటరీ స్మిత సబర్వాల్ కరీంనగర్ జిల్లా కలెక్టర్, కమిషన్ మెంబర్స్ అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ, జిల్లా అధికారులు మున్సిపల్ చైర్మన్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.