రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండలం కొత్త పెట్ గ్రామానికి చెందిన దానవేని కొమురయ్య - నర్సవ్వ అనే ఇద్దరు భార్యాభర్తలకు డెంగ్యూ జ్వరం రావడం తో జగిత్యాల లోని గాయత్రి హాస్పిటల్ లో చేరగా పరిశీలించిన డాక్టర్స్ ఇద్దరికీ అత్యవసరంగా (ఒకరికి O పాజిటివ్ , మరొకరికి A పాజిటివ్) ప్లేట్ లెట్స్ అవసరం అని డాక్టర్స్ సూచించారు. ఈ విషయం పేషంట్స్ బంధువుల ద్వారా తెల్సుకుని భూపతి పూర్ గ్రామ సర్పంచ్ జక్కుల చంద్ర శేఖర్ తెలంగాణ ప్రాణ దాతల సమూహం ఫౌండర్ మహ్మద్ బాబు జాన్ బాయ్ దృష్టి కి తేవడం తో తాను వెంటనే స్పందించి రాయికల్ మున్సిపల్ కార్యాలయం లో సిస్టం మేనేజర్ గా విధులు నిర్వహించే ఆత్మీయులు శాశ్వత రక్త దాత రాకేష్ (A+) మరియు అందే శంకర్ (O+) గారిని ప్లేట్ లెట్స్ దానం చేయమని కోరగా వారు వెంటనే స్పందించి భారతి బ్లడ్ బ్యాంక్ కు వచ్చి ప్లేట్ లెట్స్ దానం చేసి ప్రాణ దాతలుగా నిలిచారు
Your experience on this site will be improved by allowing cookies.