రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈనెల 25వ తేదీన నిర్వహించే "నా పోలింగ్ నా బాధ్యత" కార్యక్రమంలో, జిల్లా బూత్ లెవెల్ ఏజెంట్ లు అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. 25వ నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ దీపికా దాస్ మున్షు ఆలోచన మేరకు,వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న, నా పోలింగ్ బూత్ నా బాధ్యత,కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే హాజరవుతున్నారని పత్రికా ప్రకటనలో తెలియజేశారు. కావున ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్, 25వ తేదీన హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో నిర్వహించే,నా పోలింగ్ నా బాధ్యత కార్యక్రమంలో విధిగా హాజరు కావాలని, 25వ నాడు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందని, మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు. అదే విధంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తమ బాధ్యతగా బూత్ ఏజెంట్లను ఏల్బి స్టేడియం కు పంపాలని, అదేవిధంగా పోలింగ్ బాధ్యత కార్యక్రమానికి, బూత్ ఏజెంట్ల కొరకు పాసులు సిద్ధం చేస్తున్న సందర్భంగా, వాటి వివరాలను కాంగ్రెస్ భవన్ కు పంపాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు.
నిజామాబాదు జిల్లా అడిషనల్ (అడ్మిన్ ) డీసీపీ గా బస్వారెడ్డి. నిజామాబాదు : నిజామాబాదు జిల్లా అడిషనల్ డీసీపీ గా (అడ్మిన్ ) బస్వారెడ్డి నియమితులయ్యారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. అందులో భాగబగా ఆయన్ను నిజజామాబాదు జిల్లా అడిషనల్ డీసీపీ గా (అడ్మిన్ ) నియమిస్తూ ఉత్తర్వులు జారిచేశారు.
Your experience on this site will be improved by allowing cookies.