|
modi add 1

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎండి దావూద్ పిలుపు సమ్మె వాల్ పోస్టర్ విడుదల ఏటూరునాగారం,జనం గొంతు, జయరాజు కేంద్ర బిజెపి కార్మిక ప్రజావ్య తిరేక విధా నాలను తిట్టుకో డందాం కార్పొరేట్ అనుకూల మతత త్వ విధానాలను ప్రతిఘ టిస్తూ ప్రభుత్వంగాన్ని కాపా డుకుందాం అనే నినా దంతో ఫిబ్రవరి 16 దేశవ్యా ప్తంగా జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లు ఐఎన్ టి యుసి ఏఐటియుసి సిఐటి యు, హెచ్ఎంఎస్,3 ఐ ఎఫ్ టి యు లు, బి ఆర్ టి యు, టి ఎన్ టి యు సి,ఏ వీటితో పాటు ఉద్యోగ సంఘాల ఆల్ ఇండియా ఫెడరేషన్లు, స్కీం వర్కర్ల ఫెడరేషన్లు, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) దేశ వ్యాప్తంగా ఉన్న ఈ సంఘా లన్నీ ఈ సమ్మెకు పిలుపుని చ్చాయని సిఐటి యు జిల్లా అధ్యక్షుడు ఎండి దావూద్ అన్నారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో కి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ సంవత్స రానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక మైన రైల్వే రోడ్లు గ్యాస్ ఓడరేవు లాంటి వాటి ఆస్తులను ప్రైవేటు వారికి కట్టబెట్టి లక్షల కోట్లు కట్టబెట్టాలని చూసిందన్నారు అందుచేతనే ఉద్యోగ కార్మిక రైతు బ్యాంకింగ్ అన్ని వర్గాల ప్రజల యొక్క మద్దతుతో ఈ యొక్క సమ్మె జరుగుతుం దన్నారు.కనీస వేతనం 26000 చెల్లించాలి స్కీము లకు బడ్జెట్ పెంచాలి నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, ప్రభుత్వం రంగ సంస్థలు అమ్మడం ప్రైవేట్ పరం చేయడం ఆపాలి కాంట్రాక్టు విధానం రద్దుచేసి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి ధరల పెరుగుదలను అరికట్టాలి, ఆహార వస్తువుల నిత్యవస రాలపై జిఎస్టి ఉపసంహరిం చుకోవాలనే డిమాండ్స్ తో ఈ సమ్మె కొనసాగుతుందని ఉద్యోగ కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల ని కోరారు.ఈ యొక్క కార్య క్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు బాలోజు రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిటమట రమేష్,కార్మికులు ఎం పెళ్లి మురళి,నాయిని కృష్ణ,గోగు మల్లయ్య,డి. చిన్న,వి కృష్ణ,వి ఎల్లయ్య,డి రాంబాబు,వి సుధాకర్,వెంకన్న జిపి కార్మికుడు,జే సమ్మయ్య,రిక్షా కార్మికులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 15, 2024 | 0 Comments

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు.

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయికల్ మండలంలోని తాట్లవాయి ఉన్నత పాఠశాలలో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన సైన్స్ పరికరాలతో ఎగ్జిబిషన్ నిర్వహించడమైనది. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా, వారు తయారు చేసిన పరికరాల గురించి, వాటి పని విధానం గురించి వివరించడం జరిగినది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బోగ రమేష్ మాట్లాడుతూ సైన్స్ కు మన జీవితంతో విడదీయరాని సంబంధం ఉందని, ఈరోజు మనం అనుభవిస్తున్న అన్ని రకాల సౌలభ్యాలు,సౌకర్యాలు సైన్స్ వల్లనేనని,అందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలకు మనం రుణపడి ఉన్నామని, విద్యార్థులు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరు శాస్త్రీయ అవగాహన కలిగి ఉన్నప్పుడే,సమాజంలోని మూఢత్వాన్ని తొలగించగలమని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏనుగు శ్రీనివాసరెడ్డి,పొత్తూరి రవీందర్, ఏలేటి లావణ్య, చంద సాగరిక, ఎనగండ్ల శ్రీధర్, పులిపాటి శ్రీదేవి, దువ్వ చంద్రకళ, చీర్నేని రవికుమార్, బింగి పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 28, 2024 | 0 Comments

ఇటిక్యాల ఆదర్శ పాఠశాలలో ఘనంగా నేషనల్ సైన్స్ డే ఉత్సవాలు

ఇటిక్యాల ఆదర్శ పాఠశాలలో సర్ సివి రామన్ నేషనల్ సైన్స్ డే ను పురస్కరించుకొని పాఠశాలలో సైన్స్ ఫెయిర్ మరియు గణిత నమూనాలను ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులు వివిధ రకాల నమూనాలను ప్రదర్శించి సైన్స్ పట్ల ఉన్న ఆసక్తిని ప్రదర్శించారు. మరియు వివిధ రకాల సైన్స్ పటాలను రంగురంగుల కలర్స్ తో నేలపై గీసి ప్రదర్శించడం జరిగింది. మరియు సాయంత్రం విద్యార్థి క్విజ్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీధర్ తో పాటు గణిత మరియు సైన్స్ ఉపాధ్యాయులు సలావుద్దీన్, ప్రవీణ్ కుమార్, రజిత, ఉషారాణి, ప్రదీప, జ్యోతి మరియు రవళి, అఖిల తో పాటు మిగతా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.

By NYALAKONDA ANIL DESAI | February 28, 2024 | 0 Comments

జాతీయ కరాటే పోటీల్లో ఐపీఎస్ పాఠశాల విద్యార్థి ప్రతిభ

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించాడు.ఈ నెల 03వ తేదీ ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి లో 7వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే,కుంగ్ ఫు చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జి హర్షవర్ధన్ కట, కుమ్మిత్ విభాగంలో బంగారు పతకాలు సాధించాడు.ఐపీఎస్ పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థిని అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్వీయ రక్షణకు,ఆత్మ రక్షణకు కరాటే అవసరమన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 04, 2024 | 0 Comments

సోషల్ మీడియాలో జాతీయవాద ప్రభావం కీలకం

సోషల్ మీడియాలో జాతీయ వాద ప్రభావం కీలకం అని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు.సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సోషల్ మీడియా సంగమం స్థానిక ఫిల్మ్ భవన్ లో ఈరోజు (తేదీ 3-3-2024, ఆదివారం) జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ భీమనాతిని శంకర్ ఆర్ఎస్ఎస్ కరినగర్ విభాగ్ సంఘ్ చాలక్ గారు పాల్గొని ప్రసంగిస్తూ నేటి యువత సోషల్ మీడియాలో మరింత క్రియాశీలంగా ఉండాలని చెప్పారు. అనంతరం ముఖ్యఅతిథి సీనియర్ జర్నలిస్ట్ సురేశ్ కొచ్చాటిల్ గారు ప్రసంగిస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి కాబడుతున్న అనేక అబద్ధపు ప్రచారాల్ని తిప్పికొట్టాలని అసలు నిజాల్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత జాతీయవాదులైన ప్రతీ ఒక్కరిపైనా ఉందని, ప్రతీ జాతీయవాది సోషల్ మీడియాలో నిజమైన దేశచరిత్రను,దేశ సామాజిక-సాంస్కృతిక చరిత్రను మరియు దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని,సాంఘిక-సంక్షేమ పథకాలను వాటి ఉద్దేశ్యాలను ప్రయోజనాలను లబ్ధిదారులకు తెలియజేసి దేశహితం కోసం పాటుపడాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.జాతీయవాదం బలపడితేనే మనదేశం విశ్వగురు స్థానాన్ని చేరుకోగలదని,గత వైభవాన్ని సాధించగలమని ఇందుకోసం ప్రతీ జాతీయవాది సోషల్ మీడియాను మాధ్యమంగా మలచుకోవాలని తెలిపారు.ఇదే కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కట్టా రాజగోపాల్ గారు మాట్లాడుతూ మనదేశ సాంస్కృతిక మూలాలు గొప్పవని వాటిని ప్రస్తుత తరంవారు ఖచ్చితంగా తెలుసుకోవాలని తెలిపారు. దేశ విచ్చిన్నతకు జరుగుతున్న అనేక కుట్రలను ఎదుర్కోవాలని సూచించారు. కులం, వర్గం, ప్రాంతం, భాష పేరుతో జరిగే విభజన వాదాలను తార్కికంగా తిప్పికొట్టాలని చెప్పారు. అంబేడ్కర్ పేరుతో జరుగుతున్న సాంస్కృతిక విధ్వంసం, అంబేడ్కర్ ఏనాడూ కోరలేదని ఉదాహరణలతో వివరించారు. జాతీయ భావ విస్తరణ వలనే విభజన శక్తులన్నీ తోక ముడుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజనా చారి,ఎలగందుల సత్యనారాయణ మరియు సమాచార భారతి కార్యకర్తలు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 05, 2024 | 0 Comments

నిమ్న వర్గాలు ఎవరూ అధైర్య పడవద్దు జాతీయ ఎస్సీ కమీషన్ సబ్యులు రాంచందర్

అణగారిన వర్గాల ప్రజలమని సమాజంలో ఇంకా అట్టడుగున నే ఉన్నామని ఎవరూ అధైర్య పడవద్దు అని జాతీయ ఎస్సీ కమీషన్ సబ్యులు రాంచందర్ అన్నారు. శుక్రవారం ఆయన ఆప్త మిత్రులు అయిన రాష్ట్ర భిఎంఎస్ అద్యక్షులు కలాల్ శ్రీనివాస్ ఇంటిలో ఆతిథ్యం స్వీకరించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. అణగారిన వర్గాలయిన ఎస్సీ,ఎస్టీ కులాలు ఎవరూ కూడా అధైర్య పడవద్దు అని సమాజంలో అందరూ సమానమేనని తెలిపారు. అందుకు అనుగుణంగా భారత రాజ్యాంగం రాయబడిందని అన్నారు. ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాలయిన ఎస్సీ ఎస్టీ కులాలు కోసం అనేక హక్కుల ను రాజ్యాంగం ద్వారా సంక్రమింప చేశారని తెలిపారు. అందుకు మోడి ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని అందుకే తనను జాతీయ ఎస్సీ కమీషన్ సబ్యులు గా నామినేట్ చేసారని అన్నారు. [8:22 pm, 15/03/2024] Nyalakonda Anil Desai: అణగారిన వర్గాల ప్రజలకు ఎక్కడ ఏ ప్రాంతం లో అయినా అణచివేత కు అవమానానికి గురైనట్లు బావించితే ఎస్సీ కమీషన్ ను సంప్రదించాలని అందుకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని మీ సమస్యను ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తే సరిపోతుంది అని అన్నారు. ఈ కమీషన్ ద్వారా తనకు జ్యుడీషియల్ పవర్ ఉంటుందని అధికారంలో ఎంత పెద్ద వారున్నా క్షణాల్లో అరెస్టు చేయించగలిగే అధికారాలు తనకు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కలాల్ శ్రీనివాస్ తో పాటు సిద్దిపేట కు చెందిన బి ఎంఎస్ నాయకులు కొండాల్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,ఆర్చ్ ఫార్మా కార్మికులు ఇతర బి ఎంఎస్ నాయకులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 16, 2024 | 0 Comments

జాతీయస్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ కి ఎంపికైన బ్లూమింగ్ బడ్స్ విద్యార్థిని

జాతీయస్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ కి ఎంపికైన బ్లూమింగ్ బడ్స్ విద్యార్థిని నిజామాబాదు : ఇటీవల మెదక్ లో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ లో మెరుగైన ప్రతిభ కనబరిచిన బ్లూమింగ్ బడ్స్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న Y.ప్రజ్ఞ జాతీయ స్థాయికి ఎంపికయ్యింది. నిజామాబాద్ జిల్లా నుంచి జాతీయస్థాయి కి తమ విద్యార్థి ఎంపిక కావడం ఆనందంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ ప్రసన్నకుమారి విద్యార్థిని అభినందించారు. జాతీయ స్థాయి పోటీలు డిసెంబర్ 6 నుంచి 10 తేది వరకు జమ్మూ కాశ్మీర్ లో జరగనున్నాయి. ఈ సందర్భంగా బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఆటలలో ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని మరియు విద్యార్థినిని అభినందించారు.

By NYALAKONDA ANIL DESAI | November 26, 2024 | 0 Comments

ఘనంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

ఆడపిల్లలకు ఆధునిక విద్య అందించాలి.....రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు పురుషులతో సమానంగా ఆడపిల్లలకు ఆధునిక విద్య అందించాలనే లక్ష్యంతో సావిత్రిబాయి తన జీవితాన్ని అర్పించారని మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు అన్నారు. శుక్రవారం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలికల పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులు పద్మజ,పాతిమబేగం,వనిత, తిరుమల,పద్మ,తరంగిణి,రజిత,హైమవతి,హర్షియ,స్వరూప లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించి, అణచివేత కు గురైన వర్గాలకు న్యాయం దక్కేందుకు సావిత్రిబాయి తన జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మ్యాకల అనురాధ,లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్,మాజీ జడ్ సి లు మ్యాకల రమేష్,కార్యదర్శి కడకుంట్ల నరేష్,క్లబ్ సభ్యులు వాసం ప్రసాద్, బొమ్మకంటి నవీన్,ఎర్ర సుమన్,జిల్లాల సూర్యం రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పొన్నం రమేష్,శ్రీనివాస్, ఉపాధ్యాయులు పారిపెళ్లి గంగాధర్,సత్యం,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | January 03, 2025 | 0 Comments

77 ఏళ్లుగా వెలుబడుతున్న ఏకైక జాతీయ వాద పత్రిక... గర్వించదగిన తెలుగు వార పత్రిక "జాగృతి"

*ఒక పత్రిక 10 వేల సైన్యం తో సమానం... *వాదాల పేరుతో వాస్తవాలు మరుగున పడుతున్నాయి.. ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ జి... 1948 లో ప్రారంభమై 77 ఏళ్ళుగా వెలుబడుతున్న ఏకైక జాతీయవాద పత్రిక, గర్వించదగిన తెలుగు వార పత్రిక జాగృతి అని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ జితెలిపారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వార పత్రిక జాగృతి పాఠకుల ఆత్మీయ సమ్మేళనము బుధవారం రోజున సాయంత్రం కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ ఎదురుగా గల రెవెన్యూ గార్డెన్స్ లో జరిగింది. ఇట్టి ప్రోగ్రాం కు ముఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలుగు పత్రికల చరిత్ర నిస్సందేహంగా ఘనమైందన్నారు. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో పత్రికలు ప్రముఖపాత్రనుపోషించాయన్నారు. ఆ రోజుల్లో ఆంధ్ర పత్రిక, కృష్ణ పత్రిక, ఇండియన్ ఎక్స్ ప్రెస్ , ఆంధ్రప్రభ లాంటి ఎన్నో పత్రికలు ఉండేవని , ఆ తర్వాత ఈనాడు , ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు వచ్చాయన్నారు. నేడు మీడియా రంగం ఎంతో విస్తరించిందన్నారు. డిజిటల్ , సోషల్ మీడియా తో వేగంగా సమాచార వ్యాప్తి జరిగే పరిస్థితులు వచ్చాయన్నారు. ఒక పత్రికపదివేలసైన్యంతోసమానమన్నారు. కానీ నేడు వాదాల పేరుతో వాస్తవాలు మరుగున పడిపోతున్నాయన్నారు. భారతీయత మీద వక్ర భాష్యాల విషపుజల్లులుకురుస్తున్నాయన్నారు. ఏ పత్రిక అయినా సదాశయంతోనే ప్రారంభమవుతుందని, అర్థవంతమైన పేరు , ఆదర్శనీయమైన ప్రయాణం రెండు కన్నులుగా సాగిన పత్రికల జాడ చరిత్ర లో ఒకింత తక్కువేనన్నారు. జాతీయ భావజాలం తో, ధర్మం, రక్షణ కోసం ఈ మట్టి పరిమళంతో వేలుబడుతు , ఎన్నో అటు పోట్లను ఎదుర్కొని 77 ఏళ్లుగా నిలబడిన ఏకైక వార పత్రిక జాగృతి యే నన్నారు. ప్రధానంగా జాతీయతకు సుదూరంగా ఉండే ప్రభుత్వాల ఏలు బడిలో కత్తి సాము చేసిన ఘనత జాగృతి దే న్నారు. జాగృతి ముఖ్యంగా జాతీయ భావాజాలను వ్యాప్తం చేసిందని, ప్రజల అవసరాలను గుర్తించి, ఎన్నో రచనలు చేసి సమాజాన్ని జాగృతం చేసే ప్రయత్నాలు చేసిందన్నారు. గడిచిన ఏడున్నర దశాబ్దాలుగా జాగృతి స్వరాజ్య సమరయోధుల పోరాట ఆశయాన్ని ఆవిష్కరించడానీకే శ్రమిస్తుందన్నారు. ఇలాంటి పత్రికను మరింత ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రజలతో మమేకమవుతూ సమాజం కోసం పలువిధాలపాటుపడుతుందన్నారు.. నేడు దేశంలోని సామాజిక రంగాల్లో ప్రవేశించి, ఒక జాతీయ శక్తిగా సంఘం ఎదిగిందన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ బాధ్యులు కట్ట రాజగోపాల్, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి. దురిశెట్టి నిరంజన చారి , పాక సత్యనారాయణ, ఎలగందుల సత్యనారాయణ, కిషన్ జి, బాలరాజు , తడగోప్పు ల శంకరయ్య, గీకూరి శ్రీనివాస్ , మహేశ్వర్ , పుల్లూరి రామారావు , మురళీజీ , పరుశరాం జి తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | May 21, 2025 | 0 Comments

Hot Categories

2
1
6
1