|
modi add 1

నూతన ప్రజాసేవ చారిటబుల్ ట్రస్ట్

జనంగొంతు,మంగపేట, జయరాజు మంగపేట మండలం కస్తూరి బాయి వృద్దాశ్రమంకు ప్రజా సేవ చారి టబుల్ ట్రస్ట్ ఆధ్వ ర్యంలో 25 కేజీ బియ్యం, పండ్లు,స్వీట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాసేవ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ మాట్లాడు తూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనాతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నా రు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ గుడివాడ శ్రీహరి, గౌరవ సలహాదరులు గుండేటి రాజు యాదవ్,చల్లగురుగుల తిరుపతి,సాధనపల్లి కరివర్ధన్,గౌని రమేష్,పిల్లల మర్రి వేణు,ముప్పారాపు సందీప్,మూగల రాము, సాయి,తదితరులు పాలుగోన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 16, 2024 | 0 Comments

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది..అన్నం పరబ్రహ్మ స్వరూపం

అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని రాయికల్ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు తాటిపాముల విశ్వనాథం అన్నారు. గురువారం రోజున రాయికల్ మార్కండేయ మందిరంలో పద్మశాలి సేవా సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమం మరియు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ హిందూ పురాణాల ప్రకారం, దానాల్లో ఉత్తమమైన దానం అన్నదానమని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ఒకపూట భోజనం పెట్టి ఆకలితో ఉన్న వారి కడుపు నింపొచ్చు. ఇలా ఇతరుల కడుపు నింపడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘ సభ్యులు, యువజన సంఘ సభ్యులు, పోప మరియు మహిళా సంఘ సభ్యులు, అష్టమవాడ పెద్దలు పాల్గొన్నారు

By Gantyala Praveen | September 12, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1