|
modi add 1

రోజుకు వెయ్యి గుంజి నెలకు వెయ్యి ఇవ్వటమే సామాజిక న్యాయమా

రోజుకు వెయ్యి గుంజి నెలకు వెయ్యి ఇవ్వటమే సామాజిక న్యాయమా అంటూ ఆటో వాలాలు ఆర్టీసీ క్రాస్ రోడ్లో కదం తొక్కారు. ఈరోజు హైదరబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆద్వర్యంలో ఆటో డ్రైవర్లు తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం పేరున రోజుకు వెయ్యి గుంజి నెలకు వెయ్యి ఇవ్వటడమే సామాజిక న్యాయమా అంటూ ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై నిరసన తెలియజేశారు. ప్రభుత్వ అనుచిత నిర్ణయాల కారణంగా జీవనోపాధి కోల్పోయినందున ఆ లోటు భర్తీ కొరకు ప్రభుత్వానికి పలు డిమాండ్లతో ఆటో కార్మికులు కదం తొక్కారు. పలు డిమాండ్ల పై ప్రశ్నించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు రోడ్డు పై ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నంద కిషోర్,ప్రధాన కార్యదర్శి బి.పెంటయ్య గౌడ్, గ్రేటర్ ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి యన్.కిషన్, సోషల్ మీడియా ఇంచార్జీ సంతోష్ గౌడ్ , BPTMM సౌత్ సెంట్రల్ జోన్ ఇంచార్జీ హాబీబ్,BPTMM రాష్ట్ర కార్యదర్శి రాములు,స్కూల్ వాన్ డ్రైవర్స్ యూనియన్ ప్రధానకార్యదర్శి వజ్ర లింగం, BPTMM గ్రేటర్ ఇంచార్జ్ కృష్ణ మూర్తి, BPTMM జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 24, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1