|
modi add 1

విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయికల్ పట్టణం లో భౌతిక మరియు జీవశాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో బొడ్డుపల్లి రక్షిత( భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల) మొదటి స్థానంలో నిలిచింది . ఏ. దీక్షాయిని (రాయికల్ కస్తూర్బా పాఠశాల) ద్వితీయ స్థానంలో నిలిచింది . ఎంపికైన ఇద్దరు విద్యార్థులు ఈనెల 20వ తేదీన జగిత్యాలలో జరిగే జిల్లా స్థాయిపోటీలలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సైన్స్ ఉపాధ్యాయులు పొన్నం రమేష్,గాజింగి రాజేశం, కలవకోట కార్తీక్,పద్మ విజయకుమార్, రాజేందర్, రమేష్,రత్నాకర్,ఉమారాణి మండలం లోని ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 17, 2024 | 0 Comments

రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఐపీఎస్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

సుల్తానాబాద్,ఫిబ్రవరి 26 (జనం గొంతు): సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు.ఈ నెల 25వ తేదీ ఆదివారం కరీంనగర్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఓపెన్ కుంఫు,కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జి హర్షవర్ధన్ కట,స్పారింగ్ విభాగంలో బంగారు పథకం సాధించగా ఎస్ సృజన్,ఏ విశ్వాస్ కట విభాగంలో బంగారు పతకాలు సాధించారు.ఐపీఎస్ పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటే వలన మంచి క్రమశిక్షణ ఏర్పడుతుందని తమ స్వీయ రక్షణకు,ఆత్మ రక్షణకు కరాటే అవసరమన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 26, 2024 | 0 Comments

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ప్రారంభమైన క్రీడా పోటీలు

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ పట్టణంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 2023 - 24 విద్యా సంవత్సరం యొక్క వార్షిక క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా రాయికల్ తహశీల్దార్ ఖయ్యూం జాతీయ క్రీడా కారుడు గణేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేస్తూ అతిధి కి ఆహ్వానం పలికారు. అనంతరం ఒలంపిక్ క్రీడాజ్యోతి వెలిగించి స్పోర్ట్స్ ఫ్లాగ్ ఎగరవేయడం జరిగింది. అనంతరం హీలియం గాలితో నింపిన త్రివర్ణ పతాకం రంగుల బెలూన్లను ఆకాశంలోకి వదిలి ఆటలను ప్రారంభించారు. ఇందులో భాగంగా జాతీయ అథ్లెటిక్స్ లో ఎంపికైన గణేష్ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జె తిరుపతిరావు, ప్రిన్సిపాల్ జె వేణుగోపాలరావు, MRO విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరియు పోషకులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 29, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1