రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 25 వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు వ్యక్తిగత కారణాలవల్ల బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్టు అలాగే డివిజన్ అభివృద్ధికి సహకరించే పార్టీతో ముందుకు వెళ్తామని పత్రిక ప్రకటనలో తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25వ డివిజన్ ప్రజలు గత 20 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను శరవేగంగా చేయమని మున్సిపల్ అధికారులను ఆదేశించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి,సహకరిస్తున్న అధికారులకు 25 వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ప్రత్యేక ధన్యవాదాలు పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
Your experience on this site will be improved by allowing cookies.