రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయికల్ ఎమ్మార్వో మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం, మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు విచ్చేసి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన వర్కింగ్ మోడల్స్ ను వీక్షించి, చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ విద్యార్థులు తమలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించారని, విద్యార్థులను చూస్తూ ఉంటే బాల శాస్త్రవేత్తలుగా కనిపిస్తున్నారని అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు చేయడం, చాలా బాగుందని అన్నారు. విద్యార్థులు రూపొందించిన ఏటీఎం, రోబో, అగ్నిపర్వత విస్ఫోటనం, కిడ్నీ, చంద్రయాన్ వర్కింగ్ మోడల్, సూర్య కుటుంబం, రక్త ప్రసరణ, మినీ ఎయిర్ కూలర్, దాదాపు 170 కి పైగా వర్కింగ్ మోడల్స్ చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలె శేఖర్ జయశ్రీ, అకాడమీ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ మండలం లోని కుమ్మరి పల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కడకుంట్ల అభయ్ రాజ్ ఈ నెల 7 వ తేదీ నుంచి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని తక్కువ ఖర్చు మరియు ఖర్చు లేని బోధనోపకరణాలను రూపొందించిన సూపర్ సైన్స్ కిట్ ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేలా ప్రయోగాలు ప్రదర్శించగా ఈ నెల 21 నుండి పుదుచ్చేరిలో జరిగే దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా అభయ్ రాజ్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అభయ్ రాజ్ ను జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము, జగిత్యాల జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, మండల విద్యాశాఖాధికారి శ్రీపతి రాఘవులు గారు తదితరులు అభినందించారు.
Your experience on this site will be improved by allowing cookies.