జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయికల్ మండలంలోని తాట్లవాయి ఉన్నత పాఠశాలలో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన సైన్స్ పరికరాలతో ఎగ్జిబిషన్ నిర్వహించడమైనది. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా, వారు తయారు చేసిన పరికరాల గురించి, వాటి పని విధానం గురించి వివరించడం జరిగినది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బోగ రమేష్ మాట్లాడుతూ సైన్స్ కు మన జీవితంతో విడదీయరాని సంబంధం ఉందని, ఈరోజు మనం అనుభవిస్తున్న అన్ని రకాల సౌలభ్యాలు,సౌకర్యాలు సైన్స్ వల్లనేనని,అందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలకు మనం రుణపడి ఉన్నామని, విద్యార్థులు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరు శాస్త్రీయ అవగాహన కలిగి ఉన్నప్పుడే,సమాజంలోని మూఢత్వాన్ని తొలగించగలమని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏనుగు శ్రీనివాసరెడ్డి,పొత్తూరి రవీందర్, ఏలేటి లావణ్య, చంద సాగరిక, ఎనగండ్ల శ్రీధర్, పులిపాటి శ్రీదేవి, దువ్వ చంద్రకళ, చీర్నేని రవికుమార్, బింగి పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఇటిక్యాల ఆదర్శ పాఠశాలలో సర్ సివి రామన్ నేషనల్ సైన్స్ డే ను పురస్కరించుకొని పాఠశాలలో సైన్స్ ఫెయిర్ మరియు గణిత నమూనాలను ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులు వివిధ రకాల నమూనాలను ప్రదర్శించి సైన్స్ పట్ల ఉన్న ఆసక్తిని ప్రదర్శించారు. మరియు వివిధ రకాల సైన్స్ పటాలను రంగురంగుల కలర్స్ తో నేలపై గీసి ప్రదర్శించడం జరిగింది. మరియు సాయంత్రం విద్యార్థి క్విజ్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీధర్ తో పాటు గణిత మరియు సైన్స్ ఉపాధ్యాయులు సలావుద్దీన్, ప్రవీణ్ కుమార్, రజిత, ఉషారాణి, ప్రదీప, జ్యోతి మరియు రవళి, అఖిల తో పాటు మిగతా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.
Your experience on this site will be improved by allowing cookies.