రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ పరిధిలోని పికె రామయ్య కాలని కి చెందిన కుమార్ సుదర్శన్ 35 సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో మంగళవారం రాత్రి మంచిర్యాలలో మరణించాడని బుధవారం ఉదయం దహన సంస్కారాలు నిర్వహించడానికి సుదర్శన్ యొక్క అంతిమయాత్రకు సహాయం చేయవలసిందిగా మృతిని కుటుంబ సభ్యులు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ చేసి సహాయం కోరగా సుదర్శన్ అంతిమయాత్రకు కావలసిన పాడే కు సంబంధించిన అన్ని సామాన్లు మృతుని ఇంటి వద్దకు పంపించారని స్థానికులు తెలిపారు, మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు మృతి చెందిన సుదర్శన్ కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారని కుటుంబ పెద్ద దిక్కుగా ఉన్న సుదర్శన్ అకాల మరణంతో భార్య పిల్లలు అనాధగా మారారని స్థానికులు తెలిపారు,ఈ కార్యక్రమానికి సహాయం అందించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మల్లేష్ అన్న కు మరియు ఫౌండేషన్ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
Your experience on this site will be improved by allowing cookies.