జగిత్యాల పట్టణంలో ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రముఖ జాతీయ దినపత్రిక "మీడియా టుడే" క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాయటంలో, సమస్యలను వెలికితీయటంలో పత్రికల పాత్ర ఎంతో ఉందని , అనతి కాలంలో నే మీడియా టుడే పత్రిక తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మీడియా టుడే చీఫ్ ఎడిటర్ ఏ.ఎం. రాజురెడ్డి, ఎడిటర్ కడకుంట్ల జగదీశ్వర్, వార్తా పత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎల్లాల రాజేందర్ రెడ్డి, సాక్షి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కందుకూరి శశిధర్, సిక్స్ టీవీ ఉమ్మడి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ప్రవీణ్ కుమార్ ,భారత్ టుడే రిపోర్టర్ సిరిసిల్ల వేణుగోపాల్, నమస్తే తెలంగాణ రూరల్ రిపోర్టర్ బండ స్వామి, బి ఆర్ కె స్ట్రింగర్ గాజుల మహేష్, మహా న్యూస్ స్ట్రింగర్ రఘు ఐ న్యూస్ స్ప్రింగర్ శ్రీకాంత్ గౌడ్, మేఘ9 స్ట్రింగర్ చందు మరియు మీడియా టుడే రిపోర్టర్ లవులి సంతోష్ తదితరులు పాల్గొన్నారు
Your experience on this site will be improved by allowing cookies.