రాయికల్ మండలం మూటపెల్లి గ్రామం లో చిన్ననాటి గురువు మారంపెల్లి నర్సయ్య సారు దీన పరిస్థితికి చలించిన పూర్వ విద్యార్థులు (7వ తరగతి 2000-2001 బ్యాచ్ ) ఉపాధ్యాయుని కావాల్సిన 20వేల విలువగల నిత్యావసర వస్తువులు, బియ్యం, సిలిండర్ పప్పులు, సబ్బులు, కూరగాయలు, బట్టలు, నగదును సహాయంగా అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాల్లో విద్యార్థులు బండి దిలీప్,గుండ సురేష్, దాసరి రాజేందర్, బట్టు భూమేష్ ,మధసు లక్ష్మి నరసయ్య,ముకుంద భరత్ మరియు గ్రామ మాజీ సర్పంచ్ బెక్కం తిరుపతి పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.