|
modi add 1

ప్రతీ క్షణాన్ని తీయని వెన్నెలలా మారుస్తూ మన తోడు ఉండే బంధం ఒక్కటే స్నేహం .

మన ప్రతీ కష్టంలో సుఖంలో జీవితాంతం మన వెన్నంటి ఉండి ప్రతీ క్షణాన్ని తీయని వెన్నెలలా మారుస్తూ మన తోడు ఉండే బంధం స్నేహం ఒక్కటే. అటువంటి బంధానికి గొప్ప పండగ స్నేహితుల దినోత్సవం. భారత దేశంలో ప్రతీ సంవత్సరం ఆగస్టు నెల మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. జీవితంలో ప్రతీ రోజును ఆనందంగా ఉంచే మిత్రులతో రాయికల్ పట్టణంలోని కేశవనగర్ పద్మశాలి యువజన సంఘం సభ్యులు ఆనందంగా ఆత్మీయంగా కలుసుకొని స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకొన్నారు. స్నేహితులు అంటే కేవలం ఒక్క పాఠశాలలో చదివేవారు మాత్రమే కాదు ఆపదలో, సంతోషంలో వెన్నటి ఉండి మనకు తోడునీడగా ఉండే ప్రతీ ఒక్కరూ మన స్నేహితులే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘ అధ్యక్షులు ఎలిగేటి సత్యనారాయణ,ఉపాధ్యక్షులు బొమ్మ కంటి నాగరాజు , ప్రధాన కార్యదర్శి గంట్యాల ప్రవీణ్, సంఘ సభ్యులు మామిడాల రాజశేఖర్, రంజిత్, రమేష్, చిలివేరి శ్రీనాథ్, అను మల్ల వెంకటేష్, సాయి,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 05, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1