|
modi add 1

కేసిఆర్ తెలంగాణ ను మోసం చేసి మొసలి కన్నీరు పెడుతుండు. సిఎం రేవంత్ రెడ్డి.

క్రిష్ణ గోదావరి పరివాహక ప్రాంత నీటి ప్రాజెక్టుల విషయంలో గత ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేనంతగా మోసం చేసాడని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రిష్ణ గోదావరి పరివాహక ప్రాంతం ప్రాజెక్టు లు కేంద్ర ప్రభుత్వం తన ఆదీనంలోకి తీసుకునేందుకు అన్ని రకాల ఆమోదాలు అందించి ఇప్పుడేమో అది తమ ప్రభుత్వమే కేంద్రానికి ఇచ్చేస్తుందని అబద్దాల ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. దానికి అనుగుణంగా ఆయన ముఖ్యమంత్రి గా సంతకం చేసిన పత్రాలను సమావేశంలో ప్రదర్శించారు. క్రిష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లో కేంద్ర మంత్రి చైర్మన్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి లు సబ్యులు గా ఉంటారని . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి అలాగే విభజన అనంతరం ప్రాజెక్టుల అనుమతి కేంద్ర జలవనరుల అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. క్రిష్ణ నదీ పరివాహక ప్రాంత నీటిలోని 811 టీఎంసీల లలో 68% నీటి వాటాకు తెలంగాణ అనుమతి ఉండగా కేవలం 299 టిఎంసి లకు మాత్రమే ఒప్పుకొని సంతకాలు చేసారని పత్రాలను చూపించారు. అలాగే రాయలసీమ కు నీటి సరఫరా కోసం జీవో నెంబర్ 203 పేరుతో రోజుకు 8 టిఎంసి లో నీటిని తోడుకునేందుకు దొడ్డిదారిన 05/05/2020 న మెగా క్రిష్ణ రెడ్డికి అనుమతులిచ్చారని. అదే సమయంలో కేంద్రం జలశక్తి సమావేశాలను టెండర్లు పూర్తయ్యే వరకు నాటకీయంగా వాయిదా వేస్తూవచ్చారని తెలిపారు. నల్గొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సస్యశ్యామలం చేసే ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు ను నిర్లక్ష్యం చేసి. 92500 కోట్ల ఖర్చు ఏడాదికి 10 వేల కోట్ల నిర్వహణ ఖర్చు చేయించే కాలేశ్వరం ప్రాజెక్టు ను కట్టాడని విమర్శించారు. ఇంత చేసినా కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీరు అందించలేదని తెలిపారు. తమ ప్రభుత్వం ఏమాత్రం తెలంగాణ కు అన్యాయం చేసే ఇటువంటి చీకటి ఒప్పందాలకు పూనుకోదని. అలాగే తెలంగాణ కు నీటి వాటా అంశాల్లో సమాన వాటా దక్కే వరకు కేంద్ర జలవనరుల శాఖ కు ప్రాజెక్టుల ను అప్పగించేసింది లేదని ఖరాఖండిగా చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు ను ఆంద్రపోలీసులు ఆక్రమించుకుంటే కనీస స్పందన లేని దద్దమ్మ కేసీఆర్ అని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ పాల్గొన్నారు.

By Miryala Pranay | February 04, 2024 | 2 Comments

కార్మిక సంక్షేమ మండళ్లను వెంటనే ఏర్పాటు చేయాలి -కనీస వేతన జీవో లేక శ్రమదోపిడి.. -వీధి వ్యాపారులపై చిన్నచూపు.. -కలెక్టరేటు ముందు బిఎంఎస్ ధర్నా..

స్కీం ఉద్యోగులు, అంగనవాడి వర్కర్స్, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు బూర్ల లక్ష్మినారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల రామగుండంలో జరిగిన బిఎంఎస్ 4వ త్రైవార్షిక రాష్ట్ర మహాసభల సందర్భంగా చేసిన తీర్మాణాలను అమలు పరచాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేటు ముందు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం దారుణమన్నారు. అలాంటి వారికోసం కార్మిక మండళ్ళను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతన జీవో అమలు కాకపోవడం వల్ల శ్రమదోపిడి జరుగుతోందన్న ఆయన, జీవో 5ను అమలు చేయాలని కోరారు. వీధి వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉందని, వీధి వ్యాపారులను గుర్తించి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆటో, ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి కంది శ్రీనివాస్ గౌడ్, సింగరేణి కార్మిక సంఘ్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ఆర్ఎఫ్సిఎల్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంక రాజేష్, ఎన్టిపీసి కార్మిక సంఘ్ ప్రధాన కార్యదర్శి ఎన్.సాగర్ రాజు, కోశాధికారి చల్ల సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 28, 2024 | 0 Comments

ఈ రోజు B.D Reddy కన్వెన్షన్ లోని యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పూర్ణచంద్రరావు గారి వివహనికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు& పిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి గారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

By NYALAKONDA ANIL DESAI | February 29, 2024 | 0 Comments

గోదావరి నది తీరంలోని చెత్తాచెదారాన్ని తొలగించండి.

- రామగుండం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేసిన విశ్వహిందూ పరిషత్ గోదావరినదిలో పుష్కరఘాట్కు కు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు కలుగకుండా, అంటు వ్యాధులు ప్రబలకుండా గోదావరినదిలో చెత్తాచెదారం తొలగించడంతో పాటు ఒడ్డున మరియు దారుల వెంట పారిశుధ్య నిర్వహణతో గోదావరి వద్ద భక్తులు వేసవి దృష్ట్యా ఎండలో వేచి ఉండేలా కాకుండా నీడ కల్పించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని, గోదావరినది ఒడ్డున పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు దుస్తులు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు చేయడంతో పాటు షవర్లు ఏర్పాటు చేయాలి,తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు మంచినీటి సౌకర్యం, తగినంత మంది లైఫ్ సేవర్స్ మరియు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి మ్యాడగోని రవీందర్, సహ కార్యదర్శి కొండపర్తి లింగన్న,సంపత్, నగరబజరంగ్దళ్ సంయోజక్ దిగంబర్ సహసంయోజక్ అరవింద్, ఆరెల్లి జలంధర్, చక్రపాణి, బాలు,అనిల్,కిరణ్, సురేష్, కార్తీక్, దుబాసి తిరుపతి, విశ్వహిందూ పరిషత్ బజరంగ్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 05, 2024 | 0 Comments

నూతన మహిళా వృద్ధాశ్రమం ప్రారంభం

ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం ఏర్పాటుకు చర్యలు గురువారం నాడు, జిల్లాలోని శామిర్పెట్ వద్ద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3.20 ఎకరాల్లో 15 కోట్లతో నిర్మించిన మహిళా వృద్ధాప్య ఆశ్రమాన్ని (రుద్రమ దేవి ఓల్డ్ ఏజ్ హోం సొసైటీని) రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు అదే విధంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్ధలు) పింకేశ్ కుమార్, ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్షి, తదితరులు ప్రారంభించారు. అనంతరం కోమటిరెడ్డి సుశీలమ్మ విగ్రహాన్ని సీతక్క గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పెద్దవాళ్ళు పసి పిల్లలతో సమానమని, వారి ఆలన పాలన చుస్కోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఎంతో ఉందన్నారు. వాళ్ళు లేకుంటే మనం లేమని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ఆశ్రమాల అవసరం మనకి రాదని అన్నారు. ప్రభుత్వం వృద్దులకు అండగా ఉంటుందని తెలిపారు. అలాగే నీటిని అందిస్తామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అదే విధంగా మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు. ఈ రుద్రమ దేవి సొసైటీ మనందరికీ ఆదర్శమని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ఆరు గ్యారెంటీలతో రూపకల్పన చేసిందన్నారు. తొలి విడతగా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణానికి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ లభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పాలకుర్తి, శాసనసభ్యులు యశశ్విని రెడ్డి, రాణి రుద్రమ్మ మహిళా సొసైటీ సీఈవో కవిత రెడ్డి, డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి, వివిధ శాఖల అధికారులు, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు

By NYALAKONDA ANIL DESAI | March 07, 2024 | 0 Comments

తాట్లవాయి గ్రామములో యువకుని దారుణ హత్య

రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన నాగెల్లి సురేష్(24) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తల పై బలమైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసి, వ్యవసాయ బావిలో పడవేశారు. మృతుని తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తూ సంఘటనా స్థలాన్ని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ గారు, రూరల్ సిఐ ఆరిఫ్ అలీ ఖాన్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ బృందం తో నేర స్థలం పరిశీలించారు మృతుని మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

By NYALAKONDA ANIL DESAI | March 08, 2024 | 0 Comments

కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు అన్నారు. సోమవారం రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్ వైద్యులచే పట్టణంలోని బాలుర పాఠశాలలో చేపట్టిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 250మందికి కంటి పరీక్షలు చేయగా 150మందికి కంటి ఆపరేషన్ కోసం గుర్తించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు లయన్స్ క్లబ్ సుమారు 1800 మందికి కంటి ఆపరేషన్లతో పాటుగా మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.పద్మశాలి సేవా సంఘంలో నిర్వహిస్తున్న ఆక్యుప్రెషర్ తెరఫీ చికిత్స శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో నిరుపేదలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ ఖయ్యూం, కంటి వైద్యులు డాక్టర్ ప్రభాకర్,లయన్స్ క్లబ్ డిసీలు మ్యా కల రమేష్,బత్తిని భూమయ్య,అధ్యక్షులు కొమ్ముల ఆదిరెడ్డి,ప్రధాన కార్యదర్శి మోసారపు శ్రీకాంత్,కోశాధికారి గంట్యాల ప్రవీణ్,లయన్స్ క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్,కనపర్తి శ్రీనివాస్, ఎద్దండి దివాకర్,బొమ్మ కంటి నవీన్,మండలోజు శ్రీనివాస్,పారిపెల్లి శ్రీనివాస్,ఆడెపు రాంప్రసాద్,కుర్మా సుదర్శన్,కొత్తపెళ్లి రంజిత్,సామల్ల గోపాల్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 11, 2024 | 0 Comments

నేషనల్ చీఫ్ లీగల్ అడ్వైజర్ గా ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కురుమ నియమాకం*

ఈరోజు హైదరాబాదులో నేషనల్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేషనల్ చీఫ్ లీగల్ అడ్వైజర్ గా నర్రి స్వామి కురుమ ను నియమించినట్లు నేషనల్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అనేకమైన సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తూ ఎంతోమందికి మరియు ఎన్నో సామాజిక సంస్థలకు అనేక ఉద్యమ సంఘాల నిర్మాణాలకు కిలక పాత్ర పోషించిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మ గారిని పార్టీ నేషనల్ చీఫ్ లీగల్ అడ్వైజర్ గా నియమించుకోవడం చాలా సంతోషకరమన్నారు ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి,ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మ గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మేము చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు మరియు అనేక లీగల్ అంశాలపై పోరాటాలు నిర్వహిస్తున్న సందర్భంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీధర్ గారు నేషనల్ చీఫ్ లీగల్ అడ్వైజర్ గా నియమిస్తూ నియమాక పత్రాన్ని అందజేసి సన్మానం చేయడం చాలా సంతోషకరం నేషనల్ ప్రజా కాంగ్రెస్ పార్టీ పంచ సూత్రాలు గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించే వరకు హైకోర్టు సుప్రీంకోర్టులో వాళ్లు పార్టీ చేసే లీగల్ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు, తెలంగాణ నాయకులు, ఉదయలక్ష్మి,విజయలక్ష్మి, వాసుదేవరావు , నామాని భాస్కర్, అంజలి దేవి , సమత , దుర్గా కళ్యాణ్ అనేకమంది నాయకులు పాల్గొన్నారు

By NYALAKONDA ANIL DESAI | March 15, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1