రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ మహంకాళి స్వామి తండ్రిని కలసి పరామర్శించారు. కాలు విరిగిన కారణంగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ 57వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పాతపెల్లి ఎల్లయ్యను వారి నివాసంలో కలసి పరామర్శించారు. కాలు సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.