బుధవారం విడుదలైన పదోతరగతి ఫలితాలలో రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. చిలుక సహస్ర 575 మార్కులు సాధించి రాయికల్ మండల్ టాపర్ గా నిలిచింది. అల్లకొండ సాయిరాం 572 మార్కులు, బిట్ల శ్రావ్య 571, బందారపు హశ్విక 570 మార్కులు సాధించారు. 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థుల సంఖ్య 20మంది ,500 కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 63మంది , వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ తెలిపారు.


Comments 0